తెలంగాణ

Telangana: పెద్దపల్లి జిల్లాలో ఘోర విషాదం, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి, ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్న అధికారులు

Hazarath Reddy

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు దుర్మరణం చెందారు. చీకురాయి, కొత్తపల్లి గ్రామాల మధ్య రైలు పట్టాలపై మరమత్తులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Telangana: ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎలా ఉందో చూశారా, ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేసి అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

మంత్రి కేటీఆర్ సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌కాశ్ రాజ్ ద‌త్త‌త తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందింద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజ‌య్య‌తో క‌లిసి గొప్ప పురోగ‌తిని సాధించార‌ని కేటీఆర్ కొనియాడారు

Khammam Horror: రోడ్డుపై ముక్కూ, ముఖం తెలియని వారు లిఫ్ట్ అడగ్గానే.. ఇస్తున్నారా? అయితే, ఈ స్టోరీ మీకోసమే.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ తో పొడిచి చంపేశాడు! ఖమ్మంలో దారుణ ఘటన

Jai K

బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి.. ఎక్కిన తర్వాత వెనక నుంచి ఇంజక్షన్ గుచ్చి చంపేశాడో కిరాతకుడు. ఖమ్మం జిల్లాలో జరిగిందీ ఘటన.

Weather Forecast: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

Hazarath Reddy

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు అల్పపీడన ప్రాంతంలోనే స్థిరంగా కొనసాగుతున్నది.

Advertisement

Batukamma: తెలంగాణకు కొత్త శోభ.. ఈ నెల 25 నుంచి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు.. 9 రోజుల పాటు ఘనంగా బతుకమ్మ వేడుకలు.. అక్టోబరు 3 వరకు ఉత్సవాలు

Jai K

తెలంగాణ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దసరాకు ముందు వచ్చే ఈ ఉత్సవాలు తెలంగాణకు కొత్త శోభనిస్తాయి. ఈసారి బతుకమ్మ ఉత్సవాలు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకు జరగనున్నాయి.

Weather Forecast: ఏలూరును కుమ్మేసిన వర్షం, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Hazarath Reddy

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం (formation of low pressure in Bay of Bengal) ఏర్పడిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ తదుపరి 24 గంటలలో మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

Hyderabad: పంజాగుట్టలో దారుణం, యువతి గొంతు కోసి పరారయిన యువకుడు, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విజయ్‌సింహ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా తనకు పరిచయమైన ఓ వివాహిత గొంతును కత్తితో (Man slits woman's throat ) కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

Telangana Shocker: పిల్లలు నాకు పుట్టలేదని అనుమానం, వారిని గొంతు కోసి దారుణంగా చంపేసిన తండ్రి, తనను కూడా చంపేస్తాడనే కోపంతో అతన్ని చంపేసిన భార్య

Hazarath Reddy

తెలంగాణలో నాగర్​కర్నూల్ జిల్లాలో దారుణం (Telangana Shocker) చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ కర్కశ తండ్రి కన్నబిడ్డలను కిరాతకంగా హత్య (Husband who killed children) చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు.

Advertisement

NIA searches: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు.. నిజామాబాద్, నిర్మల్‌, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాడులు

Jai K

తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్, నిర్మల్‌, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాడులు చేపట్టింది. నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో 23 బృందాలతో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించగా... కర్నూలు, కడప జిల్లాల్లో మరో 23 బృందాలతో సోదాలు జరుగుతున్నాయి.

CM KCR: సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన, వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల బిల్లుపై జీవో జారీ చేస్తామని హామీ..

Krishna

రాబోయే వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి జీవో విడుదల చేస్తామని, సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల‌ ఆత్మీయ స‌భ నిర్వ‌హించారు. ఈ ఆత్మీయ స‌భ‌కు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి గిరిజ‌నులు, ఆదివాసీలు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు.

