రాష్ట్రీయం

APPSC Group 2 Recruitment 2024: గుడ్ న్యూస్, APPSC గ్రూప్‌ -2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు, జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు అంటే జనవరి 17 వరకు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు (APPSC Group 2 Application Date Extended 2024) ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు

Sanjeev Kumar Resigns to YCP: కర్నూలులో వైసీపీకీ మరో బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌, త్వరలో టీడీపీలో చేరే అవకాశం

Hazarath Reddy

ఏపీలో వైసీపీకీ మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సంజీవ్‌ కుమార్‌ తెలిపారు.

Kesineni Nani Resigns to MP: ఎంపీ పదవికి కేశినేని నాని రాజీనామా, తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కి వినతి

Hazarath Reddy

ఏపీలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా (Kesineni Nani Resigns to MP) చేశారు. తన రాజీనామాను లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు.

MP Kesineni Nani Meet CM Jagan: సీఎం జగన్‌‌తో ముగిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ, కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ ముగిసింది. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత కూడా ఉన్నారు.

Advertisement

Attacking On TSRTC Staff: ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదు, డ్రైవర్‌పై బైకర్ దాడి నేపథ్యంలో ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ డ్రైవర్ మీద బైకర్ దాడి చేసిన వీడియో వైరల్ అయిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మండిపడ్డారు.

Charminar Express Derailment: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రైల్వేశాఖ, పూర్తిగా కోలుకునేవరకు చికిత్స అందిస్తామని వెల్లడి

Hazarath Reddy

నాంపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు అందజేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది.

Anticipatory Bail to Chandrababu: మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, IRR, మద్యం, ఉచిత ఇసుక కేసులలో బెయిల్

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు (AP High Court) ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ సందర్భంగా దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎక్కడా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు.

Praja Palana Applications Fly on Road: వీడియో ఇదిగో, రోడ్డుపై కుప్పలుగా ప్రజా పాలన దరఖాస్తులు, నిర్లక్యం వహించిన అధికారిని సస్పెండ్ చేసిన జీహెచ్ఎంసీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే హయత్‌నగర్‌ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ప్రభుత్వం అప్పగించింది.

Advertisement

Telangana Woman Murder Case: షాకింగ్ వీడియో ఇదిగో, మొయినాబాద్‌లో పట్టపగలే యువతిని చంపి కాల్చివేసిన దుండగులు, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

మొయినాబాద్‌లో పట్టపగలే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను పరిశీలించారు.

Dead Cockroach Found in Biryani: వీడియో ఇదిగో.. బిర్యానీ తినేవాళ్లు ముందు ఈ వీడియో చూడండి, జూబ్లీహిల్స్ రెస్టారెంట్‌లో కస్టమర్లకు వడ్డించిన బిర్యానీలో చనిపోయిన బొద్దింక

Hazarath Reddy

జూబ్లీహిల్స్‌లో బిర్యానీ రుచి చూడటానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక వచ్చింది. ఇదేంటని నిలదీస్తే.. దిక్కున్న చోట చెప్పుకోమని నిర్వాహకులు ఎదురుదాడికి దిగారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏబీఎస్ బార్బిక్యూ హోటల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Telangana: వీడియో ఇదిగో, మెహిదీపట్నంలో నకిలీ కాస్మెటిక్‌ తయారీ యూనిట్‌పై డీసీఏ దాడులు, విషపూరిత రసాయనం స్వాధీనం చేసుకున్న అధికారులు

Hazarath Reddy

మెహిదీపట్నంలోని నకిలీ మెహందీ తయారీ యూనిట్‌ షకీల్‌ ఇండస్ట్రీస్‌పై డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) దాడులు నిర్వహించి నిర్వాహకుడు యూసుఫ్‌ను అరెస్టు చేసింది. భారీ మొత్తంలో నకిలీ మెహందీని స్వాధీనం చేసుకున్న డీసీఏ అధికారులు.. యూనిట్‌లో పిక్రామిక్ యాసిడ్ అనే విష రసాయనాన్ని వాడుతున్నట్లు తెలిపారు.

Students Protest in Osmania University: వడ్డించే ఆహారంలో పురుగులు, నిరసనకు దిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు అంబర్‌పేటలోని లేడీస్‌ హాస్టల్ కాంప్లెక్స్ ఎదుట హాస్టల్‌లో వడ్డించే ఆహారంలో పురుగులు, కీటకాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు నిరసనకు దిగారు. మూడు నెలలుగా తమ సమస్యలను అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. వీడియో ఇదిగో..

