తెలంగాణ

Bathukamma Festival: మన బతుకమ్మకు అమెరికాలో గౌరవం.. పలు రాష్ట్రాల్లో అధికారిక గుర్తింపు

Rudra

తెలంగాణ సాంసృతిని చాటే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఇప్పటికే పలు దేశాల్లో తెలంగాణ ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడుతున్న విషయం విధితమే.

CM Revanth Reddy On Musi: కృష్ణా,గంగ,సరస్వతిలా మూసీ నది..అమ్మాయిలకు మూసీ అనే పేరు పెట్టేలా సుందరీకరణ చేస్తా

Arun Charagonda

మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా మూసీ సుందరీకరణ చేస్తానని చెప్పారు రేవంత్.

Telangana Nominated Posts: తెలంగాణలో మరో 13 నామినేటెడ్ పోస్టులను భర్తీ, 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం

Arun Charagonda

దసరా వేళ తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలో మిగితా జిల్లాల గ్రంధాలయాలకు ఛైర్మన్లను ప్రకటించనుంది. సామాజికవర్గ సమీకరణల ప్రకారం రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదు మందికి, గౌడ్ సామాజికవర్గం నుంచి ఇద్దరు, ఒక ముస్లిం సామాజికవర్గం చెందిన నేతను పదవి వరించింది.

Jainoor Tribal Woman: ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన జైనూర్ బాధిత మహిళ, బాధితురాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన మంత్రి సీతక్క

Arun Charagonda

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు జైనూర్ బాధిత మహిళ. గత నెల రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందుతుండగా బాధితురాలికి అందించే వైద్యం, ఇతర సౌకర్యాల పై ప్రత్యేక శ్రద్ధ చూపారు మంత్రి సీతక్క. డిశ్చార్జ్ సందర్భంగా మహిళకు నూతన వస్త్రాలు బహుకరించి కొంత నగదును అందజేశారు సీతక్క. బాధిత కుటుంబ సభ్యులు మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Bathukamma Festival: బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించిన అమెరికా, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించిన అమెరికాలోని పలు రాష్ట్రాలు

Arun Charagonda

బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించింది అమెరికా. బతుకమ్మ సంబరాల వారాన్ని అధికారికంగా బతుకమ్మ పండగ వారం, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించాయి అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ట్రాలు.

Goddess Kanyaka Parameswari: రూ.6 కోట్లతో అమ్మవారి అలంకరణ, మహబూబ్‌నగర్‌ జిల్లా వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకరణ..వైరల్ వీడియో

Arun Charagonda

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బ్రాహ్మణవాడలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమివ్వనుండగా ప్రత్యేకంగా రూ.6,66,66,666.66తో అలంకరించారు. రూ. 6 కోట్ల నగదు చూసి భక్తులు ఆశ్యర్యపోయారు.

Minister Komatireddy Dance: డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్-2024ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజే టిల్లు పాటకు ఆయన డాన్స్ వేశారు.

Criminals Arrest: సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్ట్,దేశ వ్యాప్తంగా 435 కేసుల్లో నిందితులుగా ఉన్న సైబర్ నేరగాళ్లు, ముంబై కేంద్రంగా మోసాలు

Arun Charagonda

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 435 కేసుల్లో నిందితులుగా ఉన్నారు సైబర్ నేరగాళ్లు. ముంబై కేంద్రంగా ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడుతుండగా హైదరాబాద్ లో ఏకంగా రూ.7 కోట్లకుపైగానే కాజేశారు కేటుగాళ్లు.

Advertisement

Modi On Rythu Runa Mafi: రుణమాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్, తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీస్తున్నారన్న మోడీ

Arun Charagonda

తెలంగాణలో రుణమాఫీఐ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్ చేశారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇప్పటికి మాఫీ కాలేదన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా రుణమాఫీ చేయకపోవడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అని తెలిపారు మోడీ.

CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, వరద సాయం పెంపుతో పాటు కాంగ్రెస్ పెద్దలను కలవనున్న తెలంగాణ సీఎం

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలవనున్నారు సీఎం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ కానుండగా ఈ సమావేశానికి హాజరుకానున్నా రేవంత్ రెడ్డి.

