World
Karnataka Bypoll Results 2019: ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు, ఊపిరి పీల్చుకునే దిశగా బీజేపీ, సిట్టింగ్ స్థానాలను కోల్పోయే దిశగా కాంగ్రెస్, జేడీఎస్, 10 స్థానాల్లో బీజేపీ లీడింగ్
Hazarath Reddyకర్ణాటక(Karnataka)లో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అయింది. అధికార బీజేపీ(BJP)కి చెందిన మెజార్టీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో తేడావస్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ఉపపోరు ఆసక్తి రేకెత్తించింది.ప్రస్తుతం బీజేపీ 10 స్థానాల్లో ముందంజలో ఉండగా, జేడీఎస్‌(JDS), కాంగ్రెస్‌(Congress)లు చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
Onion Prices Cross Rs 200/Kg: ఉల్లి డబుల్ సెంచరీ కొట్టేసింది, వంటింట్లో మాయమవుతున్న ఉల్లి, లబో దిబో మంటున్న వినియోగదారులు
Hazarath Reddyరోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరల(Onion price)కు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. దేశవ్యాప్తంగా పలు చోట్ల కిలో ఉల్లి రూ.200 దాటేసింది. తమిళనాడులోని మధురై(Madurai)లో ఉల్లిధర కిలోకు రూ. 200కు చేరుకుంది.
Delhi Anaj Mandi Fire: అందరూ కూలీలే, ఎటు చూసినా విషాద ఛాయలే, ఢిల్లీ చరిత్రలో రెండో అతి పెద్ద అగ్ని ప్రమాదం, 43కు చేరిన మృతుల సంఖ్య, విష వాయువులతో నిండిన బిల్డింగ్, ఊపిరి ఆడక కార్మికుల మృత్యువాత, దర్యాప్తుకు ఆదేశించిన ఢిల్లీ సర్కారు
Hazarath Reddyదేశ రాజధానిలో అత్యంత ఘోరమైన ప్రమాదం (Delhi Fire Tragedy) జరిగింది. ఢిల్లీ చరిత్రలో రెండో అతి పెద్ద ప్రమాదంగా నిలిచిన ఈ అగ్ని ప్రమాదంలో 44 మంది చనిపోయారు. మరో 22 మందికిపైగా గాయాలపాలయ్యారు. వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఝాన్సీ రోడ్‌లోని అనాజ్ మండీ(Anaj Mandi)లో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. తెల తెల వారగానే వారి బతుకులు అగ్నికి ఆహుతైపోయాయి.
Rs 2000 Note-Viral Whastapp Message: రూ.2 వేల నోటు రద్దవుతోంది, వెయ్యి రూపాయల నోటు వస్తోంది,సోషల్ మీడియాలో వైరల్ మెసేజ్, ఇదంతా ఫేక్, ఈ వదంతులను నమ్మవద్దంటున్న ఆర్‌బిఐ
Hazarath Reddyఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) షాకిచ్చిందని ఆ మెసేజ్ (viral message ) సారాంశం.
Free Drop Service For Women: రాత్రి 10 దాటితే ఉచితంగా డ్రాప్ సర్వీసు, అత్యాచార ఘటనల నేపథ్యంలో కర్ణాటకలోని గదగ్ పోలీసులు కీలక నిర్ణయం, మహిళలు రాత్రి పది దాటితే హెల్ప్‌లైన్‌కు వెంటనే కాల్ చేయండి, వివరాలు వెల్లడించిన గదగ్ ఎస్పీ శ్రీనాథ్ జోషి
Hazarath Reddyదేశ వ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతోన్న దాడులు, అత్యాచారాల ఘటనలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. తెలంగాణాలో దిశ రేప్ అండ్ మర్డర్ కేసు( Disha murder case), ఉన్నావ్ బాధితురాలి సజీవ దహనం (Unnao Rape Case) కేసులతో దేశంలో ప్రజల ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. మహిళలకు రక్షణ (Women's Protection) ఎక్కడ అంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
Delhi Fire Incident: ఢిల్లీ అగ్ని ప్రమాదం, బాధితులకు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ప్రమాద ఘటనపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు అదేశాలు
Hazarath Reddyఢిల్లీ(Delhi)లోని అనాజ్ మండీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం(Delhi Fire Incident)లో 43 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) సందర్శించారు.
Nithyananda: నన్ను ఏ మగాడు టచ్ చేయలేడు, నేను పరమ శివుడ్ని, వైరల్ అవుతున్న సెల్ప్ గాడ్ నిత్యానంద వీడియో, పాస్‌పోర్ట్ రద్దు చేసిన విదేశాంగ శాఖ, ఈక్విడార్ దీవి వాస్తవం కాదన్న ఈక్విడార్ రాయబార కార్యాలయం
Hazarath Reddyకర్ణాటక (Karnataka)లో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకొని... రేపులు, అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద(Nithyananda) ఇప్పుడు ఎక్కడున్నాడు? రేపు ఎక్కడుంటాడు? అనే దానిపై ఎవరికీ సమాచారం లేదు. కొన్నాళ్ల క్రితం నేపాల్‌ (Nepal) మీదగా విదేశాలకు పారిపోయాడు. చాలాకాలం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా వ్యవహారాలు నెట్టుకు వచ్చాడు.
