Technology
GitLab Layoffs: ఆగని ఉద్యోగాల కోతలు, 7 శాతం ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం గిట్‌ల్యాబ్‌
Hazarath Reddyటెక్ దిగ్గజం తన హెడ్‌కౌంట్‌ను 7 శాతం తగ్గించుకోనున్నట్లు తెలిపింది. గిట్‌ల్యాబ్‌తో పాటు, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్ వంటి అనేక ఇతర టెక్ కంపెనీలు ఉద్యోగాల కోతలను ప్రకటించాయి.
Twitter Down: ట్విట్టర్ మరోసారి డౌన్, కొందరికి మాత్రమే ట్విట్టర్ లో సమస్యలు, సోషల్ మీడియా యాజర్ల ఫన్నీ మీమ్స్ తో హోరెత్తుతున్న ట్విట్టర్
VNSప్రముఖ సోషల్ మీడియా బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డౌన్ అయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్విట్టర్ పనిచేయడం లేదు. అయితే ఈ సమస్య అందిరికీ తలెత్తలేదు. కొందరు మాత్రం ట్విట్టర్ ను యాక్సెస్ చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో ట్విట్టర్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్‌ తో ట్వీట్లు పోటెత్తుతున్నాయి.
WhatsApp New Features: ఇకపై వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్, దాంతో పాటూ వాట్సాప్‌లో కాల్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు, సరికొత్త ఫీచర్లను పరిశీలిస్తున్న వాట్సాప్
VNSఇటివలే వాట్సాప్‌ సేవలు కొంత సమయం ఆగిపోయిన తర్వాత నుంచి వినియోగదారుల్లో దానిపై నమ్మం పోయింది. దీంతో వాట్సాప్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అదిరిపోయే ఫీచర్లను వినియోగదారులకు తీసుకోస్తోంది. రాబోయే సంవత్సరంలో కాల్ రికార్డింగ్, మెసేజ్ ఎడిట్ వంటి అనేక ఫీచర్లు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.
Twitter Down: ట్విట్టర్ మరోసారి డౌన్, కొందరికి మాత్రమే ట్విట్టర్ లో సమస్యలు, సోషల్ మీడియా యాజర్ల ఫన్నీ మీమ్స్ తో హోరెత్తుతున్న ట్విట్టర్
VNSప్రముఖ సోషల్ మీడియా బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డౌన్ అయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్విట్టర్ పనిచేయడం లేదు. అయితే ఈ సమస్య అందిరికీ తలెత్తలేదు. కొందరు మాత్రం ట్విట్టర్ ను యాక్సెస్ చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో ట్విట్టర్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్‌ తో ట్వీట్లు పోటెత్తుతున్నాయి.
Cyberattack: ఆసియాలో సైబర్ అటాక్ బారీన పడిన దేశాల్లో భారత్‌దే అగ్రస్థానం, ప్రపంచ వ్యాప్తంగా అమెరికా తర్వాత రెండో స్థానం మనదే..
Hazarath Reddy2022లో ఆసియాలో అత్యధికంగా హ్యాకర్ల దాడికి గురైన దేశం భారత్, దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా (అమెరికా తర్వాత) రెండవ అత్యధిక దాడి జరిగిన దేశం కూడా మనదేనని బుధవారం ఒక నివేదిక చూపించింది. గతేడాది భారత్‌పై సైబర్‌ దాడులు 24.3 శాతం పెరిగాయి.2
PM Modi Speech in Lok Sabha: ప్రపంచం భారత్ డిజిటల్ వైపు చూస్తోంది, డిజిటల్ ఇండియా ప్రతిచోటా మారుమోగిపోతోంది, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ప్రధాని మోదీ
Hazarath Reddyభారతదేశం యొక్క డిజిటల్ రంగంలో తన బలాన్ని ప్రదర్శించిన వేగంతో & ఆధునికత వైపు మార్పు చేసింది - ఇది మొత్తం ప్రపంచంచే అధ్యయనం చేయబడుతోంది. నేను G20 సమ్మిట్ కోసం బాలిలో ఉన్నాను. డిజిటల్ ఇండియా ప్రతిచోటా ప్రశంసించబడింది & దేశం దీన్ని ఎలా చేస్తుందో అనే ఉత్సుకత వారిలో ఉందని ప్రధాని మోదీ పార్లమెంట్ లో తెలిపారు.
