ఆంధ్ర ప్రదేశ్

New Ration Cards: కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఈ నెల 15 నుంచి మీ ఇంటికే రేషన్ కార్డు, పంపిణీ చేయనున్న గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్డు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

ప్రభుత్వం కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తి అవ్వడంతో జగన్ సర్కారు (Jagan Govt) పంపినీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు (Grama/ward Volunteers) లబ్ధిదారుల ఇళ్ల వద్దనే కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది.

kamya karthikeyan: మరో రికార్డును సాధించిన కామ్య, సౌత్ అమెరికాలోని అత్యంత ఎత్తైన శిఖరంను ఎక్కేసింది, ప్రపంచంలో ఈ ఘనతను సాధించిన అత్యంత పిన్న వయస్కురాలు ఈమెనే..

Hazarath Reddy

వైజాగ్‌కు చెందిన యువ పర్వతారోహకురాలు కామ్య కార్తికేయన్ (kamya karthikeyan) మరో రికార్డును సాధించింది. దక్షిణ అమెరికాలో (South America) మరియు ఆసియా వెలుపల ఎత్తైన శిఖరంగా (highest peak) ఉన్న అకాన్కాగువాను (Aconcagua) అధిరోహించిన అతి పిన్న వయస్కురాలుగా రికార్డులకెక్కింది. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలు ఈ పాపనే.. ఫిబ్రవరి 1, 2020 న ఈ యువతి అరుదైన ఘనతను సాధించింది.

AB Venkateswara Rao Suspension: వేటు పడింది, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్‌, దేశ భద్రతా రహస్యాలు లీక్ చేశాడని ఆరోపణలు, సస్పెన్షన్‌పై స్పందించిన వెంకటేశ్వరరావు

Hazarath Reddy

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) సస్పెండ్‌ చేసింది. ఉద్యోగ నియమావళి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పదవి నుంచి సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని (Chief Secretary Nilam Sawhney) శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి.. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్‌ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

Zero Interest Loans: మహిళలకు జీరో వడ్డీ రుణాలు, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్, అక్కాచెల్లెమ్మలకు అండగా.., వారి పిల్లలకు మేనమామలా తోడుగా ఉంటానన్న ఏపీ సీఎం

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు మరో అద్భుత అవకాశాన్ని అందించారు. రాష్ట్రంలో మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు (Zero Percent Interest Loans) అందచేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

Advertisement

Disha Police Station: దేశంలో రాజమండ్రిలోనే తొలిసారిగా.., దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.

Hazarath Reddy

మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేసింది. ఇందులో భాగంగా మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.

KIA Motors: అన్నీ అబద్దాలే, మేము ఎక్కడికీ తరలిపోవడం లేదు, అసత్య ప్రచారాలు నమ్మకండి, జగన్ సర్కారు మాకు అండగా ఉంది, ఇక్కడ నుంచే ప్రపంచ స్థాయి కార్లు తయారుచేస్తాం, క్లారిటీ ఇచ్చిన కియా మోటర్స్ యాజమాన్యం

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి ఏపీలో కియా మోటార్స్ న్యూస్ హాట్ టాఫిక్ గా మారింది. అనంతపురంలో ఉన్న కియో మోటర్స్ తమిళనాడుకు తరలిపోతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు కియో మోటర్స్ ను తమిళనాడుకు పంపేలా ఉన్నాయని, ఇదేం పాలన అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేసారు. అయితే ఈ వివాదం మీద కియా మోటర్స్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.

Vizag vs Hyderabad: జగన్ ఒక్కసారి కమిట్ అయితే..! ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, వైజాగ్ అయితేనే హైదరాబాద్‌తో పోటీపడుతుందని పునరుద్ఘాటన

Vikas Manda

గత ప్రభుత్వం పూల్ చేసిన 53,000 ఎకరాల భూమిలో ప్రాథమిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం, ఎకరానికి రూ .2 కోట్ల చొప్పున రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు అంచనాలు చూపించారు. ఇందుకు కేంద్రం నుంచి లభించిన సహాయం రూ. 1,500 కోట్లు, గుప్పెడు వేరుశెనగలు ఇచ్చినంత అని చెప్పారు....

