రాజకీయాలు

Atishi Sworn In As Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణస్వీకారం, కేబినెట్‌లోకి ఐదుగురు మంత్రులు

Arun Charagonda

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అతిశీతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులుగా గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేశ్ అహ్లావత్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తదితరులు హాజరయ్యారు.

Seeman On Tirupati Laddu: తిరుపతి లడ్డూ సమస్య తప్ప మరేమి లేదా?,కల్తీ లడ్డూతో ఎవరన్న చనిపోయారా అని ప్రశ్నించిన ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్

Arun Charagonda

దేశ వ్యాప్తంగా సంచనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారంపై స్పందించారు ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్. లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు అని హితవు పలికారు.

Delhi CM Atishi: నేటి సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఢిల్లీ సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న ఆతిశీ.. హస్తినకు యంగెస్ట్ సీఎంగా రికార్డు

Rudra

ఆప్ నేత ఆతిశీ ఢిల్లీ ఎనిమిదో సీఎంగా శ‌నివారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సెనా.. ఆతిశీ చేత ప్ర‌మాణం చేయించ‌నున్నారు.

Tirupati Laddu Row: తిరుపతి లడ్డు నెయ్యి సరఫరా కోసం కొత్త కాంట్రాక్టర్‌తో టెండర్‌ ఖరారు, ఏఆర్‌ డెయిరీ నెయ్యి వాడడం ఆపేశామని తెలిపిన టీటీడీ ఈవో శ్యామలరావు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం చర్చనీయాంశమైంది. ఏఆర్‌ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం(సెప్టెంబర్‌20) తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేవంలో ఈవో మాట్లాడారు

Advertisement

Jagan on Tirupati Laddu Dispute: మన తిరుమలను మనమే తక్కువ చేసుకుంటున్నాం, లడ్డూ వ్యవహారంపై స్పందించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కొవ్వు ఉందనేది ఒక కట్టు కథ అని కొట్టిపారేశారు.

T. Subbarami Reddy: చాలా రోజుల తరువాత మీడియా ముందుకు, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుబ్బరామిరెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

PM Vishwakarma Programme: వీడియో ఇదిగో, యూపీఐ యాప్ ఉపయోగించి జగన్నాథుని విగ్రహాన్ని కొనుగోలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

వార్ధాలో జరిగిన జాతీయ "PM విశ్వకర్మ" కార్యక్రమ ప్రదర్శనలో PM నరేంద్ర మోడీ జగన్నాథుని విగ్రహాన్ని కొనుగోలు చేసినట్లు చూపిస్తుంది. వైరల్ క్లిప్ కూడా భారత ప్రధాని UPI యాప్‌ని ఉపయోగించి జగన్నాథుని విగ్రహానికి డబ్బును డిజిటల్‌గా చెల్లిస్తున్నట్లు చూపిస్తుంది.

'Attack on Sanatana Dharma': ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, తిరుపతి లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుమలలో లడ్డూ (Tirupati Laddoos) వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.తాజాగా ఈ లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ (Chief Priest of Ram Janmabhoomi) ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ స్పందించారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు.

Advertisement

Vijaysai Reddy on Chandrababu: ఆంధ్ర రాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలి, నారాయణ అంటూ చంద్రబాబుపై సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Hazarath Reddy

40 ఏళ్ళ ఇండస్ట్రీగా స్వీయప్రకటన చేసుకున్న, పాలన తెలియని పామరుడు పదే పదే అధికారాన్ని చేజిక్కించుకోవటం వెనక వున్న మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి!. ఆంధ్ర రాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలి. నారాయణ , నారాయణ.. నారాయణ’ అంటూ కామెంట్స్‌ చేశారు.

VHP on Tirupati Laddu Dispute: చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్, వ్యాఖ్యలకు కట్టుబడి ఆ ఆరోపణలను నిరూపణ చేయాలని డిమాండ్

Hazarath Reddy

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది మరియు గత హయాంలో జంతు కొవ్వును దాని తయారీలో ఉపయోగించినట్లు వచ్చిన నివేదికలపై హిందువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు.