Hyderabad: వీపు రుద్దమన్నందుకు భర్త తలపై ఐరన్ రాడ్‌తో దాడి చేసిన భార్య, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

Arun Charagonda

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తన వీపు రుద్దాలని గట్టిగా భార్యపై అరిచాడు భర్త శివ. గట్టిగా అరవకండి చుట్టూ ఉన్న వాళ్లు చూస్తే బాగోదు అంటూ భర్తతో చెప్పినా వినలేదు. దీంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భర్త తలపై ఐరన్ రాడ్‌తో దాడి చేసింది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో భర్త శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Hydra To Extend Districts: ఇకపై జిల్లాలకు హైడ్రా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన..కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన వదలమని హెచ్చరిక

Arun Charagonda

హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా హైడ్రా విస్తరణపై కీలక కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాం అని...హైడ్రా ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం.. మా కుటుంబసభ్యులు కబ్జా చేసినా కూల్చేయండన్నారు. కాంగ్రెస్ నేతలు ఆక్రమించిన వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.

Advertisement

Youtuber Harshasai Case: యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు

Rudra

ముంబై కి చెందిన ఓ నటిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. ఆయనపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Big Blow to Jani Master: జానీ మాస్టర్‌ జాతీయ పురస్కారం రద్దు.. లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేత.. సంచలన నిర్ణయం తీసుకున్న నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌.. అవార్డు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నదని ఇటీవలే కోర్టు నుంచి బెయిల్ తీసుకున్న జానీ

Rudra

లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ కు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 8న ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును రద్దు చేశారు.

Lookout Notice Against Harsha Sai: హ‌ర్ష‌సాయి కేసులో బిగ్ ట్విస్ట్, లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సైబ‌రాబాద్ పోలీసులు, గాలింపు వేగ‌వంతం

VNS

యూ ట్యూబర్‌ హర్షసాయిపై (Harsha Sai) సైబరాబాద్‌ పోలీసులు శనివారం లుకౌట్‌ నోటీసు (Lookout Notice)లు జారీ చేశారు. ఓ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ముంబయికి చెందిన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Telangana Governor Approves Hydraa Ordinance: హైడ్రాకు ఫుల్ ప‌వ‌ర్స్, ఆమోదం తెలిపిన గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌, ఇక దూకుడు పెంచ‌నున్న హైడ్రా

VNS

హైద‌రాబాద్ విపత్తు స్పంద‌న‌, ఆస్తుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప‌రిర‌క్ష‌ణ ఏజెన్సీ(Hydraa)కు విస్తృత అధికారాలు క‌ల్పిస్తూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు (Hydraa Ordinance) రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదం తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం రాజ్‌భ‌వ‌న్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో ఇక‌పై హైడ్రా చేప‌ట్ట‌బోయే అన్ని కార్య‌క‌లాపాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ల‌భించింది.

Advertisement

KTR On Konda Surekha Comments: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడమన్న కేటీఆర్

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ స్పందించారు. నాపై ఇష్టం వచ్చినట్లు గబ్బు మాటలు ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు...మంత్రిపై పరువు నష్టం దావా వేశాను, రేపోమాపో ముఖ్యమంత్రిపై కూడా వేస్తాను అని తెలిపారు కేటీఆర్. తప్పు చేయనప్పుడు మేమెందుకు భ‌య‌ప‌డుతాం?,మోదీ లాంటి వాడికే భయపడలేదు రేవంత్‌రెడ్డి ఎంత? అని ఎద్దేవా చేశారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్, స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పిన కుటుంబ సభ్యులు

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు నిర్మల్ జిల్లాకు చెందిన గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్. కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా చిత్రహింసలకు గురి కాగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకున్నారు రాథోడ్ నాందేవ్.

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు, ఓయూ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడిన సీతక్క

Arun Charagonda

ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, యూనివర్సిటీ విద్యార్ధినులతో కలిసి బతుకమ్మ ఆడారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్కను సన్మానించింది ఓయూ సిబ్బంది.

Heavy Rain Alert To Telugu States: రెయిన్ అలర్ట్..నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు బారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరిక

Arun Charagonda

ఏపీ, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని వెల్లడించింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడనం ప్రభావం పశ్చిమ బెంగాల్‌ పై కూడా ఉంటుందని తెలిపింది.

Advertisement
Advertisement