HDFC Raises Loan Interest Rates: వడ్డీ రేట్లను అమాంతం పెంచేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, 10 బేసిస్‌ పాయింట్లు పెరిగిన ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లు
Hazarath Reddyప్రైవేట్‌ బ్యాంక్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ.. లోన్‌లపై వడ్డీ రేట్ల(ఎంసీఎల్‌ఆర్‌)ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధులు తెలిపారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్‌ సైట్‌ ప్రకారం.. ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లు 10 బేసిస్‌ పాయింట్ల పెరిగాయి.
Infosys Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్‌, 600 మంది ఫ్రెషర్లను తీసేసిన టెక్ దిగ్గజం, ఇంటర్నల్‌ పరీక్షలో ఫెయిలే కారణం, అధికారికంగా ఇంకా స్పందించని ఇన్ఫోసిస్‌
Hazarath Reddyదేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. విప్రో బాటలోనే షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్‌ పరీక్షలో ఫెయిల్‌ అయ్యారంటూ ఆరు వందల మంది ఫ్రెషర్లను తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇన్ఫోసిస్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Daraz Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 11 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న అలీబాబా గ్రూప్ వెంచర్ దరాజ్ గ్రూప్
Hazarath Reddyఅలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ నిధులతో వెంచర్ అయిన దరాజ్ గ్రూప్ ఆన్‌లైన్ షాపింగ్ మందగమనం మధ్య 11% వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ దక్షిణాసియా ప్రాంతంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటి.
SecureWorks Layoffs: ఆగని ఉద్యోగాల కోతలు, 200 మంది ఉద్యోగాలను పీకేసిన బర్‌ సెక్యూరిటీ కంపెనీ సెక్యూర్‌వర్క్స్, వ్యయాలను తగ్గించుకునే పనిలో పడిన కంపెనీ
Hazarath Reddyఅమెరికన్ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ సెక్యూర్‌వర్క్స్ తన వర్క్‌ఫోర్స్‌లో 9 శాతం కోత పెట్టనుంది. మార్కెట్‌వాచ్‌లోని ఒక నివేదిక ప్రకారం , సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ చేసిన తొలగింపులు 200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వ్యయాలను తగ్గించుకునే కంపెనీ ప్రణాళికలో భాగంగా ఈ తొలగింపు ఉంది.
Paytm Offline Payments: దూసుకుపోతున్న పేటీఎం, జనవరి నెలలో 89 మిలియన్లకు చేరుకున్న యూజర్లు, 6.1 మిలియన్ డివైస్‌ల్లో పేటీఎం కార్యకలాపాలు
Hazarath Reddyభారతదేశంలోని ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల దిగ్గజం Paytm జనవరి 2023 నెలలో తన వ్యాపార నిర్వహణ పనితీరును ప్రకటించింది. జనవరి 2023 కి సగటు నెలవారీ లావాదేవీలు చేసే వినియోగదారులు (MTU) 89 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. 6.1 మిలియన్ల వ్యాపారులు తమ చెల్లింపులు పేటిఎం ద్వారా చేస్తున్నారని ప్రకటించింది. జనవరి నెలలో 0.3 మిలియన్ల పెరుగుదల నమోదు చేసింది.
EBay Layoffs: భారీగా ఊడుతున్న ఉద్యోగాలు, టెక్‌ కంపెనీల బాటలోనే ఈబే, 500 మందిని తొలగిస్తూ సంచలన నిర్ణయం, అమ్మకాలు తగ్గడంతోనే ఉద్యోగులను సాగనంపుతున్నామంటూ ప్రకటన
VNSప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఈబే కూడా తాజాగా లేఆఫ్ ప్రకటించింది. (EBay Layoff) ఈబే ఈకామర్స్ కంపెనీ 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో(Declining sales) 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈబే(E commerce Company) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ (Chief Executive Officer Jamie Iannone)మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Zoom Layoffs: జూమ్‌ యాప్ సంచలన నిర్ణయం, భారీగా ఉద్యోగుల్ని తొలగిస్తూ ప్రకటన, మూడేళ్లలో కొత్త ఉద్యోగుల్ని తీసుకొని తప్పు చేశామంటూ పశ్చాత్తాపం
VNSరెండేళ్లుగా భారీగా నియామకాలు చేసుకున్న జూమ్ కంపెనీ(Zoom)...తమ ఉద్యోగుల్లో 15 శాతం మందికి ఉద్వాసన పలుకనుంది. అంటే దాదాపు 1300 మంది ఉద్యోగులను తొలగించనుంది. కరోనా సమయంలో భారీగా సేవలు అందించాల్సిన అవసరం కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని నియమించుకున్నామని, ఇప్పుడు ఆర్ధిక భారం తగ్గించుకోవడంలో భాగంగా తొలగింపులు తప్పడం లేదని జూమ్‌ సీఈవో ఎరిక్ యువాన్ (Eric Yuan) తెలిపారు.
