COVID19 in TS: తెలంగాణలో కొత్తగా మరో 1579 మందికి పాజిటివ్, మరో 1811 మంది రికవరీ, రాష్ట్రంలో 2,26,124కు చేరిన మొత్తం కేసుల సంఖ్య, 20,488గా ఉన్న ఆక్టివ్ కేసులు
COVID 19 in Telangana. | Photo Credits: IANS)

Hyderabad, October 21:  తెలంగాణలో కొవిడ్19 వ్యాప్తి ఇప్పుడిప్పుడే నియంత్రణలోకి వస్తోంది, అయితే ఇది పండగల సీజన్ కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత విస్తరించే ప్రమాదం పొంచి ఉంది, నిన్న ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా నొక్కిచెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 41,475 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1579 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 1120 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 39,40,304 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,26,124కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 256 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 135, రంగారెడ్డి నుంచి 102 కేసులు నిర్ధారణయ్యాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొవిడ్ ఇంకా నియంత్రణలోకి రాలేదు. నిన్న పలు జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది.నిన్న  ఖమ్మం నుంచి 106 కేసులు రాగా, పక్కనే  కొత్తగూడెం నుంచి 87,  నల్గొండ జిల్లా నుంచి 90 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితికి సంబంధించి రోజూవారీ హెల్త్ బులెటిన్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది.
Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 5 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1287కు పెరిగింది.

అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 1811 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,04,388 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 20,449 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.