Mahesh-Rajamouli: కొత్త ఏడాది ఆరంభంలోనే రాజమౌళితో సెట్స్ పైకి మహేశ్ మూవీ.. మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు.. ఈ నెలలోనే మొదలుకానున్న ప్రాజెక్టు.. తరువాత ప్రాజెక్టు రాజమౌళితో.. జనవరి 26వ తేదీన లాంచ్ చేసే ఆలోచన

Hyderabad, September 12: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం తన 28వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహించనున్నాడు. అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ వారంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ (Regular Shooting) మొదలవుతుందని అంటున్నారు. ఆ తరువాత సినిమాను రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పటి నుంచి మొదలవుతుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది.

పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య, దుర్గం చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న సాయి, విషాదంలో ఇండస్ట్రీ, ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగిన సాయికుమార్

జనవరి 26వ తేదీన ఈ సినిమా షూటింగును లాంఛనంగా ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఆ దిశ గానే పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది దక్షిణాఫ్రికా (South Africa) నేపథ్యంలో నడిచే అడ్వెంచర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు.