తాజా వార్తలు

Jammu and Kashmir Assembly Elections 2024: జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్‌, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఎన్నికలు

Hazarath Reddy

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది.జమ్మూ కశ్మీర్‌లో మొత్తం మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ 1న జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Nagpur Shocker: ఒళ్లు గగుర్పొడుస్తున్న వీడియో ఇదిగో, సరదాపడి చేసిన స్టంట్‌తో యువకుడు మృతి, డ్యాంలో మునిగిపోతున్న దృశ్యాలు వైరల్

Hazarath Reddy

మహారాష్ట్రలో యువకుడు తన స్నేహితులతో కలిసి జలాశయం వద్ద రిస్కీ స్టంట్స్‌ చేసి ప్రాణాలే కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు స్నేహితులు మకర్‌ధోక్డా డ్యామ్ కు ఆగస్టు 15న టూర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడకు వెళ్లిన అనంతరం అలుగుపారుతున్న డ్యామ్ కట్టపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Telangana Shocker: సిద్దిపేటలో దారుణం, వదినను గుడి ప్రాంగణానికి కట్టేసిన మరిది, మిత్తి ఇవ్వలేదని అరాచకం

Arun Charagonda

సిద్దిపేట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. డబ్బులు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ అన్న వదినను గుడి ప్రాంగణానికి కట్టేశాడు తమ్ముడు. కనకయ్య దగ్గర 1,20,000 అప్పుగా తీసుకున్నారు అన్న పరుశురాములు. తీసుకున్న అప్పు లక్ష చెల్లించగా మిగిలిన 20000 మిత్తి ఇవ్వాలంటూ వదినను అన్నను చెట్టుకు కట్టేశారు మరిది కనకయ్య .

Assembly Elections 2024 Schedule: మోగిన ఎన్నికల నగారా, జమ్మూ కశ్మీర్‌ , హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. జమ్మూకశ్మీర్‌, హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు

Advertisement

Bandi Sanjay On BRS: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలినమన్న కేంద్రమంత్రి బండి సంజయ్, కేసీఆర్‌కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి, కవితకు రాజ్యసభ అని కామెంట్

Arun Charagonda

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంజయ్... కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలనం తర్వాత కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం అన్నారు. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న పార్టీ కాంగ్రెస్‌ది అన్నారు. కవిత బెయిల్‌కు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.

MLA Paritala Sunitha: పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత, నేల తల్లికి పూజలు...వీడియో

Arun Charagonda

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత రైతుగా మారారు. వెంకటాపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం సందర్బంగా నేల తల్లికి పూజలు చేశారు. అనంతరం తోటి కూలీలతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు పరిటాల సునీత

CM Revanth Reddy On BRS: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా, కేసీఆర్ గవర్నర్ అవుతారన్న సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఏ పదవో తెలుసా?

Arun Charagonda

బీజేపీ - బీఆర్ఎస్ విలీనంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్..మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం పక్కా అని తేల్చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు నలుగురు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు.. వాళ్ల విలీనంతో కవితకు బెయిల్ వస్తుందని జోస్యం చెప్పారు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, బెడ్ రూంలో కానిస్టేబుల్‌తో శృంగారంలో మునిగిపోయిన భార్య, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన భర్త

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ సంఘటనలో తన భార్య కానిస్టేబుల్‌తో రూంలో అసభ్యకర స్థితిలో ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసు కానిస్టేబుల్‌తో తన భార్య బెడ్ మీద శృంగారంలో ఉండగా భర్త పట్టుకుని ఇద్దరినీ పట్టుకుని చితకబాదాడు.

Advertisement

IMD Weather Forecast: 25 రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, గత మూడు నెలల్లో వరదలకు 600కు పైగా మృతి

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 25 రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఢిల్లీలో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.

70th National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన, ఉత్తమ చిత్రంగా కార్తికేయ-2, కన్నడ బెస్ట్ మూవీగా కేజీఎఫ్‌-2..పూర్తి వివరాలివే

Arun Charagonda

70వ జాతీయ చలనచిత్రం అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2,ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్,ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్-1,ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్-2 దక్కించుకున్నాయి.

