ఆంధ్ర ప్రదేశ్

Disha Police Station: దేశంలోనే తొలిసారి, మహిళల భద్రతకు ‘దిశ’ విభాగం, రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా దిశ పోలీస్ స్టేషన్, రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, మీడియాతో డీజీపీ గౌతం సవాంగ్

Hazarath Reddy

మహిళా రక్షణకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 'దిశ' విభాగం ఏర్పాటు చేశామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ప్రతి పోలీసుస్టేషన్ మహిళామిత్రలా ఉండే ఏపీలో 18 'దిశ' స్టేషన్లు (Disha Police Station) ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డీజీపీ (Damodar Goutam Sawang) అన్నారు. ఆయన బుధవారం రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు.

National Cyber Crime Reporting Portal: ఆన్‌లైన్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు వెబ్ పోర్టల్ ప్రారంభించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, సైబర్ నేరాలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన కిషన్ రెడ్డి

Vikas Manda

ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులు లేదా ఏదైనా ఆన్‌లైన్ మోసంపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ను ప్రారంభించింది. ఎవరైనా అందులోకి లాగిన్ అయి నేరుగా తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చునని మంత్రి స్పష్టం చేశారు....

Amaravati Farmers Meet AP CM: అమరావతి ఎక్కడికీ పోదు, రాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా ఉంటుంది, అమరావతి రైతులకు భరోసా ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

రాజధాని ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) అమరావతి రైతులకు చెప్పారు. రాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతే (Amaravati) కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) పునరుద్ఘాటించారు.

Three Capitals Row: రాజధాని అంశంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు, రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మాకు సంబంధం లేదు, లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖా సహాయమంత్రి

Hazarath Reddy

మూడు రాజధానుల (Three Capitals) ఏర్పాటుపై ఏపీలో దుమారం రేగుతున్న వేళ పార్లమెంట్‌లో (Parliament) కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ రాజధానిపై లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్(TDP MP Galla Jayadev) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్(Minister of State for Home Affairs Nithayanada Rai) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Advertisement

Millennium Tower-B In VIzag: సీఎం జగన్ దూకుడు, మూడు రాజధానుల అంశంపై మరింతగా ముందుకు, విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణానికి నిధులు విడుదల, కర్నూలుకు తరలిన విజిలెన్స్‌ కమిషనరేట్‌

Hazarath Reddy

విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని మధురవాడ వద్ద ఉన్న రుషికొండలో (Rushikonda) మిలీనియం టవర్‌-బి నిర్మాణానికి (Millennium Tower-B In VIzag) ప్రభుత్వం రూ.19.73 కోట్లు విడుదల చేసింది. టవర్‌-బి నిర్మాణం కోసం ఐటీశాఖకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్‌ సోమవరం ఉత్తర్వులు జారీచేశారు. టవర్‌-ఏ నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. విశాఖ మిలీనియం టవర్స్‌లోనే సచివాలయం కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Madanapalle Murder Case: భార్యను సైనేడ్‌తో చంపేశాడు, అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్, వీడిన మదనపల్లి కేసు మిస్టరీ

Hazarath Reddy

అతనో బ్యాంకు మేనేజర్, లక్షల్లో జీతం..అయినా ధన దాహం తీరలేదు. భార్య తీసుకువచ్చిన లక్షల కట్నం సరిపోలేదు. అదనపు కట్నం కావాలని భార్యను వేధించాడు. ఇంకా ధన దాహం తీరలేదేమో..ఏకంగా భార్యనే పైకి పంపాడు. ఆమె రోజు వేసుకునే ట్యాబ్లెట్లలో సైనేడ్ ఇచ్చి చంపేశాడు. ఇది మదనపల్లి బ్యాంక్ మేనేజర్ కేసు(Madanapalle Bank Manager Case) కథ.