Defence Cluster In Donakonda: జగన్ సర్కారు సంచలన నిర్ణయం, దొనకొండ కేంద్రంగా డిఫెన్స్‌ క్లస్టర్‌, కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఏపీ పరిశ్రమల శాఖ, 35 దేశాల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. ప్రకాశం జిల్లాలోని దొనకొండ కేంద్రంగా డిఫన్స్ క్లస్టర్‌ను (Defence Cluster In Donakonda) ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి (IT Minister Mekapati Goutham Reddy) తెలిపారు.

Advertisement

Disha Police Station: దేశంలోనే తొలిసారి, మహిళల భద్రతకు ‘దిశ’ విభాగం, రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా దిశ పోలీస్ స్టేషన్, రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, మీడియాతో డీజీపీ గౌతం సవాంగ్

Hazarath Reddy

మహిళా రక్షణకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 'దిశ' విభాగం ఏర్పాటు చేశామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ప్రతి పోలీసుస్టేషన్ మహిళామిత్రలా ఉండే ఏపీలో 18 'దిశ' స్టేషన్లు (Disha Police Station) ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డీజీపీ (Damodar Goutam Sawang) అన్నారు. ఆయన బుధవారం రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు.

National Cyber Crime Reporting Portal: ఆన్‌లైన్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు వెబ్ పోర్టల్ ప్రారంభించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, సైబర్ నేరాలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన కిషన్ రెడ్డి

Vikas Manda

ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులు లేదా ఏదైనా ఆన్‌లైన్ మోసంపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ను ప్రారంభించింది. ఎవరైనా అందులోకి లాగిన్ అయి నేరుగా తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చునని మంత్రి స్పష్టం చేశారు....

Amaravati Farmers Meet AP CM: అమరావతి ఎక్కడికీ పోదు, రాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా ఉంటుంది, అమరావతి రైతులకు భరోసా ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

రాజధాని ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) అమరావతి రైతులకు చెప్పారు. రాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతే (Amaravati) కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) పునరుద్ఘాటించారు.

Three Capitals Row: రాజధాని అంశంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు, రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మాకు సంబంధం లేదు, లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖా సహాయమంత్రి

Hazarath Reddy

మూడు రాజధానుల (Three Capitals) ఏర్పాటుపై ఏపీలో దుమారం రేగుతున్న వేళ పార్లమెంట్‌లో (Parliament) కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ రాజధానిపై లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్(TDP MP Galla Jayadev) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్(Minister of State for Home Affairs Nithayanada Rai) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Advertisement

Millennium Tower-B In VIzag: సీఎం జగన్ దూకుడు, మూడు రాజధానుల అంశంపై మరింతగా ముందుకు, విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణానికి నిధులు విడుదల, కర్నూలుకు తరలిన విజిలెన్స్‌ కమిషనరేట్‌

Hazarath Reddy

విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని మధురవాడ వద్ద ఉన్న రుషికొండలో (Rushikonda) మిలీనియం టవర్‌-బి నిర్మాణానికి (Millennium Tower-B In VIzag) ప్రభుత్వం రూ.19.73 కోట్లు విడుదల చేసింది. టవర్‌-బి నిర్మాణం కోసం ఐటీశాఖకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్‌ సోమవరం ఉత్తర్వులు జారీచేశారు. టవర్‌-ఏ నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. విశాఖ మిలీనియం టవర్స్‌లోనే సచివాలయం కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Madanapalle Murder Case: భార్యను సైనేడ్‌తో చంపేశాడు, అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్, వీడిన మదనపల్లి కేసు మిస్టరీ

Hazarath Reddy

అతనో బ్యాంకు మేనేజర్, లక్షల్లో జీతం..అయినా ధన దాహం తీరలేదు. భార్య తీసుకువచ్చిన లక్షల కట్నం సరిపోలేదు. అదనపు కట్నం కావాలని భార్యను వేధించాడు. ఇంకా ధన దాహం తీరలేదేమో..ఏకంగా భార్యనే పైకి పంపాడు. ఆమె రోజు వేసుకునే ట్యాబ్లెట్లలో సైనేడ్ ఇచ్చి చంపేశాడు. ఇది మదనపల్లి బ్యాంక్ మేనేజర్ కేసు(Madanapalle Bank Manager Case) కథ.

