తెలంగాణ

Keshava Rao Joins Congress: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్, మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఇదివరకే గుడ్‌బై చెప్పిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు ఈ రోజు హస్తం పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Elderly Man Hit by Train: ట్రాక్ దాటుతుండ‌గా వృద్ధుడిని ఢీకొట్టిన ట్రైన్, కిలో మీట‌ర్ల కొద్దీ రైలుకు వేలాడిన మృత‌దేహం, బీబీన‌గ‌ర్ లో దారుణం

VNS

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్‌లో (Bibinagar) విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బీబీనగర్‌ దగ్గర రైల్వే ట్రాక్‌ దాటుతున్న ఓ వృద్ధుడిని ప్యాసింజర్‌ రైలు (Train Hits Old Man) ఢీకొట్టింది. దాంతో వృద్ధుడు రైలు ఇంజిన్‌కు చిక్కుకున్నాడు. ఇది గమనించిన లోకోపైలెట్‌ అలాగే రైలును పోనిచ్చాడు. దాంతో వృద్ధుడి మృతదేహం ఘట్‌కేసర్‌ వరకు రైలుకు వేలాడుతూ వచ్చింది.

Boy Attacked by Stray Dogs: వీడియో ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కల గుంపు దాడి, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి..

Hazarath Reddy

సంగారెడ్డిలోని శ్రీనగర్‌ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కల గుంపు దాడి చేసి బీభత్సం సృష్టించింది. ఆరు కుక్కలు అకస్మాత్తుగా బాలుడిపై దాడి చేయడంతో బాలుడికి తీవ్ర రక్తస్రావం అయింది.

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, మనీష్ సిసోడియా, కవితల జ్యుడిషియల్ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు

Hazarath Reddy

ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా, BRS నాయకురాలు కె. కవితల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు జూలై 25 వరకు పొడిగించింది. గతంలో మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని కోర్టు ముందు హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా వారి కస్టడీని పొడిగించారు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, గాలివానకు మళ్లీ కూలిన మానేరు వాగుపై ఓడేడ్‌ వంతెన గిడ్డర్లు, గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై పడ్డ ఐదు గిడ్డర్లు

Hazarath Reddy

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై నిర్మిస్తున్న గిడ్డర్లు మరోసారి కూలాయి. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి బట్టబయలైంది.

TGSRTC: వీడియో ఇదిగో, ఉచిత బస్సు లేదంటూ ఫ్యామిలీని ఆర్టీసీ బస్సు ఎక్కనివ్వకుండా కిందకు దింపేసిన మహిళా కండక్టర్, జగిత్యాల బస్ స్టాప్‌లో ఘటన

Hazarath Reddy

జగిత్యాల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం జగిత్యాల బస్ స్టాప్లో ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సమయంలో.. బస్సులో ఉండే మహిళా కండక్టర్ వారిని ఆపి ఉచిత ప్రయాణం లేదు.. ముందు తనిఖీ అధికారులు ఉన్నారు.. వారు చూస్తే రూ.500 జరిమానా విధిస్తారు అంటూ సదరు కుటుంబ సభ్యులను బలవంతంగా కిందికి దింపేసింది.

Pune Road Accident: పూణే శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతి, అజ్‌మేర్‌ దర్గా సందర్శనకు వెళ్ళి వస్తుండగా ఘటన

Hazarath Reddy

మహారాష్ట్రలోని పూణే శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు యువకులు అజ్‌మేర్‌ దర్గా సందర్శనకు వెళ్లారు.

Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్న

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. వీడియో ద్వారా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు ఓ ప్రాణం బలైంది. కారుతో పాదచారుడిని ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా తనకేం పట్టనట్టుగా వెళ్లిపోయారు

Advertisement

Telangana Shocker: స్కూలుకు బైక్ ఇవ్వలేదని గడ్డిమందు తాగి విద్యార్థి ఆత్మహత్య, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేటకు చెందిన మారు మణిదీప్(14) స్కూలుకు వెళ్లడానికి ఇంట్లో ఉన్న బైక్ ఇవ్వాలని వాళ్ళ అమ్మని అడిగాడు.. అయితే ఆమె ఒప్పుకోలేదు. దీంతో మణిదీప్ గడ్డిమందు తాగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.