Delhi Fire: మాంసపు ముద్దలుగా శరీరాలు, ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, 43 మంది మృతి, సంఖ్య మరింతగా పెరిగే అవకాశం, మంటలను అదుపులోకి తీసుకుంటున్న ఫైర్ సిబ్బంది, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనాజ్ మండీ(Anaj Mandi)లో గల ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో 43 మంది చనిపోయారు. ఘటనాస్థలానికి 30 ఫైరింజన్లు చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రిని తరలిస్తున్నారు. దాదాపు 50 మందిని సిబ్బంది రక్షించారు. అనాజ్ మండి ప్రాంతంలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 43మందికి పైగా మృతిచెందినట్టు తెలుస్తోంది.
Duct-Taped Banana: ఈ అరటి పండు ధర రూ.85 లక్షలు, రెండు అరటి పండ్లను కొనుగోలు చేసిన అమెరికన్, ఇంతకీ ఏముంది ఈ పండులో..
Hazarath Reddyఅరుదైన కళాఖండాలను కొందరు ఔత్సాహికులు కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేస్తారనే విషయం చాలామందికి తెలిసే ఉండవచ్చు. అయితే ఇక్కడ ఓ అరటిపండును అమెరికన్ ఏకంగా రూ. 85 లక్షలకు కొనుగోలు చేశాడు. గోడకు అతికించిన అరటిపండు (Duct-Taped Banana, Banana) అంత ధరకు కొనుగోలు చేయడమా అని నోరెళ్లబెట్టకండి.. ఆర్ట్ మీద ప్రేమ ఉన్నవాళ్లు ఎంతైనా పెట్టి కొనుగోలు చేస్తారు మరి.
CJI SA Bobde: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు, ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదు, న్యాయ విచారణ జరిగాకే శిక్షలు విధించాలి, తక్షణ న్యాయం అడగటం సరికాదన్న జస్టిస్ బాబ్డే
Hazarath Reddyదిషా నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే (CJI SA Bobde) సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపంలో ఉండకూడదని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే అన్నారు. ఇలా ఎన్‌కౌంటర్లు చేసుకుంటూ పోతే న్యాయం రూపురేఖలు మారిపోతాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Father Of The Year: ఈ తండ్రి రియల్ హీరో, కూతుర్ల చదువు కోసం రోజూ 12 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు, బడి చివరి గంట కొట్టే వరకు అక్కడే ఉంటాడు, బాంబుల మోత మోగే ఆప్ఘనిస్తాన్‌లోని మియా ఖాన్ గురించి తెలిస్తే ఆయనకు సెల్యూట్ చేస్తారు
Hazarath Reddyఆప్ఘనిస్తాన్..ఈ పేరు తెలియని వారు ఉండరు. అక్కడ నిత్యం ప్రభుత్వ దళాలు, ఉగ్రవాదులకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ బాంబు వచ్చి నెత్తి మీద పడుతుందో ఎవరికీ తెలియదు. అలాంటవి చోట ఓ తండ్రి తన ముగ్గురు కూతుర్ల కోసం పడుతున్న కష్టాన్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు.. ఆశ్చర్యపోవడమే కాదు ఆయనకు సెల్యూట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన స్టోరీ ఇది.
Latest TikTok Craze: రూ.2 వేలు,రూ.500 నోట్లను చిత్తు కాగితాల్లా విసిరేశారు, వీటి ఖరీదు దాదాపు కోటి రూపాయలు, గుజరాత్‌లోని జామ్ నగర్‌లో సంఘటన, పెళ్లి కొడుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
Hazarath Reddyభారత ఆర్థిక వ్యవస్థ (Indian economy) ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జీడీపీ రేటు 4.5 శాతంగా ఉంది. అయితే ఇది వ్యాపారస్తులకు పెద్ద సమస్య కానే కాదు. వాళ్లకు దీంతో పట్టింపు లేకుండా డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తుంటారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గుజరాత్(Gujarat)లోని జామ్ నగర్(Jamnagar)లో జరిగిన ఓ పెళ్లి..
Unnao Rape Case Victim: మృగాళ్ల వేటలో మరో మహిళ మృతి, చికిత్స పొందుతూ మరణించిన ఉన్నావ్ బాధితురాలు, తనపై అత్యాచారం కేసులో న్యాయం కోసం కోర్టుకు వెళుతుండగా కిరోసిన్ పోసి నిప్పంటించిన దుండుగులు, ఘటనపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
Hazarath Reddyదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అత్యాచారా ఘటనలే కనిపిస్తున్నాయి. ఏ పేపర్ తిరగేసినా అవే వార్తలు కనిపిస్తున్నాయి. దిషా ఘటన(Justic For Disha)తో దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికిన సంగతి అందరికీ తెలిసిందే. నిందితులను ఉరి తీయాలని, ఎన్ కౌంటర్ చేయాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ గళం విప్పారు.
