తెలంగాణ
Animal Cruelty in Telangana: తన పెంపుడు కుక్కను కరిచి చంపేసాయనే కోపంతో 20 వీధి కుక్కలను కాల్చి చంపిన దాని యజమాని, ముగ్గురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
Hazarath Reddyతెలంగాణలో జంతు హింస కేసు వెలుగులోకి వచ్చింది. తన పెంపుడు కుక్కను కరిచి చంపాయనే కోపంతో దాని యజమాని 20 వీధి కుక్కలను కాల్చి చంపాడు.ఫిబ్రవరి 16న మహబూబ్‌నగర్ జిల్లాలోని పొన్నకల్ గ్రామంలో వీధికుక్కలను ప్రతీకారంగా చంపినందుకు హైదరాబాద్‌కు చెందిన షూటర్‌తో సహా ముగ్గురిని అడ్డకల్ పోలీసులు అరెస్టు చేశారు.
Distraught Farmer in Telangana: ఎండిన 5 ఎకరాల పంట మధ్యలో పడుకుని రైతు కన్నీటి వేదన, ఆత్మహత్య చేసుకోవడమే మిగిలిందంటూ..వీడియో ఇదిగో
Hazarath Reddyసూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాలో 5 ఎకరాలు ఎండిపోవడంతో రైతు ఆవేదన చెందుతూ పొలంలో పంటను తడిమి చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Religious Harmony in Telangana: ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చిన చిలుకూరు బాలాజీ ఆలయ‌ పూజారి, తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం
Hazarath Reddyచిలుకూరులో వెల్లివిరిసిన మత సామరస్యం వెల్లివిరిసింది. చిలుకూరు బాలాజీ గుడి‌ అర్చకుడు ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చారు. చిల్కూరు గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ వ్యవసాయం చేసుకుంటుండగా కరెంట్‌ షాక్‌తో ఎద్దును కోల్పోవడంతో గౌస్‌కు చిలుకూరు బాలాజీ టెంపుల్‌ అర్చకుడు సీఎస్ రంగరాజన్ ఎద్దును బహుమతిగా ఇచ్చారు.
Accident Caught on Camera: బస్సును ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వచ్చిన లారీని గుద్దిన బైకర్, చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి, షాకింగ్ సీసీపుటేజీ వైరల్
Hazarath Reddyఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడున్న సీసీ కెమెరాలో ఈ ప్రమాద ఘటన రికార్డు అయింది. వీడియోలో ఓ వ్యక్తి బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం లారీ ఢీకొట్టింది.
Telangana: రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన పోలీస్ కానిస్టేబుల్, వాహనం వదిలివేసేందుకు డబ్బులు డిమాండ్
Hazarath Reddyలంచం తీసుకుంటుండగా అవినీతి పోలీస్ అధికారిని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మెదక్ రూరల్ పిఎస్‌కి చెందిన సురేందర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అదుపులోకి తీసుకున్న వాహనాన్ని అప్పగించడానికి రూ. 4000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక బ్యూరో (ACB) పట్టుకుంది.
Telangana Shocker:ఎండాకాలం క‌దా అని ఐస్ క్రీం తింటున్నారా? ఈ వీడియో చూస్తే వాటి జోలికే వెళ్ల‌రు, ఐస్ క్రీమ్ లో వీర్యం, మూత్రం క‌లుపుతున్న వ్య‌క్తి, సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్, అరెస్టు చేసిన పోలీసులు
VNSఎస్సై మహేందర్‌ విచారణ చేపట్టి బహిరంగ ప్రదేశంలో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురాం పుర్బియాను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరంగల్‌ జిల్లా గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ చేపూరి కృష్ణమూర్తి ఐస్‌క్రీమ్‌ బండికి సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. పంచాయతీ కార్యదర్శి సదానందంతో కలిసి ఐస్‌క్రీమ్‌ బండిలోని ఐటమ్స్‌ను బయట పారబోయించారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఏపీలోని ప‌లు జిల్లాల్లో పిడుగులు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌, ఏయే జిల్లాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న ఉందంటే?
VNSశ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు (Thunder Storms) పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం పడేసమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మనాథ్ సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
Telangana Shocker: దారుణం, హస్త ప్రయోగం చేసుకుని ఆ వీర్యాన్ని ఐస్ క్రీంలో పెట్టి అమ్ముతున్న వ్యాపారి, వైరల్ వీడియో ఇదిగో..