Sagar Mala Project: ఏపీకి 32 రోడ్లు, 21 రైల్ ప్రాజెక్టులు, సాగర మాల ప్రాజెక్ట్ కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, 9 జిల్లాల్లో సాంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లు,నదుల అనుసంధానంపై డీపీఆర్ సిద్ధంగా ఉందన్న కేంద్రం

Hazarath Reddy

ఏపీకి (Andhra Pradesh) మొన్న బడ్జెట్లో కేటాయింపులపై తీవ్ర నిరాశ వ్యక్తమయిన సంగతి విదితమే.. దీనిపై రాజ్యసభలో ( Rajya Sabha) ఏపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి (Rajya Sabha member V Vijayasai Reddy) ఏపీకి ఏం కేటాయించారనే ప్రశ్నకు పలువురు కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్‌ ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్‌ ప్రాజెక్ట్‌లు (Rail Projects) కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) తెలిపారు.

Coronavirus Test Center: నేటి నుంచి హైదరాబాద్‌లోనే కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ సేవలందిస్తామన్న తెలంగాణ మంత్రి ఈటెల రాజేంధర్

Vikas Manda

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, తెలంగాణ వారివే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజల టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఇక్కడే పరిశీలిస్తామని ఈటల వెల్లడించారు. చైనా నుంచి వచ్చిన వారిని 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతామని తెలిపారు.....

Advertisement

CM YS Jagan Visits Sarada Peetham: విశాఖలో ఏపీ సీఎం, ముఖ్యమంత్రి హోదాలో శారదా పీఠం వార్షికోత్సావాలకు హాజరైన వైయస్ జగన్, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పండితులు

Hazarath Reddy

విశాఖ జిల్లా (Visakhapatnam) పెందుర్తి మండలం చినముషిరి వాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి (Sarada Peetham Vaarshik Mahotsav) ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం హోదాలో ఆయన రెండో సారి శారదా పీఠా న్ని సందర్శించారు. సోమవారం శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు (AP CM YS Jagan) వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, (Swarupananda Swamy) స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు.

Hersis Virus: డేంజర్ జోన్‌లో కోనసీమ, కరోనాను తలదన్నేమరో కొత్త వైరస్, ఇకపై చికెన్ తింటే హరీ, మూగజీవాలను అటాక్ చేస్తున్న హెర్సిస్ వైరస్, కలవరపెడుతున్న లంపి స్కిన్ వ్యాధి

Hazarath Reddy

చైనాలోని వుహాన్ నగరంలో (Wuhan In China) పుట్టిన కరోనా వైరస్ (Coronavirus) దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. ఇప్పుడు తాజాగా కోనసీమలో (Konaseema) మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. చైనాను కరోనా వైరస్ వణికిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) కోనసీమను హెర్సిస్ వైరస్ (Hersis Virus) భయపెడుతున్నది. ఈ హెర్సిస్ వైరస్ వలన మూగజీవాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ హెర్సిస్ వైరస్ వల్ల లంపి స్కిన్ వ్యాధి (lump skin Disease) బారిన పడుతున్న మూగజీవాలు (Animals) అక్కడ పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.

Andhra Girl Stuck In China: వారంలో పెళ్లి, చైనాలో చిక్కుకుపోయిన కర్నూలు యువతి, జ్వరం దెబ్బకు ఇండియాకు పంపలేమన్న చైనా అధికారులు, స్వదేశానికి రావాలని ఉందంటూ వీడియో విడుదల

Hazarath Reddy

చైనాలో ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన అమ్మాయి (Andhra Girl Stuck In China) వుహాన్ నగరంలో చిక్కుకుపోయింది. ఇండియాకి రావాలని ఉందని సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ వీడియోని విడుదల చేసింది. కర్నూలు జిల్లా (Kurnool) బండి ఆత్మకూరు మండలం ఈర్లపాడుకు చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అన్నెం శృతి టీసీఎల్‌‌లో ఉద్యోగం చేస్తోంది. కాగా మూడు నెలల శిక్షణ కోసం సహచరులు 58 మందితో కలిసి చైనా వెళ్లింది.