CM Revanth Reddy Meets Foxconn Chairman: మీ విజన్‌ అద్భుతం..సీఎం రేవంత్‌రెడ్డికి ఫాక్స్ కాన్ సీఈవో కితాబు, త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తా, పెట్టుబడులు పెడుతానని వెల్లడించిన యంగ్ లియూ

Arun Charagonda

త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని చెప్పారు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి- లియూ మధ్య జరిగిన భేటీలో హైదరాబాద్‌లో పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం చేశారు. ఇండ‌స్ట్రీ, స‌ర్వీస్ రంగాల్లో విస్త‌రించే స‌త్తా గ‌ల న‌గ‌రం హైదరాబాద్ అని కొనియాడారు. ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం అని కితాబిచ్చారు.

KTR Apologies To Womens: మహిళలకు క్షమాపణ చెప్పిన కేటీఆర్, అక్కాచెల్లెళ్లను కించ పరిచే ఉద్దేశం లేదని కామెంట్

Arun Charagonda

తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్..తన వ్యాఖ్యలతో మహిళలు బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అన్నారు.

Advertisement

Snake Stuck in Beer Can: వీడియో..బీర్ టిన్‌లో ఇరుక్కున్న పాము తల, మూడు గంటల పాటు నరకయాతన, చివరకు!

Arun Charagonda

ప్లాస్టిక్ వస్తువులే కాదు.. మందు బాటిళ్లు కూడా మూగ జీవాల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి. బీర్‌ టిన్‌లో తల ఇరుక్కొని.. మూడు గంటల పాటు నరకయాతన పడిందో పాము. చివరకు ముళ్ల పొదల్లోకి వెళ్తుండగా టిన్ ఊడటంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో ఈ ఘటన జరిగింది.

Israel-Palestine Conflict: గాజాలో మృత్యుఘోష, 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని తెలిపిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇంకా ఆగని వార్

Hazarath Reddy

గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని భూభాగ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో 92,401 మంది గాయపడ్డారు.

EOS-08 Earth Observation Satellite: విజయవంతంగా కక్ష్యలోకి ఈవోఎస్‌-08 ఉపగ్రహం, ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి..

Hazarath Reddy

ఇస్రో (ISRO) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట (Sriharikota) షార్(Shar) నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను‌ (SSLV-D3 Rocket ) నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.

Assembly Elections 2024 Schedule: మళ్ళీ మోగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల నగారా, జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే, నేడే షెడ్యూల్ ప్రకటన

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) నేడు షెడ్యూల్‌ విడుదల కానుంది.మధ్యాహ్నం 3 గంటలకు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌(ఈసీ) మీడియా సమావేశంలో ప్రకటించనుంది.

Advertisement

Dalit Woman Torture Case: దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ కేసు, షాద్‌నగర్‌ పోలీసులపై కేసు నమోదు, ఇప్పటికే డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లు సస్పెండ్

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో షాద్ నగర్ ఇన్‌స్పెక్టర్‌ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై కేసులు నమోదయ్యాయి

Uttarakhand Nurse : నిన్న కోల్ కతా - నేడు ఉత్తరాఖండ్, నర్సుపై అత్యాచారం- హత్య, 9 రోజుల తర్వాత బాడీ గుర్తింపు,దారుణ సంఘటన

Arun Charagonda

దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాలు మాత్రం ఆగడం లేదు. ఎంతదారుణానికైన తెగబడేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే జూనియర్ డాక్టర్ హత్యాచారంతో కోల్ కతా అట్టుడికిపోతుండగా దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది.

Uttar Pradesh Horror: యూపీలో దారుణం, భార్య లేదని తాగిన మత్తులో కన్న కూతురుపై అత్యాచారం

Hazarath Reddy

యూపీలోని అమేథీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ మరిచిన ఓ తండ్రి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఈ నెల 8 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Harishrao : హైదరాబాద్‌లో హరీశ్ రావుపై ఫ్లెక్సీల కలకలం, దమ్ముంటే రాజీనామా చెయ్- అగ్గిపెట్ట హరీశ్ రావు అంటూ మైనంపల్లి అభిమానుల పేరిట ఫ్లెక్సీల ఏర్పాటు, వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement