ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Elections 2024: గేదెను ఢీకొట్టిన కారు, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూఖ్‌కి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పాణ్యం మండలం తమ్మరాజు పల్లి గ్రామం వద్ద టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూఖ్ కీ ప్రమాదం తప్పింది.. నంద్యాల నుంచి కర్నూలు వెళ్తుండగా అడ్డొచ్చిన గేదెని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది..కారు బెలూన్ ఓపెన్ అవ్వడంతో స్వల్ప గాయాలతో నంద్యాల టీడీపీ అభ్యర్ధి ఫరూఖ్ బయటపడ్డారు.

YSRCP Memantha Siddham Bus Yatra: 12వ రోజు 'మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. గంటావారిపాలెం నుంచి జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం..

sajaya

మేమంతా సిద్ధం 12వ రోజు బుధవారం (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైయ‌స్ఆర్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైయ‌స్ఆర్‌సీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరుతారు.

TOEFL Exams In AP: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో 2 రోజుల పాటు టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు..పాల్గొంటున్న 21 లక్షల మంది పాఠశాల విద్యార్థులు

sajaya

విద్యార్థులను ఇంగ్లిష్ లో, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ కు సంబంధించిన ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు నేడు నిర్వహించనున్నారు.

Tamanna Simhadri : పవన్ కళ్యాణ్‌పై పోటీకి పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి

sajaya

ట్రాన్స్‌జెండర్ అయిన సింహాద్రి తమన్నా వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భరత చైతన్య యువజన (బీసీవై) పార్టీ తరపున పోటీ చేయనున్నారు. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా తమన్నా ఎన్నికల్లో పోరాడనుంది.

Advertisement

Heatwave Warning For AP: ఏపీలో వచ్చే రెండు రోజులు 145 మండలాల్లో వడగాడ్పులు, బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ, మండలాల లిస్టు ఇదిగో..

Hazarath Reddy

బుధవారం 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 16 మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Ugadi 2024: ఉగాది సందర్భంగా సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం, తెలుగు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం జరిగింది.

Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో గృహప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్, ఉగాది పండుగను వేదపండితుల మధ్య జరుపుకున్న జనసేనాని

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేనాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టిన మొదటిరోజే స్థానికంగా ఓ ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటానని పవన్ ప్రకటించారు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురంలో మంగళవారం గృహప్రవేశం చేశారు

Ugadi Asthanam at Tirumala: తిరుమలలో కన్నుల పండువగా ఉగాది ఆస్థాన వేడుకలు

Rudra

తిరుమలలో(Tirumala) శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని(Ugadi Asthanam) టీటీడీ(TTD) మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించింది.

Advertisement

Ugadi Festival Telugu Wishes: క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి

Rudra

షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి.

Royal Challengers Bengaluru Greetings: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఉగాది ప్రత్యేక శుభాకాంక్షలు.. మీరూ చూడండి!

Rudra

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఉగాది ప్రత్యేక శుభాకాంక్షలు

Andhra Pradesh Elections 2024: సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రద్దు చేసిన టీడీపీ, దాని స్థానంలో ప్రజా మేనిఫెస్టో రూపకల్సన, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు

Hazarath Reddy

ఏపీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రద్దు చేసి దాని స్థానంలో ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. కూటమి ఆధ్వర్యంలో త్వరలో కొత్త మేనిఫెస్టో ఉంటుందని ప్రజలు సలహాలు ఇవ్వాలని వర్ల రామయ్య తెలిపారు

Andhra Pradesh: రోడ్డు లేకపోవడంతో రాని అంబులెన్స్, నడిరోడ్డు మీదే ఆడశిశువును ప్రసవించిన గిరిజన మహిళ, భారీగా రక్తస్రావం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల అనంతగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రసవవేదనలో ఉన్న గిరిజన మహిళ నడవలేని స్థితిలో, కొండ ప్రాంతాల మధ్యలో ఆడశిశువును ప్రసవించింది.

Advertisement

Inner Ring Road Scam: హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారనే వార్తలు ఫేక్, రూమర్స్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన ఏపీ సీఐడీ

Hazarath Reddy

ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ వస్తున్న కథనాలను ఏపీ సీఐడీ ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.

Andhra Pradesh Elections 2024: జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన చిరంజీవి, భావోద్వేగాలకు గురైన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. నిన్న అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలతో చిరంజీవి కదిలిపోయారు. తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే భారీ విరాళం అందించారు.

Andhra Pradesh Elections 2024: వైసీపీకి మాజీ మంత్రి శమంతకమణి రాజీనామా, వైసీపీ టికెట్ రాకపోవడంతో కుమారుడితో కలిసి పార్టీకి రాజీనామా

Hazarath Reddy

అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శమంతకమణి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కొడుకు అశోక్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఆమె కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినీబాల వైసీపీని వీడారు. శమంతకమణి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

Andhra Pradesh Elections 2024: విజయవాడ వెస్ట్‌లో పవన్‌కు బిగ్‌ షాక్‌, పార్టీకి రాజీనామా చేసిన పోతిన వెంకట మహేష్‌, ఏ పార్టీలోకి వెళతారంటే..

Hazarath Reddy

జనసేన పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పోతిన వెంకట మహేష్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఓ లేఖ విడుదల చేశారు. జనసేనకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు పోతిన మహేష్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృష్టి చేశారు

Advertisement

Viral Video: నమస్కారం పెట్టి.. మస్కా కొట్టి ఏకంగా అమ్మవారి నగలే నొక్కేశాడు.. ఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో వీడియో వైరల్

Rudra

ఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో దొంగతనం కలకలం రేగింది. రాత్రిపూట అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ దొంగ అమ్మవారికి దండం పెట్టి.. పది కాసుల మంగళసూత్రాన్ని కాజేసి పారిపోయాడు.

YS Jagan, Memantha Siddham: పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి.. చంద్రబాబుకు ఓటేస్తే జగన్‌ తెచ్చిన పథకాలకు ముగింపే..

sajaya

పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. చంద్రబాబుకు ఓటేస్తే జగన్‌ తెచ్చిన పథకాలకు ముగింపే.. చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే.. వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు చంద్రబాబు మార్క్ రాజకీయం. కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పేర్కొన్నారు.

AP CM YS Jagan Bus Yatra: ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర...కనిగిరిలో సీఎం జగన్‌ రోడ్‌ షో...వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు

sajaya

జువ్విగుంట క్రాస్ నుంచి పొన్నలూరు మండలం కె.అగ్రహారం చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు భారీ క్రేన్స్‌తో 10 గజమాలలతో స్వాగతం పలికారు. కె.అగ్ర‌హారం నుంచి పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల చేరుకున్న అనంత‌రం భోజన విరామం తీసుకుంటారు.

Andhra Pradesh Elections 2024: ఉండిలో చంద్రబాబుపై భగ్గుమన్న కార్యకర్తలు, ఎమ్మెల్యే టికెట్ రఘురామకు కాకుండా రామరాజుకే ఇవ్వాలని ధర్నా, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Advertisement
Advertisement