Sagar Mala Project: ఏపీకి 32 రోడ్లు, 21 రైల్ ప్రాజెక్టులు, సాగర మాల ప్రాజెక్ట్ కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, 9 జిల్లాల్లో సాంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లు,నదుల అనుసంధానంపై డీపీఆర్ సిద్ధంగా ఉందన్న కేంద్రం

Hazarath Reddy

ఏపీకి (Andhra Pradesh) మొన్న బడ్జెట్లో కేటాయింపులపై తీవ్ర నిరాశ వ్యక్తమయిన సంగతి విదితమే.. దీనిపై రాజ్యసభలో ( Rajya Sabha) ఏపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి (Rajya Sabha member V Vijayasai Reddy) ఏపీకి ఏం కేటాయించారనే ప్రశ్నకు పలువురు కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్‌ ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్‌ ప్రాజెక్ట్‌లు (Rail Projects) కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) తెలిపారు.

Coronavirus Test Center: నేటి నుంచి హైదరాబాద్‌లోనే కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ సేవలందిస్తామన్న తెలంగాణ మంత్రి ఈటెల రాజేంధర్

Vikas Manda

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, తెలంగాణ వారివే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజల టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఇక్కడే పరిశీలిస్తామని ఈటల వెల్లడించారు. చైనా నుంచి వచ్చిన వారిని 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతామని తెలిపారు.....

Advertisement

CM YS Jagan Visits Sarada Peetham: విశాఖలో ఏపీ సీఎం, ముఖ్యమంత్రి హోదాలో శారదా పీఠం వార్షికోత్సావాలకు హాజరైన వైయస్ జగన్, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పండితులు

Hazarath Reddy

విశాఖ జిల్లా (Visakhapatnam) పెందుర్తి మండలం చినముషిరి వాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి (Sarada Peetham Vaarshik Mahotsav) ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం హోదాలో ఆయన రెండో సారి శారదా పీఠా న్ని సందర్శించారు. సోమవారం శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు (AP CM YS Jagan) వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, (Swarupananda Swamy) స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు.

Hersis Virus: డేంజర్ జోన్‌లో కోనసీమ, కరోనాను తలదన్నేమరో కొత్త వైరస్, ఇకపై చికెన్ తింటే హరీ, మూగజీవాలను అటాక్ చేస్తున్న హెర్సిస్ వైరస్, కలవరపెడుతున్న లంపి స్కిన్ వ్యాధి

Hazarath Reddy

చైనాలోని వుహాన్ నగరంలో (Wuhan In China) పుట్టిన కరోనా వైరస్ (Coronavirus) దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. ఇప్పుడు తాజాగా కోనసీమలో (Konaseema) మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. చైనాను కరోనా వైరస్ వణికిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) కోనసీమను హెర్సిస్ వైరస్ (Hersis Virus) భయపెడుతున్నది. ఈ హెర్సిస్ వైరస్ వలన మూగజీవాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ హెర్సిస్ వైరస్ వల్ల లంపి స్కిన్ వ్యాధి (lump skin Disease) బారిన పడుతున్న మూగజీవాలు (Animals) అక్కడ పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.

Andhra Girl Stuck In China: వారంలో పెళ్లి, చైనాలో చిక్కుకుపోయిన కర్నూలు యువతి, జ్వరం దెబ్బకు ఇండియాకు పంపలేమన్న చైనా అధికారులు, స్వదేశానికి రావాలని ఉందంటూ వీడియో విడుదల

Hazarath Reddy

చైనాలో ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన అమ్మాయి (Andhra Girl Stuck In China) వుహాన్ నగరంలో చిక్కుకుపోయింది. ఇండియాకి రావాలని ఉందని సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ వీడియోని విడుదల చేసింది. కర్నూలు జిల్లా (Kurnool) బండి ఆత్మకూరు మండలం ఈర్లపాడుకు చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అన్నెం శృతి టీసీఎల్‌‌లో ఉద్యోగం చేస్తోంది. కాగా మూడు నెలల శిక్షణ కోసం సహచరులు 58 మందితో కలిసి చైనా వెళ్లింది.

Pensions Distribution: అవ్వా ఇదిగో పెన్సన్.., ఇంటింటికి వెళ్లి పెన్సన్ ఇచ్చిన గ్రామ వాలంటీర్లు, తొలిరోజే 76.59 శాతంతో రికార్డు, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమయిందన్న ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Government) ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమం ( pension disbursement programme) సూపర్ సక్సెస్ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు (Ward volunteers) తొలి రోజే రికార్డు సృష్టించారు. ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ (YSR Pension) లబ్ధిదారులకు ప్రతినెలా తొలిరోజే ఇంటికే పెన్షన్‌ చేరాలని సీఎం జగన్ ( CM YS Jagan) నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement