తెలంగాణ

Nalgonda: పెట్రోల్ బంకు మోసం, పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎస్సై ఉల్టా బెదిరింపు..నయీమ్ బతికుంటే మీ ఆటలు సాగేవి కావు అనవసరంగా ఎన్‌కౌంటర్ చేశానని ఎస్సై కామెంట్..ఆడియో వైరల్

Arun Charagonda

కట్టంగూరు మండలం NH 65 రహదారిపై గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ బాధితుడికి చేదు అనుభవం ఎదురైంది. టాటా టియాగో కారు ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు కాగా రీడింగ్‌లో 42 లీటర్లు చూపించడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: చైతన్యపురి శిల్పి ఎలైట్ బార్‌ అండ్ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన కూరగాయలు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన నిజాలు..కిచెన్‌లో బొద్దింకలు, సింథటిక్ ఫుడ్ కలర్స్‌ వాడుతున్నట్లు గుర్తింపు

Arun Charagonda

చైతన్యపురిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శిల్పి ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిపోయిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు, ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉందని చెప్పిన అధికారులు... ఫుడ్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు.

Lorry Accident Video: ఆగి ఉన్న మద్యం లారీని ఢీకొట్టిన మరో లారీ, ఒకదాని వెంట ఒకటి ఢీకొట్టుకున్న మరో నాలుగు లారీలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం జాతీయ రహదారిపై లిక్కర్ లోడుతో వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ భోజనానికి అని రోడ్డు పక్క ఆపడంతో వెనకాల వేగంగా వస్తున్న మరో లారీ డీ కొట్టింది. దీంతో మద్యం లారరీ బోల్తా పడింది. దాదాపు నాలుగు లారీలు ఒకదాని వెంట ఒకటి డీ కొనడంతో జాతీయ రహదారి పై ఒక్కసారిగా అయో మాయ పరిస్థితి నెలకొంది.

Deepadas Munshi: బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌పై కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా, ఎమ్మెల్యే టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నారన్న కామెంట్లపై ఫైర్

Arun Charagonda

బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై పరువు నష్టం దావా వేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ. ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం దీపాదాస్ మున్షీ బెంజ్ కార్లు తీసుకుందని వ్యాఖ్యలు చేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఈ నేపథ్యంలో కేసు దాఖలు చేయగా పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాలేదు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దీంతో నవంబర్ 5న విచారణకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు.

Advertisement

Congress MLC Jeevan Reddy: నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారా?..కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బహిరంగ లేఖ, పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ చెప్పిందెంటీ , జరుగుతుంది ఏంటని ప్రశ్న?

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై హైకమాండ్ కు సంచలన లేఖ రాశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారో చెప్పాలన్నారు. తీవ్ర ఆందోళన మానసిక వ్యధ బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నట్టు వెల్లడించారు జీవన్ రెడ్డి. తన రాజకీయ భవిష్యత్ ను మీరే నిర్దేశించండి అని కాంగ్రెస్ అధిష్టానాన్ని అడిగారు జీవన్ రెడ్డి.

Mahabubabad: తహసిల్దార్‌పై రెచ్చిపోయిన ఇసుక మాఫియా, అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నందుకు బూతు మాటలు తిట్టిన వైనం, పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసిల్దార్

Arun Charagonda

తహసిల్దార్ పై బూతులతో రెచ్చిపోయింది ఇసుక మాఫియా. మహబూబాబాద్ - నెల్లికుదురు మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు తహసిల్దార్ రాజు. దీంతో తహసిల్దార్ పై బూతులతో రెచ్చిపోయారు ఇసుక ట్రాక్టర్‌కు సంబంధించిన వ్యక్తులు. తనను అడ్డుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తహసిల్దార్.

KTR: కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపిన కేటీఆర్, డిచ్‌పల్లి బెటాలియన్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సమస్యను పరిష్కరించాలని వినతి

Arun Charagonda

డిచ్ పల్లి బెటాలియన్ ముందు ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా వారి సమస్యను విన్నారు కేటీఆర్. అనంతరం బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు కేటీఆర్. సాధ్యమైనంత త్వరగా కానిస్టేబుళ్ల సమస్యలను తీర్చాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పారు.

Congress MLA Adluri Laxman: గంజాయి మత్తులో మర్డర్లు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో విలువ లేకుండాపోయిందన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, బూతులతో ఫైర్ అయిన ఎమ్మెల్యే..వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల కాంగ్రెస్ నేత హత్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ విప్ అడ్లూరి లక్ష్మణ్. గంజాయి తాగి మత్తులో మర్డర్లు చేస్తున్నారని బూతులతో విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో నాకు ఏం విలువ లేదు.. జగిత్యాల జిల్లా అధ్యక్షుడిని అయినా ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ పక్కన కూడా తిరగలేదు.. సీఎం రేవంత్ రెడ్డికి, సంజయ్ గురించి ఫిర్యాదు చేశానని చెప్పారు.

Advertisement

Tummala Nageshwarrao: రెండోరోజు మలేషియాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన, పామాయిల్ రిఫైనరీ ప్లాంట్‌ను పరిశీలించనున్న తుమ్మల

Arun Charagonda

రెండో రోజు మలేషియాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సాగుతోంది. పహాంగ్ రాష్ట్రం జెరంటుట్ లో ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ .. అర్.అండ్ ఢీ సెంటర్ పరిశీలించనుంది మంత్రి తుమ్మల బృందం. కుయంటన్ పోర్ట్ లో పామాయిల్ రిఫైనరీ ప్లాంట్ పరిశీలించనున్నారు. తెలంగాణ లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ అధ్యయనం కోసం వ్యవసాయ హార్టికల్చర్ అధికారులతో కలసి మంత్రి తుమ్మల పర్యటన సాగుతోంది.