Reservation for Girijans: తెలంగాణలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, వారంలో జీవో విడుదల చేస్తాం, మోదీ ఒప్పుకుంటావా? ఉరేసుకుంటావా? సూటిగా ప్రశ్నించిన కేసీఆర్, గిరిజనులపై వరాలు కురిపించిన తెలంగాణ సీఎం

Naresh. VNS

గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు (10 per cent reservation) అమ‌లు చేస్తామ‌ని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుద‌ల చేస్తామ‌ని కేసీఆర్ (CM KCR) ప్రక‌టించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల‌ ఆత్మీయ స‌భ నిర్వహించారు

Telangana Integration Day: అటు సమైక్యతా వజ్రోత్సవాలు.. ఇటు విమోచన దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Jai K

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.

Advertisement

Telangana Liberation Day: అమరవీరులకు నివాళులు అర్పించిన అమిత్ షా

Jai K

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు.

Telangana Integration Day: సమైక్యతా వజ్రోత్సవాలు.. అసెంబ్లీలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్‌, చైర్మన్‌ గుత్తా

Jai K

అసెంబ్లీలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్‌, చైర్మన్‌ గుత్తా

Telangana Integration Day:రేపు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం, తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాన్ని సందర్భంగా అన్ని కార్యాలయాలకు సెలవు

Hazarath Reddy

తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని.. రేపు తెలంగాణ ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, విద్యాసంస్థ‌ల‌కు శ‌నివారం సెల‌వు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Amit Shah Hyderabad Tour: ఇవాళ హైదరాబాద్‌కు కేంద్రహోంమంత్రి అమిత్ షా, విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న షా, రోజంతా బిజీ బిజీగా కార్యక్రమాలు ఖరారు, ఇదే టూర్‌లో ప్రభాస్‌తో సమావేశం

Naresh. VNS

విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు. సభ అనంతరం పరేడ్ గ్రౌండ్ నుంచి బేగంపేట టూరిజం ప్లాజా‌కు బయలుదేరుతారు. టూరిజం ప్లాజాలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌కు అమిత్ షా చేరుకుంటారు.

Advertisement

Telangana Secretariat: తెలంగాణ సచివాలయం ఇకపై బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం, ఏకగ్రీవ తీర్మానం చేసిన తెలంగాణ అసెంబ్లీ, త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని తెలిపిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిర్ణయం తీసుకుంది.

HM Amit Shah To visit Hyd: హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్‌లో పోస్టర్లు, కంటోన్మెంట్ యువత పేరుతో వెలసిన పోస్టర్లు

Hazarath Reddy

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్న సంగతి విదితమే. 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ విమోచన దినం కార్యక్రమంలో పాల్గొంటారు. పరేడ్ గ్రౌండ్ లో ఆయన జాతీయ జెండాను ఎగురవేస్తారు.

Hyderabad Shocker: ఓయో రూంలో బరి తెగించిన కామాంధులు, మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు యువతిపై దారుణంగా అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం జరిగింది. కొందరు దుండగులు.. అమ్మాయి(13)ని కిడ్నాప్‌ చేసి, సామూహిక లైంగిక దాడికి (Minor drugged, gang-raped) పాల్పడ్డారు. కాగా, జూబీహిల్స్‌ మైనర్‌ అత్యాచార ఘటన ఇంకా మరువకముందే ఇలా మరో ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

YS Sharmila: పిచ్చికూతలు కూస్తే చెప్పుతో సమాధానం చెప్తాం! మంత్రి నిరంజన్‌ రెడ్డిపై మరోసారి షర్మిల ఫైర్, చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పాలమూరు నీళ్ల పోరులో మాటలయుద్ధం

Naresh. VNS

తనను మంగళవారం మరదలు అన్న వ్యాఖ్యలపై షర్మిల సీరియస్ అయ్యారు. మరోసారి పిచ్చికూతలు కూస్తే చెప్పుతో సమాధానం చెప్తానన్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి.. రైతులపై ప్రేమ లేదన్న షర్మిల.. ఒకవేళ నిజంగా ప్రేమే ఉంటే.. తనతో పాటు దీక్షలో కూర్చోవాలని సవాల్ విసిరారు.

Advertisement
Advertisement