Tirupati Laddu Controversy: దేవుడితో పెట్టుకుంటే ఎవరూ బతకలేరు, చంద్రబాబుపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌

Hazarath Reddy

లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మండిపడ్డారు. సీఎం హోదాలో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా అంటూ నిలదీశారు.

Pawan Kalyan on Tirupati Laddu Row: బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం.. తిరుమ‌ల ల‌డ్దూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. 'సనాతన ధర్మ రక్షణ బోర్డు' ఏర్పాటుకు డిమాండ్‌

Rudra

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌ల‌పారన్న వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

Advertisement

One Nation One Election: ఏమిటీ ఈ జమిలి ఎన్నికలు, దేశంలో ఇంతకుముందు జరిగాయా ? ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం ఇదిగో..

Hazarath Reddy

ఈ ఎన్నికలు జరుగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్‌ కమిటీ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356, ఆర్టికల్‌ 324, ఆర్టికల్‌ 83(2), ఆర్టికల్‌ 172(1), ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమవుతాయి.

Tirupati Laddu Controversy: తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం, ఆధారాలు ఇవిగో అంటూ బయటపెట్టిన టీడీపీ, ఖండించిన వైసీపీ

Hazarath Reddy

ఈ దేశంలోనే నెం.1 డెయిరీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు అని, గుజ‌రాత్ కు శాంపిల్స్ పంప‌గా… వ‌చ్చిన రిపోర్ట్ ఇదిగో అంటూ టీడీపీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మీడియాకు చూపించారు.

YS Sharmila on Tirupati Laddu: తిరుపతి లడ్డు వివాదం, చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన వైఎస్ షర్మిల, రాజకీయ కోణం లేకుంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్

Hazarath Reddy

తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయ‌ని ఆమె మండిప‌డ్డారు. సీఎం హోదాలో చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వ‌రుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయ‌ని తెలిపారు.

Tirupati Laddu Controversy: శ్రీవారి ప్రసాదంపై విష ప్రచారం చేస్తే ఆ స్వామివారే శిక్షిస్తారు, చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడిన టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి

Hazarath Reddy

తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ఖండించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలు గురించి విష ప్రచారం చేస్తే స్వామి వారే వారికి శిక్ష విధిస్తారు అంటూ కామెంట్స్‌ చేశారు.

Advertisement

Tirupati Laddu Controversy: భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి మేము రెడీ, నువ్వు రెడీనా చంద్రబాబు, తిరుమల లడ్డు వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి సవాల్

Hazarath Reddy

తిరుమల శ్రీవేంకటేశ్వరసామి లడ్డూ ప్రసాదంలో గత ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిపిందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం (Tirupati Laddu Controversy) రేపుతున్నాయి.

Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం, టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన, భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేద్దామంటూ సీఎం చంద్రబాబుకు వైసీపీ సవాల్

Hazarath Reddy

చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తోసిపుచ్చారు. తిరుమల పవిత్రతను, కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెద్ద పాపమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని (YSR Congress denies CM Remarks) అన్నారు.

India's Richest and Poorest States: దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా తెలంగాణ, పేద రాష్ట్రంగా బీహార్, భార‌త్‌లో ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితా పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

భార‌త్‌లోని ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితాను బుధ‌వారం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) విడుద‌ల చేసింది. రాష్ట్రాల త‌ల‌స‌రి ఆదాయం ప్రామాణికంగా తీసుకుని ఈ జాబితాను (India's Richest and Poorest States) రూపొందించింది.

BJP MLA Munirathna: ఆ బీజేపీ ఎమ్మెల్యే నన్ను గోడౌన్‌కి తీసుకెళ్లి రేప్ చేశాడు, కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నపై మహిళ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు మరో ఆరుగురిపై అత్యాచారం, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ ఘటన జరిగిందని 40 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు

Advertisement
Advertisement