తెలంగాణ
YSR 75th Birth Anniversary: షర్మిలని గెలిపించడానికి కడపలో గల్లీగల్లీ తిరుగుతా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, జగన్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు
Hazarath Reddyఈరోజు చాలామంది వైఎస్ పేరు మీద అన్ని రకాల లబ్ధిని పొందారని విమర్శించారు. కానీ ఆయన ఆశయాలు మోసినప్పుడే వారసత్వం అవుతుందన్నారు. వైఎస్ ఆశయాలను మోసినవారినే వారసులుగా గుర్తించాలని... అది షర్మిల మాత్రమే అన్నారు.
Worm Found in Poori Curry: వీడియో ఇదిగో, పూరీ కూరలో ప్రత్యక్షమైన పురుగు, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, హోటల్ యజమాని స్పందన ఏంటంటే..
Hazarath Reddyహైదరాబాద్ గడ్డి అన్నారం రాఘవేంద్ర హోటల్లో పూరి ఆర్డర్ ఇవ్వగా దాంట్లో పూరి కూరలో పురుగు ప్రత్యక్షమైంది. దీనిపై కస్టమర్ హోటల్ యజమానిని అడిగినా పట్టించుకోలేదు. ఈ ఘటనపై కస్టమర్ మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rain Update: బిగ్ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Telangana: 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్న కార్పొరేషన్ ఛైర్మన్లు, లిస్టు ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 35 మంది ఛైర్మన్లను నియమిస్తూ జీవో విడుదల చేశారు. మార్చి 15నే ఇందుకు సంబంధించి జీవో విడుదలైంది. అయితే, ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆపి ఈరోజు తిరిగి విడుదల చేశారు.
Weather Update: ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు, భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక, హైదరాబాద్లో రెండు రోజులు పాటు వానలు
Hazarath Reddyవర్షాలపై వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణం పూర్తిగా అనుకూలిస్తే ఈ అల్పపీడనాలు ఏర్పడి, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు (Meteorological department experts ) వెల్లడించారు
Ganja Party in Cave Pub: హైదరాబాద్ ‘ది కేవ్ పబ్’లో గంజాయి పార్టీ.. దాడి చేసి 24 మందితో పాటు మేనేజర్ ను అరెస్టు చేసిన పోలీసులు (వీడియో)
Rudraహైదరాబాద్ లోనూ క్రమంగా డ్రగ్, గంజాయి సంస్కృతి పెరిగిపోతున్నది. వీకెండ్ థీమ్ పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్న ది కేవ్ పబ్ పై పోలీసులు దాడి చేసి మెరుపు దాడి చేశారు.
Revanth Reddy AP Tour: ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విజయవాడలో జరిగే కార్యక్రమంలో షర్మిలతో కలిసి పాల్గొననున్న రేవంత్
VNSకాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తోపాటు.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను షర్మిల స్వయంగా వెళ్లి వైఎస్ ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.
DRI Seizes Smuggled Gold: హైదరాబాద్ లో భారీగా బంగారం పట్టివేత, ఏకంగా రూ. 2.9 కోట్ల గోల్డ్ సీజ్ చేసిన డీఆర్ఐ అధికారులు, ఇంతకీ గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే?
VNSహైదరాబాద్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం (Gold Seized) విలువ బహిరంగ మార్కెట్లో రూ.2.9కోట్ల వరకు ఉంటుందని అధికారులు ఆదివారం తెలిపారు. కోల్కతా నుంచి హైదరాబాద్కు బస్సులో బంగారాన్ని (Gold) తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
Narcotics Bureau Raids In Cave Pub: మణికొండలో కేవ్ పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు...పబ్లో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకం...నార్కోటిక్స్ బృందం దాడిలో 27 మందికి పాజిటివ్..
sajayaహైదరాబాద్ నగరంలోని పబ్లలో డ్రగ్స్ విక్రయాలు, వినియోగాలను అరికట్టడంలో భాగంగా హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలోని కేవ్క్లబ్ అనే పబ్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఎన్ఏబీ) దాడులు నిర్వహించింది. ఈ దాడిలో, క్లబ్లో ఉన్న 55 మందిలో 24 మంది వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు, వారి నుంచి గంజాయి, కొకైన్, మెథాంఫెటమైన్ వంటి డ్రగ్స్ లభించినట్లు తేలింది.