Electricity Bills Payment: కరెంట్ బిల్లుల చెల్లింపులపై కీలక అప్‌డేట్, ఇకపై మీరు పేమెంట్లు అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో మాత్రమే చెల్లించాలి, జులై 1 నుంచి అన్నిగేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపుల నిలిపివేత

Hazarath Reddy

ఇకపై ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్‌ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్‌ ఈ సేవలను నిలిపివేస్తున్నాయి. తాజాగా తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి

Telangana: పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య, నా ఆవేదనని సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయాలంటూ సెల్పీ వీడియో..

Hazarath Reddy

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా వ్యవసాయ భూమి విషయంలో తనకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, మరో ముగ్గురు రైతులు సైతం ఆత్మహత్యకు యత్నించారు.

Fried Plastic Cover in Chicken Biryani: చికెన్ బిర్యానీలో బాగా ఫ్రై చేసిన ప్లాస్టిక్‌ కవర్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే!!

Rudra

బిర్యానీ అంటే ఠక్కున హైదరాబాద్‌ పేరే గుర్తొస్తుంది. అయితే, గత కొంతకాలంగా మురిగిపోయినా, పురుగులు పట్టిన మాంసంతో బిర్యానీని వండి వార్చిన హైదరాబాద్ లోని పలు హోటల్‌ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను కూడా బిర్యానీతో పాటు వడ్డించేశారు.

Advertisement

CM Revanth Reddy: అలాగే, చర్చించుకుందాం రండి.. ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు రేవంత్‌ స్పందన.. అధికారికంగా లేఖ రాయనున్న తెలంగాణ సీఎం

Rudra

విభజన సమస్యలు పరిష్కరించుకుందామని, ఈ మేరకు కలిసి మాట్లాడుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Telangana Electricity Bills: యూపీఐ యాప్‌ లతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు వద్దు.. అధికారిక వెబ్‌ సైట్, యాప్‌ లలో మాత్రమే చెల్లించాలంటూ టీజీఎస్‌పీడీఎల్ కీలక ప్రకటన

Rudra

తెలంగాణలో విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి.

Hyderabad Shocker: దారుణం, బంధువుల పెళ్ళికి తండ్రి తీసుకెళ్లలేదని 7వ తరగతి బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య, కాచిగూడలో విషాదకర ఘటన

Hazarath Reddy

హైదరాబాద్‌లోని కాచిగూడలోని తన నివాసంలో 12 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. 7వ తరగతి చదువుతున్న బాలికను తన తండ్రి బంధువుల పెళ్లికి తీసుకెళ్లకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర నిరాశకు గురిచేసింది

Chandrababu Writes to Revanth Reddy: కలుద్దామంటూ రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ, జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి త్వరలోనే భేటీ కానున్నారు. జులై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరగనుంది. ఈ మేరకు సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు

Advertisement

Telangana Student Dies in US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి,స్నేహితులతో స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఈత రాకపోవడంతో నీటమునిగి తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

షికాగోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించిన దాని ప్రకారం, మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో తెలంగాణకు చెందిన 20 ఏళ్ల విద్యార్థి మరణించాడు.మృతి చెందిన వ్యక్తిని హైదరాబాద్‌లోని కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ అనే విద్యార్థిగా గుర్తించారు

KTR vs Revanth Reddy: వీడియో ఇదిగో, రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే..సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఎవ‌ర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలని సూటి ప్రశ్న

Hazarath Reddy

పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్న అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నీవు మొగోడివి అయితే.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రా… ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజ‌కీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది అని కేటీఆర్ చెప్పారు

Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసు, రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం

Hazarath Reddy

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ఈడీ, సీబీఐ... రెండు కేసుల్లోనూ ఆమె బెయిల్ పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది. మద్యం పాలసీ కేసులో మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది.

Telangana: షాకింగ్ వీడియో ఇదిగో, మట్టి ఇల్లు కూలి తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు, వనపట్లలో విషాదకర ఘటన

Hazarath Reddy

తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని వనపట్లలో వర్షం కారణంగా తడిచిన మట్టి ఇంటి మిద్దె, గోడ ఒక్కసారిగా కూలిపోయాయి. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబం మీద పడ్డాయి.

Advertisement
Advertisement