Pensions Distribution: అవ్వా ఇదిగో పెన్సన్.., ఇంటింటికి వెళ్లి పెన్సన్ ఇచ్చిన గ్రామ వాలంటీర్లు, తొలిరోజే 76.59 శాతంతో రికార్డు, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమయిందన్న ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Government) ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమం ( pension disbursement programme) సూపర్ సక్సెస్ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు (Ward volunteers) తొలి రోజే రికార్డు సృష్టించారు. ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ (YSR Pension) లబ్ధిదారులకు ప్రతినెలా తొలిరోజే ఇంటికే పెన్షన్‌ చేరాలని సీఎం జగన్ ( CM YS Jagan) నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Ratha Saptami: ఆలయాలకు పోటెత్తిన జనసంద్రం, రద్దీగా మారిన తిరుమల, అరసవిల్లి ఆలయాలు, సప్తవాహనాలపై ఊరేగిన మలయప్ప స్వామి, అరసవిల్లిలో సూర్యభగవానుడి నిజరూప దర్శనం, సూర్యజయంతిపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఏపీలో ఘనంగా రథసప్తమి వేడుకలు (Ratha Saptami Celebrations) జరుతున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిమ్మ చీకట్లను తొలగించి, సమస్త లోకాలకు వెలుగును పంచేది సూర్య భగవానుడు. ఈ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని పుట్టిన రోజును సమస్త జగత్తు రథసప్తమిగా (Ratha Saptami) జరుపుకుంటారు.

Jagananna Chedodu: సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, త్వరలో జగనన్న చేదోడు పథకం, ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేలు, మండలి రద్దుతో మారిన మంత్రిత్వ శాఖలు

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిన ఏపీ సీఎం నాయీ బ్రాహ్మణులకు కూడా ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ (Jagananna Chedodu Programme) కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం.

Pension Home Delivery: దేశంలొనే తొలిసారి, నేరుగా మీ ఇంటికే పెన్సన్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కారు, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి, ఫస్ట్ తారీఖునే పింఛన్‌ మీచేతికి

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు (AP Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలిసారిగాగా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకే (Pension Home Delivery) వెళ్లి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీనుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కేవలం కొద్దిగంటల్లోనే పూర్తిచేయడానికి సర్కారు అన్ని ఏర్పాట్లుచేసింది.

Jagan Assets Case: సీబీఐ కేసులో తెలంగాణా హైకోర్టుకు ఏపీ సీఎం, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన తెలంగాణా హైకోర్టు,తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా

Hazarath Reddy

సీబీఐ కేసుల్లో వ్యక్తిగత మినహాయింపును కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ను తెలంగాణా హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. పిబ్రవరి 6వ తేదీకి ఈ కేసు సంబంధించిన విచారణను వాయిదా వేసింది.

Advertisement

Three New Districts In AP: అరకు, మచిలీపట్నం, గురజాలతో 15 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్, ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు, ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

తాజాగా మూడు జిల్లాల (Three New Districts In AP) ఏర్పాటుకు ఏపీ కేబినెట్ (AP cabinet) ఆమోదం తెలిపినట్లు సమాచారం. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించిందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మచిలీపట్నం (Machilipatnam) కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు సమీపంలో ఉండే గుంటూరు జిల్లాలోని గురజాల ప్రాంతాన్ని కూడా జిల్లా చేసినట్టు వార్తలొస్తున్నాయి.

Racchabanda: మీ గ్రామంలోకి సీఎం జగన్ వస్తున్నాడు, రచ్చబండ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం, సంక్షేమ పథకాలపై ఫీడ్‌బ్యాక్‌ కోసం గ్రామాల్లోకి పర్యటన, ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ప్రజానేతగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. (CM YS Jagan Mohan Reddy)వాటి అమలు, పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఇందుకోసం రచ్చబండ (Racchabanda) తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

AP Legislative Council: ఏపీ చరిత్రలో రెండో సారి, పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం, కేంద్రం చెంతకు ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం, ఉభయ సభలు, రాష్ట్రపతి ఆమోదం తర్వాత సభ పూర్తిగా రద్దు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని (Abolish Legislative Council) అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సభకు హాజరైన సభ్యులంతా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ తెలిపారు.

AP Assembly Special Sessions: శాసన మండలి రద్దు, తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ సీఎం, అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన టీడీపీ, గవర్నర్, స్పీకర్‌కు లేఖ రాసిన టీడీపీ శాసన సభా పక్షం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో (Andhra Pradesh Assembly) రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేడు శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ( CM YS Jagan) మండలిని రద్దు చేసే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై సభ చర్చకు చేపట్టింది.

Advertisement
Advertisement