ఆంధ్ర ప్రదేశ్
Chandrababu Released from Rajahmundry Jail: వీడియో ఇదిగో, 52 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన చంద్రబాబు
Hazarath Reddyరాజమహేంద్రవరం: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) రాజమహేంద్రవరం జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు.
Chandrababu Gets Bail: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌, షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ మరుక్షణమే రద్దు, నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం సరెండర్ కావాలని ఏపీ హైకోర్టు తీర్పు
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్‌ లభించింది. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
APPSC Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, యూనివర్సిటీల్లో 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రాసెస్ మొదలు పెట్టింది. టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లోని ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Bail Granted for Babu: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌.. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు
Rudraస్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
Trains Cancelled: విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు కూడా పలు రైలు సర్వీసుల రద్దు.. వివరాలు ఇవిగో!
Rudraవిజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు.
Chandrababu Bail: బాబు మధ్యంతర బెయిల్‌ పై నేడు హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ.. చంద్రబాబుపై సీఐడీ మరో కేసు.. ఆరోపణ ఏంటంటే?
Rudraచంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Another Case Against Chandrababu: చంద్రబాబుకు సీఐడీ మళ్లీ షాక్, మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణలపై మరో కేసు నమోదు
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. కేసులో ఏ3గా చంద్రబాబును చేర్చారు.
CM Jagan Review on SIPB: రూ.19,037 కోట్ల పెట్టుబడులు, 69,565 మందికి ఉద్యోగాలు, పలు పరిశ్రమల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం, సీఎం జగన్ రివ్యూ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఈ సందర్భంగా పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
Vizianagaram Train Accident: రైలు ప్రమాద ఘటనపై పలు ప్రశ్నలను సంధించిన సీఎం జగన్, వెంటనే ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచన
Hazarath Reddyబ్రేకింగ్ సిస్టమ్ మరియు అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు? అలాగే సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది? కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది? వీటిపై నిజనిజాలు తెలుసుకోవాలని గౌరవనీయులైన ప్రధాన మంత్రిని, రైల్వే మంత్రిని నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
Vizianagaram Train Accident: రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది, సీఎం జగన్ ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyవిజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను
Skill Development Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌, రేపు వెల్లడిస్తామని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు.
Vizianagaram Train Accident: రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించిన సీఎం జగన్, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyవిజయనగరం కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను ఆ‍యన పరిశీలించారు.
Vizianagaram Train Accident: బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ఏపీ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది, రైలు ప్రమాద ఘటనపై మంత్రి బొత్సా సత్యనారాయణ
Hazarath Reddyవిజయనగరం రైలు ప్రమాదంలో బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వ యంత్రాగాన్ని అభినందించారు.
Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటన
Hazarath Reddyవిజయనగరం రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారిని ఓదార్చేందుకు విశాఖ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు సీఎం జగన్‌. నేరుగా విజయనగరం ప్రభుత్వాసుపత్రికి వారిని పరామర్శించనున్నారు. ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించనున్నారు.
Vizianagaram Train Accident: రాయగడ ప్యాసింజర్‌ రైలు లోకో పైలట్ వల్లే రైలు ప్రమాదం,కీలక విషయాలు వెలుగులోకి, ఘటనాస్థలికి బయలు దేరిన సీఎం జగన్‌
Hazarath Reddyఈ ప్రమాదానికి మానవతప్పిదమే కారణమని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే అధికారి తెలిపారు. ప్రమాదంపై ఓ మీడియా ఛానెల్‌తో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌ విశ్వజిత్‌ సాహూ మాట్లాడుతూ..రాయగడ ప్యాసింజర్‌ రైలు లోకో పైలట్ వల్లే ప్రమాదం జరిగింది. రెడ్‌ సిగ్నల్‌ను రాయగడ లోకో పైలట్ పట్టించుకోలేదు. ఫలితంగానే ఘోర ప్రమాదం సంభవించిందని అధికారి సాహూ తెలిపారు
Viziangararam Train Accident Update: విజయనగరం రైలు ప్రమాదం.. నేడు పలు రైళ్ల రద్దు.. పూర్తి వివరాలు ఇదిగో..
Rudraవిజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి.
AP Train Accident Update: విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య.. వందల సంఖ్యలో క్షతగాత్రులు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
Rudraవిజయనగరం జిల్లాలో గతరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
YS Jagan on Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సహాయ కార్యక్రమాలపై ఎప్పటికపుడు నివేదిక ఇవ్వాలని ఆదేశం
VNSవిజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన ఘోర రైలు (train accident) ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ (YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Narendra Modi on Train Accident: విజయనగరం రైల్ ప్రమాదంపై ప్రధాని మోడి తీవ్ర దిగ్బ్రాంతి, సహాయ కార్యక్రమాలపై రైల్వే మంత్రి తో మాట్లాడిన మోడి
VNSసహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడి (Narendra Modi) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తో మాట్లాడారు ప్రధాని. ప్రమాద స్థలిలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ఆరా తీశారు.
Andhra Pradesh Train Accident: విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య, ఇప్పటి వరకు ఆరుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు, హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!
VNSవిజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం (Andhra Pradesh train accident) జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో విజయనగరం (Andhra Pradesh train accident) ఆసుపత్రికి తరలిస్తున్నారు.