World

Woman Fight Off Attacker: జిమ్‌లో కామాంధుడు, యువతిని నేలపై పడేసి అత్యాచార యత్నం, ధైర్యంగా పోరాడి శీలాన్ని కాపాడుకున్న యువతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఫ్లోరిడాలో ఓ వ్యక్తి జిమ్ లోనే యువతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. అగంతకుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తన శక్తికి మంచి ప్రయత్నించింది. కామాంధుడికి భయపడకుండా ధైర్యంగా పోరాడింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

Tattoo Of Marriage Certificate On Arm: ప్రపంచంలో ఇలా ఎవ్వరూ ప్రేమను వ్యక్తపరచి ఉండరేమో! వాలంటైన్ డే రోజున భార్యకు బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్, వినూత్నమైన టాటూతో ప్రేమను తెలియజెప్పిన వ్యక్తి

VNS

థాయిలాండ్‌లో అలాంటి తరహా ఘటనలో ఒకటి వెలుగుచూసింది. ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి తన భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఏకంగా మ్యారేజ్‌ సర్టిఫికెట్‌నే టాటూ(Marriage certificate tattoo)లా వేయించుకొని ఆశ్చర్యపరిచాడు. థాయిలాండ్‌కు చెందిన వాల్‌ అనే వ్యక్తి తన చేతిపై వేయించుకున్న టాటూ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Surging Seas: ముంచుకొస్తున్న మృత్యువు, పెరుగుతున్న సముద్ర మట్టాలతో దేశాలకు దేశాలే సమాధి, పెరుగుతున్న సముద్ర మట్టాలపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆందోళన

Hazarath Reddy

1900 నుండి ప్రపంచ సముద్ర మట్టాలు వేగంగా పెరిగాయని..ఈ పెరుగుదల చైనా, భారతదేశం, నెదర్లాండ్స్ వంటి దేశాలను ప్రమాదంలో పడేస్తుందని (Rising seas risk) ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. లోతట్టు తీర ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 900 మిలియన్ల మంది ప్రజలను తీవ్రంగా ప్రమాదంలో (death sentence) పడేస్తుందని ఐక్యరాజ్యసమితి చీఫ్ మంగళవారం హెచ్చరించారు.

Toxic Train Derailment: రైలు ప్రమాదంతో వణుకుతున్న అమెరికా, విషపూరిత వాయువులు గాలిలోకి, బాటిల్‌లోని నీటినే తాగాలని ప్రజలను హెచ్చరించిన ఓహియో గవర్నర్

Hazarath Reddy

అమెరికాలోని ఒహియో ఇటీవల ఓ గూడ్స్‌ రైలు (Toxic Train Derailment) బోల్తాపడిన సంగతి విదితమే. ఇప్పుడు ఆ ప్రమాదం కారణంగా అత్యంత ప్రమాదకరమైన గ్యాస్‌లు వాతావరణంలో కలిశాయి.అక్కడ నీటిలో ఈ రసాయనాలు కలిసాయి. దీంతో అక్కడి ప్రజలు బాటిల్‌లోని నీటినే తాగాలని (Ohio Urged Not To Drink Water) ఆ రాష్ట్ర గవర్నర్‌ మైక్‌ డివైన్‌ కోరారు.

Advertisement

Turkey-Syria Earthquake: 10 రోజులు దాటినా ఆగని మృత్యు ఘోష, శిథిలాల కింద నుంచి ఇంకా వినిపిస్తున్న ప్రజల ఆర్తనాదాలు, పెను విషాదాన్ని మిగిల్చిన టర్కీ, సిరియా భూకంపాలు

Hazarath Reddy

టర్కీ, సిరియాలో సంభవించిన వరుస భూకంపాలు (Turkey-Syria Earthquake) పెను విషాదాన్ని మిగిల్చాయి. భూంకంపం వచ్చి 10 రోజులు ధాటినా నేటీకి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా కూలిన భవన శిథిలాలు, వాటి కింద చితికిన బతుకుల ఆనవాళ్లే కనిపిస్తున్నాయి.