Nitish Kumar Seeks Ban On Porn: పోర్న్ సైట్ల వల్లే రేప్‌లు పెరిగిపోతున్నాయి, ఈ పోర్న్‌సైట్లను వెంటనే నిషేధించాలి, వీటిని బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyదేశంలో రేప్‌లు, మర్డర్లు పెరిగిపోవడానికి కారణం అశ్లీల వెబ్‌సైట్లే( porn sites )నని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) వ్యాఖ్యానించారు.పోర్న్‌ సైట్ల కారణంగానే మహిళలపై లైంగిక నేరాలు(exual crimes against women) పెరుగుతున్నాయని వాటిని కట్టడి చేస్తే ఇవి చాలా వరకు తగ్గుతాయని ఆయన అన్నారు.
India vs West Indies 1st T20: కోహ్లీ దెబ్బకు కుదేలైన విండీస్, మొదటి టీ20 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం, 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించిన భారత్
Hazarath Reddyమూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 209 పరుగులు చేసి విజయం సాధించింది.
Rajasthan Minister Bhanwarlal Meghwal: టీవీలు, ఫోన్‌ల వల్లే రేప్‌లు జరుగుతున్నాయి, అవి రాకముందు ఇవేమి జరగలేదు, రేప్ కేసుల్లో మూడు నెలల్లోనే కోర్టులు తీర్పు ప్రకటించాలి, రాజస్థాన్ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyదేశంలో మహిళలపై అత్యాచారాలకు కారణం టీవీలు,మొబైల్ ఫోన్స్ మాత్రమేనని రాజస్థాన్ సాంఘీక సంక్షేమశాఖ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ (Bhanwarlal Meghwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీలు,మొబైల్స్ phones-and-tv)రాకముందు రేప్‌లు లేవని మంత్రి తెలిపారు.
Raah Group Foundation: నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు రివార్డు, ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు రివార్డును ప్రకటించిన రాహ్‌ గ్రూప్ ఫౌండేషన్‌, చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ ప్రకటనపై నెటిజన్ల ప్రశంసల వర్షం
Hazarath Reddyదిషా కేసు(Disha murder case)లో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ (Hyderabad Encounter) చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ నేతల దగ్గర నుంచి రాష్ట్ర నేతలు, సెలబ్రిటీలు అందరూ తెలంగాణ పోలీసుల(Hyderabad Police)పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే హరియాణాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డును కూడా ప్రకటించింది.
Cyclone Pawan Alert: వణికిస్తున్న అరేబియా మహాసముద్రం, పవన్ తుఫాను స్టార్టయింది. ఇప్పటికే మహా, క్యార్‌ తుఫాన్లతో జనజీవనం అతలాకుతలం, ఇండియాకు పవన్ సైక్లోన్ వల్ల అంత ప్రమాదం లేదంటున్న వాతావరణ శాఖ అధికారులు
Hazarath Reddyతుఫాన్లు తమ స్థావరాన్ని మార్చుకున్నాయి. ఇప్పటిదాకా బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడేవి. అయితే ఈ సారి అలా కాకుండా అరేబియా సముద్రం(Arabian Sea)లో అవి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం నైరుతి అరేబియాలో ఆఫ్రికా తీరంలో ‘పవన్‌’ తుఫాన్‌ (Cyclone pawan) కొనసాగుతుండగా, కర్ణాటక (Karnataka) తీరానికి ఆనుకుని తూర్పుమధ్య అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతోంది.
ISRO vs NASA: నాసా కాదు, రెండు నెలల కిందటే మేము విక్రమ్ జాడ గుర్తించాము. చెన్నై మెకానికల్ ఇంజినీర్ వార్తలపై స్పందించిన ఇస్రో చైర్మన్ కె. శివన్
Vikas Mandaకొత్తగా విక్రమ్ జాడను కనిపెట్టడం ఏంటి? ఇస్రో దానిని ఎప్పుడో కనిపెట్టింది అని చెప్పారు. చంద్రయాన్2 యొక్క సొంత ల్యూనార్ ఆర్బిటార్ విక్రమ్ జాడను అంతకుముందే గుర్తించింది. అయితే....
Prithvi-II Ballistic Missile: ఒడిశా తీరం నుంచి పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి రాత్రి వేళ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత్, ఈ క్షిపణి ప్రయోగం చేపట్టడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి
Vikas Mandaపృథ్వీ -2 బాలిస్టిక్ క్షిపణి 350 కి.మీ దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించగలిగే పరిధి కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మిసైల్ 500 నుండి 1,000 కిలోల వార్‌హెడ్‌లను మోయగల సామర్థ్యం కలది. ఇది లిక్విడ్ ప్రొపల్షన్ ట్విన్ ఇంజన్లతో...