Advertisement

Telangana Farm Loan Waiver: రైతుల రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, 30 లక్షల మంది రైతుల రూ.32 వేల కోట్ల పంట రుణాల మాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ‘రైతులకు ఓ గుడ్ న్యూస్. 30 లక్షల మందికి చెందిన రూ.32 వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయబోతున్నది

Six Guarantees Application Status: ఆరు గ్యారెంటీలకు అప్లై చేసి ఉంటే దరఖాస్తు స్టేటస్ ఇలా తెలుసుకోండి, అయితే మీ అప్లికేషన్ నంబర్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి

Hazarath Reddy

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజల వద్దకు పాలనే లక్ష్యంగా ఆరు గ్యారంటీల (six guarantees) ఆమలుకు శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ప్రజాపాలన పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించి ప్రజాపాలన వివరాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు prajapalana.telanga na.gov.in వెబ్‌సైట్‌ రూపొందించింది.

Discount on Traffic Challans: పెండింగ్ ట్రాఫిక్ చలానాలు ఇంకా క్లియర్ చేసుకోలేదా, అయితే ఈ రోజు వరకే డిస్కౌంట్, వాహనదారులు వెంటనే అలర్ట్‌ అవ్వండి

Hazarath Reddy

తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాల చెల్లింపునకు (Discount on Traffic Challans) గడువు నేటితో ముగియనుంది. కొంత మంది వాహనాదారులు చలాన్లను చెల్లించగా మరికొందరు చెల్లించలేదని తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వాహనాలకు కూడా జరిమానాలు ఉన్నా ఇంకా చెల్లించనట్లు సమాచారం.

Charminar Express Derailment: చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో కీలక విషయాలను వెల్లడించిన రైల్వే శాఖ, రైలు డెడ్ ఎండ్‌కు వచ్చిన తర్వాతే సైడ్‌ వాల్‌ను ఢీకొట్టిందని వెల్లడి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై మంత్రి పొన్నం విచారం

Hazarath Reddy

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం జరిగింది. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది.మొ​త్తం మూడు బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు

Advertisement

Charminar Express Derailment Video: వీడియో ఇదిగో, సైడ్‌ వాల్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌, 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు

Hazarath Reddy

నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఎస్‌ 2, ఎస్‌ 3, ఎస్‌ 6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి

Hyderabad: బీపీ ఎక్కువై చనిపోయిన భర్త, విషాదాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య, హైదరాబాద్ లో ఘటన

VNS

గచ్చిబౌలిలో ప్రైవేటు ఉద్యోగం చేసే అమన్‌కుమార్‌ సింగ్‌ గత నెల 26న రాత్రి ఒక్కసారిగా బీపీ ఎక్కువై బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందాడు. అప్పటి నుంచి 15 రోజులుగా అస్మిత మానసిక వేదనను అనుభవించింది. భర్త ఫొటోను దగ్గర పెట్టుకొని బాధపడింది. చివరికి మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఆరాంఘర్‌ కాలనీలోని పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్, ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టిన ట్రైన్, 50 మందికి గాయాలు

VNS

చార్మినార్ ఎక్స్ ప్రెస్ (Charminar Express) ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్ లో (Nampally) చార్మినార్ ఎక్స్ ప్రెస్ మూడు భోగీలు పట్టలు తప్పాయి. స్టేషన్ నుంచి బయల్దేరే సమయంలో ఫ్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో మూడు భోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి.

Telangana Police Alert: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? అయితే ఇవి చేయకపోతే మీ ఇళ్లు గుల్ల అవ్వడం ఖాయం, ఊరెళ్తున్నవారికి పోలీసులు చేస్తున్న సూచనలివే!

VNS

సంక్రాంతికి నగరాలను వదిలి ఇంటిల్లిపాది సొంతూళ్లకు వెళ్లి మూడ్రోజుల పాటు పండుగ చేసుకుంటే.. మీకు తెలియకుండా ఇచ్చే సమాచారంతో దొంగలు కూడా మీ ఇంట్లో దొంగతనం చేసి పండుగ చేసుకుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు

Advertisement
Advertisement