Texas Shooting: టెక్సాస్‌లో కాల్పుల కలకలం, సీలో విస్టా షాపింగ్‌ మాల్‌‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

అమెరికాలో టెక్సాస్‌లోని సీలో విస్టా షాపింగ్‌ మాల్‌ (Cielo Vista Mall )లో గురువారం కాల్పుల ఘటన చోటు చేసుకుంది.ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా.. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.ముగ్గురిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Blast in Quetta-bound Jaffer Express: జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి, మరో నలుగురికి గాయాలు, ఉగ్రవాదుల పనేనని అనుమానాలు

Hazarath Reddy

గురువారం పాకిస్థాన్‌లోని క్వెట్టా వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో పేలుడు సంభవించడంతో కనీసం ఇద్దరు ప్రయాణికులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.వివరాల ప్రకారం రైలు చిచావత్ని రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుండగా పేలుడు సంభవించింది.

LPG Gas Leakage: గ్యాస్ లీక్ ఘటనలో నేపాల్ ఎంపీ చంద్ర భండారికి తీవ్ర గాయాలు, ఆయనతో పాటు తల్లికి కూడా గాయాలు, మెరుగైన వైద్యం కోసం ముంబై తరలించిన అధికారులు

Hazarath Reddy

LPG గ్యాస్ లీకేజీ పేలుడులో నేపాల్ ఎంపీ చంద్ర భండారి గాయపడ్డారు.ఆయనకు 25% శరీరం కాలి పోగా అతని తల్లికి 80% గాయాలు అయ్యాయి. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని తెలుస్తోంది.నేపాల్ ఎంపీ చంద్ర భండారీతో పాటు, అతని తల్లిని తదుపరి చికిత్స కోసం ముంబైకి విమానంలో తరలిస్తారని చంద్ర భండారీ సచివాలయం అధికారులు తెలిపారు.

Advertisement

Pakistan Economic Crisis: పెట్రోలు ధర లీటరుకు రూ.22.20 పెంపు, పాకిస్తాన్‌లో 272 రూపాయలకు చేరుకున్న Petrol ధర

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్‌లో నిత్యవసర ధరలు చుక్కలు తాకుతున్నాయి. దేశంలో పెట్రోలు ధర లీటరుకు రూ.22.20 పెరగడంతో పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. పాకిస్థాన్‌లో ఇప్పుడు పెట్రోల్ ధర లీటరుకు 272 రూపాయలకు చేరుకుంది.

Pakistan Economic Crisis: లీటర్‌ పాల ధర రూ. 210, కిలో చికెన్ రూ.780, లీటర్‌ పెట్రోల్‌ రూ.272, దాయాది దేశంలో భగ్గుమంటున్న ధరలు

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్‌లో నిత్యవసర ధరలు చుక్కలు తాకుతున్నాయి. లీటర్‌ పాల ధర రూ. 210 కి చేరింది. పాడి ఉత్పత్తులతో పాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీభారీగా పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది.

Panama Bus Accident: పనామాలో ఘోర రోడ్డు ప్రమాదం, మినీ బస్సును ఢీకొట్టి లోయలో పడిన రెండు బస్సులు, 33 మంది అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

దురదృష్టకర సంఘటనలో, పనామాలో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే వలసదారులను రవాణా చేస్తున్న బస్సు.. మినీ బస్సును ఢీ కొట్టడంతో 33 మంది మరణించారు. రెండు వాహనాలు కొండ చరియపై నుంచి పడిపోయాయి.

Viral Video: బతికి ఉన్న చేపను పట్టుకొచ్చిన వెయిటర్, కస్టమర్ చాప్‌స్టిక్‌లను కొరకడంతో షాక్ తిన్న పుడ్ ఆర్డర్ యజమాని, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

జపాన్‌లోని ఓ రెస్టారెంట్‌లో వడ్డించిన చేప సజీవంగా వచ్చి కస్టమర్ చాప్‌స్టిక్‌లను కొరికింది. వడ్డించిన చేప సజీవంగా ఉంది. అది చాప్‌స్టిక్‌లను తినడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది, 11.4 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 80,000 మందికి పైగా లైక్‌లు వచ్చాయి.

Advertisement

Earthquake in New Zealand: న్యూజిలాండ్‌ దేశాన్ని వణికించిన భూకంపం, రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు, భయంతో పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