Telangana: కుక్కల దాడిలో 35 మేకల మృతి...రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఘటన, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడి ఆవేదన

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకరయ్య అనే వ్యక్తి 35 చిన్న మేక పిల్లలను 5 పెద్ద మేకలను మేకల దొడ్డిలో వదిలేసి మిగతా మేకలను మేపడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం సమయంలో 12 కుక్కలు మేకల దొడ్డిలో చొరబడి 30 మేక పిల్లలను 5 మేకలను కరిచి చంపేశాయి. ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితుడు.

Ponnam Prabhakar: బీజేపీది అవకాశవాద రాజకీయం, నిరసనల పేరుతో ముసలి కన్నీరు కారుస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మూసి పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి

Arun Charagonda

బీజేపీ మూసి సందర్శనకు పోయింది..ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి , పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా..మూసి ప్రజలకు సంబంధించిన సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వండి.. వారికి జరగాల్సిన న్యాయం గురించి చెప్పాలన్నారు.

ED Questions Amoy Kumar: ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ, ఏడు గంటల పాటు ప్రశ్నల వర్షం...భూదాన్ భూముల బదిలీపై విచారణ

Arun Charagonda

ఈడీ కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు అమోయి కుమర్ ని విచారించింది ఈడి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై విచారించగా వందల కోట్ల విలువైన 42 ఎకరాలు అక్రమంగా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి.

Advertisement

RS Praveen Kumar: భార్యలు ఆందోళన చేస్తే కానిస్టేబుల్‌లను సస్పెండ్ చేస్తారా?, ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా..సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్లను డ్యూటీలోకి తీసుకోవాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

Arun Charagonda

భార్యలు ఆందోళన చేస్తే కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్‌పీ. ఇది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు.. కానిస్టేబుల్ భార్యలు వాళ్ళ బాధలు చెప్పుకోడానికి శాంతియుతంగా నిరసన తెలిపుతుంటే అరుగురు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు. వాళ్లను అర్జెంటుగా డ్యూటీలోకి తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

Ponguleti Srinivas Reddy: దీపావళి ముందే పొలిటికల్ బాంబ్...ఫోన్‌ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో కీలక నేతలపై చర్యలు, సంచలన కామెంట్స్ చేసిన మంత్రి పొంగులేటి

Arun Charagonda

దక్షిణకొరియాలోని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి అని తెలిపారు. ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు.. సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధమయ్యాయిన్నారు. కక్ష సాధింపు కోసం కాదు, సాక్ష్యాధారాలతోనే చర్యలు ఉంటాయని తెలిపారు పొంగులేటి. ఫోన్‌ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలు తీసుకుంటామన్నారు.

Nalgonda: కోమటిరెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదు మున్నాభాయ్ ఇంజనీర్, బస్తాలు అమ్ముకుని బీర్లు తాగేవాడు...బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ ఫైర్

Arun Charagonda

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాటలతో ర్యాగింగ్ చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. సిమెంట్ బస్తాలు అమ్ముకుంటూ అక్కడే కూర్చొని బీర్లు తాగే వాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదు మున్నా భాయ్ ఇంజనీర్ అని ఎద్దేవా చేశారు.

Bandi Sanjay On KTR Notices: కేటీఆర్ ఇచ్చిన నోటీసులకు భయపడేది లేదు?, మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తానన్న బండి సంజయ్

Arun Charagonda

కేటీఆర్ పంపిన నోటీసులకు బదులిచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు అని...రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా? అని ప్రశ్నించారు. విమర్శలకు నోటీసులే సమాధానమా?, నేను కూడా నోటీసులు పంపిస్తా...కాచుకో అన్నారు. నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన అని చెప్పిన బండి..మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తానని చెప్పారు.

Advertisement

KTR: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక

Arun Charagonda

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు షాకిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Hyderabad: గోషామహల్‌లో భారీగా కుంగిన నాలా , అర్థరాత్రి కావడంతో తప్పిన ప్రమాదం...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ గోషామహల్‌లో నాలా రోడ్డు కుంగింది. దారుసలామ్ రోడ్డు నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగింది. అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో శివరేజ్ పెద్ద నాలా కుంగగా ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Kaleswaram Project Public Hearings: కాళేశ్వరంపై మళ్లీ విచారణ, ప్రతి రోజు రెండు సెషన్స్ లలో కొనసాగనున్న ఓపెన్ కోర్టు విచారణ..ఈ నెలాఖరులోగా తుది నివేదిక సిద్ధం!

Arun Charagonda

నేటి నుంచి కాళేశ్వరంపై మళ్లీ విచారణ ప్రారంభించనుంది కమిషన్. ప్రతి రోజు రెండు సెషన్స్ లలో కొనసాగనుంది ఓపెన్ కోర్టు విచారణ. పలువురు ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు నేటి విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లతో విచారణ పూర్తి చేయాలనే యోచనలో కమిషన్ ఉండగా ఆ తర్వాత తుది నివేదికను సమర్పించనుంది.

Yadagirigutta Temple: యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం...ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించడం సరికాదన్న ఈవో, ఇకపై చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలని హెచ్చరిక

Arun Charagonda

యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలపై నిషేధం విధించారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి జ్ఞాపకార్థంగా భద్రపర్చుకుంటే అభ్యంతరం లేదని...చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement
Advertisement