Hazarath Reddyసోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఐస్ క్రీంలో వీర్యం కలుపుతున్నాడు. రోడ్డు పక్కన ఐస్ క్రీం బండి పెట్టుకుని అమ్ముకుంటున్న ఓ యువకుడు బండి ముందు హస్త ప్రయోగం చేసి ఆ వీర్యాన్ని ఐస్ క్రీంలో కలపడం వీడియోలో చూడవచ్చు. వరంగల్ - నెక్కొండలో రోడ్డుపై ఈ దారుణం జరిగినట్లుగా తెలుస్తోంది.
Fake Female Police Officer Arrested: ఏడాది పాటు నకిలీ ఐడీ కార్డుతో ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐగా చెలామణి, చివరకు పెళ్లి చూపులకు యూనిఫారంతో వెళ్లి బుక్కయిన యువతి, అబ్బాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కటకటాల్లోకి..
Hazarath Reddyఏడాది కాలంగా నకిలీ ఆర్పీఎఫ్ ఎస్‌ఐగా(Fake RPF SI) చెలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్‌ (Secunderabad)పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో అర్.పి.ఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది.
Maharashtra Encounter: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఎన్‌కౌంటర్, నలుగురు మావోయిస్ట్‌ అగ్రనేతలు మృతి, కొనసాగుతున్న కూంబింగ్‌ ఆపరేషన్
Hazarath Reddyమహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మంగళవారం(మార్చి 19) తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు కాల్పులు ‍ జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్ట్‌ అగ్రనేతలు మృతి చెందారు.
Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజలను విడిచి వెళుతూ భావోద్వేగానికి గురైన తమిళసై సౌందరరాజన్‌, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందరరాజన్‌ రాష్ట్రాన్ని విడిచి వెళుతూ భావోద్వేగానికి గురయ్యారు. నేను తెలంగాణ ప్రజలను విడిచిపెట్టడం చాలా బాదగా ఉంది. నాకు సపోర్టుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు. మీరంతా నా సోదరులు, సోదరీమణులు, నేను మీ అందరితో టచ్ లో ఉంటాను, "నేను ఎప్పటికీ మీ సోదరినే అంటూ తమిళసై సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడారు.
C P Radhakrishnan: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌, పూర్తిస్థాయి గవర్నర్‌ నియామకం జరిగేదాకా బాధ్యతలు చేపట్టనున్న బీజేపీ మాజీ చీఫ్‌
Hazarath Reddyతెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం జరగాల్సి ఉన్న నేపథ్యంలో.. జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు
Nirmal Viral News: ట్యాక్స్ కట్టలేదని ఏకంగా ఇండ్ల గేట్లు ఎత్తుకెళ్లారు.. నిర్మల్‌ లో మొండి బకాయిదారులపై మున్సిపల్‌ అధికారుల కొరడా
Rudraట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులపై నిర్మల్‌ మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే రెడ్‌ నోటీసులను జారీ చేసిన అధికారులు.. నిర్మల్‌ పట్టణంలోని ప్రియదర్శినినగర్‌ కాలనీ, గాజుల్‌ పేట కాలనీల్లో సోమవారం పన్నుల వసూలుకు వెళ్లారు.
Break for Prajavani: తెలంగాణలో 'ప్రజావాణి'కి బ్రేక్.. లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందంటే??
Rudraలోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ పడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌ లోని ప్రజాభవన్‌ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Telangana Water Crisis: వీడియో ఇదిగో, కేసీఆర్ ఇంటికి తప్పని తాగు నీటి కష్టాలు, వాటర్ ట్యాంకర్లు తెప్పించిన స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి కూడా తాగు నీటి కష్టాలు తప్పడం లేదు.. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో నీటి సమస్య ఉండడంతో.. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాటర్ ట్యాంకర్ తెప్పించారు.
Telangana Elections 2024: రూ. 50 వేలు నగదు ఉంటే పేపర్లు తప్పనిసరి, రానున్న ఎన్నికలపై కీలక సూచనలు చేసిన తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌
Hazarath Reddyతెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
Delhi Liquor Policy Case: కవిత అరెస్టుపై కీలక ప్రకటన చేసిన ఈడీ, ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు చెల్లించారని వెల్లడి, వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారని తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌ (ఈడీ) ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల15న కవితను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఈ నెల 23 తేదీ వరకు కవిత కస్టడికి తీసుకున్నట్లు తెలిపింది.
Telangana Elections 2024: అమల్లోకి ఎన్నికల కోడ్, మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల విలువైన బంగారం పట్టివేత, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyలోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని గుర్తించారు
Telangana: మల్లారెడ్డి కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత, 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో ధర్నాకు దిగిన విద్యార్థులు, కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం
Hazarath Reddyమేడ్చల్ మండలం మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా,అశ్రద్ద వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.