న్యూజిలాండ్‌ దేశాన్ని ఓ వైపు వరదలు, మరోవైపు భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. పరాపరౌముకు వాయవ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Marburg Virus: గబ్బిలాల నుంచి మరో ప్రమాదకర వైరస్, ఎబోలా మాదిరి గినియాను వణిస్తున్న మార్‌బర్గ్‌ వైరస్‌, నెల రోజుల్లో తొమ్మిది మంది మృతి, మార్బర్గ్ వైరస్ లక్షణాలు, చికిత్స మార్గాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఈక్వటోరియల్‌ గినియాలో ఎబోలా మాదిరి ప్రాణాంతకమైన వైరస్‌ వెలుగులోకి వచ్చింది. మార్‌బర్గ్‌ వైరస్‌ (Marburg Virus) ఆ దేశాన్ని వణికిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా నెల రోజుల్లో తొమ్మిది మంది చనిపోయారు. ఎబోలా మాదిరి ప్రాణాంతకమైన ఈ వైరస్‌ వల్ల రక్త స్రావ జ్వరం వస్తుందని, దీని వ్యాప్తికి గల కారణాలను అన్వేషిస్తున్నామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అయెకాబా సోమవారం వెల్లడించారు.

Layoffs 2023: సిలికాన్ వ్యాలీలో మొదలయిన ఉద్యోగాల కోత, భయంతో బతుకుతున్న టెక్ ఉద్యోగులు, ఇప్పటివరకు 2.5 లక్షల మందికి పైగా టెక్ ఉద్యోగులకు బై చెప్పిన కంపెనీలు

Hazarath Reddy

సిలికాన్ వ్యాలీలో ఉద్యోగుల తొలగింపుల (Layoffs 2023) కోసం అనేక కంపెనీలు సిద్ధమవుతున్నాయి; ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమలో 17,400 మంది ఉద్యోగులు ఫిబ్రవరిలోనే ఉద్యోగాలు కోల్పోయారు. జనవరిలో దాదాపు లక్ష మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయారు.

Turkey Earthquake: నిజంగా వీళ్లు మృత్యుంజయులే! భూకంపం సంభవించిన 8 రోజుల తర్వాత క్షేమంగా బయటపడ్డ వృద్ధురాలు, మనువరాలు, 198 గంటలుగా శిథిలాల కిందనే జీవించిన ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం

VNS

భారీ భూకంపంతో అతలాకుతలం అయిన టర్కీలో (Turkey) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం సంభవించి ఎనిమిది రోజులు గడుస్తున్నప్పటికీ....ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. అయితే గంటల తరబడి శిథిలాల కింద చిక్కుకున్న వారు బయటపడ్డారు. కానీ ఎనిమిదిరోజులుగా శిథిలాల కిందనే జీవించి (trapped for more than 8 days) ఉన్న ఇద్దరిని రెస్క్యూ టీం కాపాడింది.

Advertisement

Michigan Shooting: మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. పలువురికి గాయాలు

Rudra

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం భయాందోళనలను కలిగించింది. మిచిగాన్ రాష్ట్రంలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో సోమవారం ఉదయం కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో విద్యార్థులు అందరూ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని పోలీసులు కోరారు. కాల్పుల్లో పలువురికి గాయాలైనట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Thermo Fisher Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 230 మందిని పీకేసిన థర్మో ఫిషర్ కంపెనీ, కరోనా టెస్టులు తగ్గడంతో కీలక నిర్ణయం తీసుకున్న ఫార్మా కంపెనీ

Hazarath Reddy

2022లో తన కోవిడ్-19 పరీక్షల అమ్మకాలు మూడింట రెండు వంతుల తగ్గుదలని చూపించే ఆదాయాల నివేదికను తాజాగా ప్రచురించిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ కాలిఫోర్నియాలోని మూడు తయారీ సైట్‌లలో వందలాది మంది కార్మికులను తొలగించడం ప్రారంభించింది.

Cyclone Gabrielle: గంటకు 150 కిలోమీట్లర వేగంతో గాలులు, న్యూజిలాండ్‌ దేశాన్ని వణికిస్తున్న గాబ్రియెల్ తుఫాను, గత 24 గంటల్లో 4 అంగుళాల వర్షం

Hazarath Reddy

న్యూజిలాండ్‌ దేశాన్ని గాబ్రియెల్ తుఫాను వణికిస్తున్నది. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో 250 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆక్లాండ్ నగరంలో గాలి వేగం ప్రస్తుతం గంటకు 110 కిలోమీటర్లుగా ఉన్నది. ఉత్తరాది ప్రాంతాల్లో దాదాపు 46 వేల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Earthquake In Turkey Again: టర్కీలో మళ్లీ భూకంపం.. 4.7 తీవ్రతతో మరోమారు కంపించిన భూమి

Rudra

ఇటీవలి భూకంపంతో మరుభూమిగా మారిన టర్కీలో మరోమారు భూకంపం సంభవించింది. నిన్న 4.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.

Advertisement
Advertisement