Telangana TET: ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్... జూన్ లో ఓసారి, డిసెంబర్ లో మరోసారి నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Rudraఏడాదికి రెండు సార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
Telugu States CM’s Meeting: విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీలు, సీఎస్ లతో పాటూ అధికారులతో కమిటీలు ఏర్పాటు, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రులదే తుది నిర్ణయం
VNSమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ప్రజాభవన్లో (Praja Bhavan) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత భేటీ వివరాలను భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
Tollywood Executive Producer Suicide: టాలీవుడ్ లో విషాదం, సినిమాలు లేక ఉరేసుకొని చనిపోయిన యంగ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రెండు రోజుల తర్వాత బయటకు వచ్చిన విషయం
VNSటాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) ఆత్మహత్య (Swapna Varma Suicide) చేసుకుంది. మాదాపూర్లో తాను నివాసం ఉంటున్న ప్లాట్లో బలవన్మరణానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఆమె ఈ పని చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Telugu States CM’s Meeting: ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, గంటా 45 నిమిషాల పాటూ సాగిన చర్చలో ప్రస్తావనకు వచ్చిన అంశాలివే!
VNSహైదరాబాద్లోని ప్రజాభవన్లో (Praja bhavan) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), రేవంత్ రెడ్డి (Revanth Reddy)సమావేశమై చర్చించారు. గంటా 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మరోసారి సీఏస్ల స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు.
NIMS Doctor Suicide: మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఆత్మహత్య.. హైదరాబాద్ లో ఘటన
Rudraమత్తుమందు అధిక మోతాదులో తీసుకుని హైదరాబాద్ లోని నిమ్స్ వైద్యురాలు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ ప్రాచీ కర్(46) నిమ్స్ లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
Telugu States CM’s Meeting Today: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేడే.. ప్రజాభవన్ వేదికగా సమావేశంకానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ప్రజలు.. ఏయే అంశాలపై చర్చ ఉండొచ్చంటే?
Rudraతెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబుల భేటీ నేడు జరుగనున్నది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు.
Chandrababu's Hyderabad Visit: వీడియో ఇదిగో, హైదరాబాద్కు చేరుకున్న చంద్రబాబు, ఘన స్వాగతం పలికిన తెలంగాణ టీడీపీ నేతలు, రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు
Road Accident Video: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన బైక్, అన్న మృతి చెందగా చెల్లెలికి గాయాలు
Hazarath Reddyలారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన కోదాడ మండలం ఎర్రవరం సమీపంలో చోటు చేసుకుంది.
Barrelakka Arrested By Police: బర్రెలక్కను అరెస్ట్ చేసిన పోలీసులు, హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్టేషన్ తరలింపు
VNSటీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దశలవారీగా టీజీపీఎస్ కార్యాలయం ముట్టడికి వస్తున్నారు నిరుద్యోగులు. ఆ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బర్రెలక్క (Brrelakka Arrest)ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నిరుద్యోగుల తరఫున పోరాడుతుంటే తనను అరెస్టు చేయడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: బదిలీపై వేరే స్కూల్కు టీచర్,మేము కూడా మీతోనే అంటూ అదే పాఠశాలలో జాయిన్ అయిన 133 మంది విద్యార్థులు
Hazarath Reddyమనసుకు నచ్చిన ఉపాధ్యాయుడు బదిలీపై వెళుతుంటే చాలా మంది విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు బదిలీపై వెళితే ఆయనతో పాటే స్కూలులో ఉన్న 133 మంది విద్యార్థులు వెళ్ళి ఆయన దగ్గరే జాయిన్ అయ్యారు.
BRS Student Leaders Protest at TGPSC: టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడించిన నిరుద్యోగ జేఏసీ నేతలు, పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఉద్యోగాల భర్తీపై శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విద్యార్థి విభాగం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, అరెస్టులు జరిగాయి.