ChatGPT vs Bard: మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన గూగుల్, చాట్‌బాట్‌కి పోటీగా బార్డ్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన సుందర్ పిచాయ్
Hazarath Reddyమైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబ‌డులతో గూగుల్‌కి సవాల్‌గా తీసుకొచ్చిన చాట్‌జీపీటీకి పోటీగా (ChatGPT vs Bard) గూగుల్ సరికొత్త ఏఐ బేస్డ్ చాట్‌బాట్‌ ‘బార్డ్’ ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్‌ను కూడా మొదలు పెట్టింది. అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
UPI Payments: యూజర్లకు ఫోన్ పే శుభవార్త, విదేశాలకు కూడా మీ ఫోన్ పే నుండి యూపీఐ లావాదేవీలు జరుపుకోవచ్చు, కొత్త ఫీచర్ లాంచ్ చేసిన PhonePe
Hazarath Reddyయూజర్లకు ఫోన్ పే శుభవార్తను అందించింది. తమ వినియోగదారులు యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్‌ను ఉపయోగించి యుఎఇ, నేపాల్, సింగపూర్‌తో సహా ఐదు దేశాల్లోని అంతర్జాతీయ మర్చంట్ అవుట్‌లెట్‌లకు ఇప్పుడు చెల్లించగలరని ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే మంగళవారం తెలిపింది
WhatsApp Feature Update: వాట్సప్ నుంచి కొత్త ఫీచర్స్, ఒకపై వాట్సాప్ స్టేటస్‌లో 30 సెకన్ల వరకు వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేసి షేర్ చేసుకోవచ్చు
Hazarath Reddy'వాయిస్ స్టేటస్', 'స్టేటస్ రియాక్షన్స్'మరెన్నో ఫీచర్లు మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ మంగళవారం ప్రకటించింది. కొత్త ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి రావడం ప్రారంభించాయి. రాబోయే వారాల్లో అందరికీ అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Boeing Begins Layoffs:ఆగని ఉద్యోగాల కోత, 2000 మంది ఉద్యోగులను తొలగించిన ఏవియేషన్ దిగ్గజం బోయింగ్
Hazarath Reddyఏవియేషన్ దిగ్గజం బోయింగ్ ఈ ఏడాది ఫైనాన్స్ మరియు హెచ్‌ఆర్ వర్టికల్స్‌లో 2,000 ఉద్యోగాలను తొలగిస్తోంది. కంపెనీ వాటిలో మూడింట ఒక వంతు ఉద్యోగాలను బెంగళూరులోని టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ (టిసిఎస్)కి అప్పగించినట్లు మీడియా నివేదించింది.
Swiggy: తొలిసారిగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకున్న స్విగ్గీ, పద్మశ్రీ అవార్డు గ్రహీత మల్లికా శ్రీనివాసన్ స్వతంత్ర డైరక్టర్‌గా నియామకం
Hazarath Reddyస్విగ్గీ సోమవారం తన బోర్డుకు ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించినట్లు ప్రకటించింది - పద్మశ్రీ అవార్డు గ్రహీత మల్లికా శ్రీనివాసన్, TAFE చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్; శైలేష్ హరిభక్తి & అసోసియేట్స్ ఛైర్మన్ శైలేష్ హరిభక్తి, ఢిల్లీవేరిలో మేనేజింగ్ డైరెక్టర్, CEO సాహిల్ బారువాలను స్వతంత్ర డైరక్టర్లుగా నియమించింది.
HAL's Helicopter Factory: దేశంలోనే అతిపెద్ద హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం, కర్ణాటకలోని తుమకూరులో ప్రారంభించిన ప్రధాని మోదీ
Hazarath Reddyహిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కర్ణాటక తుమకూరులో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Stock Market Highlights: రూపాయి ఢమాల్, వరుసగా ఐదో రోజలు లాభాలకు బ్రేక్, నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Hazarath Reddyదేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు ఆఖరి క్షణాల్లో కాస్త నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. కాగా సెన్సెక్స్‌లో ఐదు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్‌ 335 పాయింట్ల నష్టంతో 60507 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు నష్టంతో17764 వద్ద ముగిసాయి.