Politics

AP Cabinet Ministers List: సీఎంగా బాబు.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. ఏపీలో కొలువుదీరనున్న 24 మంది మంత్రుల జాబితా విడుదల.. మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే.. జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు

Rudra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఉదయం 11.47 నిమిషాలకు ప్రమాణం చేసి పగ్గాలు చేపట్టనున్నారు.

Chandrababu Swearing in Ceremony: ఏపీ సీఎంగా చంద్రబాబు.. ఉదయం 11.27 గంటలకు సీఎంగా నాలుగోసారి ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత.. వేదికపై 60 మంది కూర్చునేలా ఏర్పాట్లు సిద్ధం

Rudra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 గంటలకు కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక సాక్షిగా సీఎంగా నాలుగవ సారి ఆయన ప్రమాణం చేయనున్నారు.

Aditya Thackeray: వీడియో ఇదిగో, బీజేపీ చేతుల్లో పడ్డారు మీ పని అస్సామే ఇక, టీడీపీ, జేడీయూలకు ఆదిత్య ఠాక్రే హెచ్చరిక, స్పీకర్ పోస్ట్ డిమాండ్ చేయాలని సూచన

Hazarath Reddy

టీడీపీ, జేడీ(యూ) భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలని శివసేన (యూబీటీ) వర్గం నేత ఆదిత్య ఠాక్రే హెచ్చరించారు. ‘టీడీపీ, జేడీ(యూ) పార్టీలు.. తమ పార్టీను రక్షించుకోవాలి. అందుకోసం బీజేపీ నుంచి లోక్‌సభ స్పీకర్‌ పదవి డిమాండ్‌ చేసి తీసుకోండి. లేదంటే త్వరలోనే మీ పార్టీలను బీజేపీ చీల్చివేస్తుంది’ అని ఆదిత్య ఠాక్రే ‘ఎక్స్‌​’ వేదికగా అన్నారు.

Andhra Pradesh: ఏపీలో టీవీ9, ఎన్‌ టీవీ, 10 టీవీ, సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత, ట్రాయ్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ

Hazarath Reddy

ఏపీలో టీవీ9, ఎన్‌ టీవీ, 10 టీవీ, సాక్షి టీవీలను అక్రమంగా ప్రసారాలు నిలిపివేయడంపై వైసీపీ పార్టీ ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. ఏపీలో సాక్షి టీవీతో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతపై ట్రాయ్‌కి వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

Advertisement

Judicial Commission Sent Notice to KCR: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు, కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్

Hazarath Reddy

2014 నుంచి 2023 వరకు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Rakshana Nidhi Slams Jagan: వీడియో ఇదిగో, జగన్‌..నీవల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయింది, అధినేతపై విరుచుకుపడిన తిరువూరు వైసీపీ మాజీ ఎమ్యెల్యే రక్షణ నిధి

Hazarath Reddy

మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణ పరాజయం పాలవ్వడంతో నేతలంతా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా తిరువూరు వైసీపీ మాజీ ఎమ్యెల్యే రక్షణ నిధి జగన్ మీద ఫైర్ అయ్యారు. జగన్ నీవల్లే వైస్సార్సీపీ ఓడిపోయింది, జగన్ ప్రజలకు చేసిందేమీ లేదు..

Chandrababu Swearing-in Ceremony: రేపు 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, విజయవాడ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు, 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. కేసరపల్లిలోని ఐటీటవర్‌ వద్ద బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు

Hapur Toll Plaza Viral Video: వీడియో ఇదిగో, టోల్ ఫీజు అడిగారని జేసీబీతో టోల్ గేట్‌నే లేపేసిన డ్రైవర్, యూపీలో ఘటన

Hazarath Reddy

టోల్ ట్యాక్స్ డిమాండ్ చేయడంతో ఆగ్రహం చెందిన జేసీబీ డ్రైవర్, ఆపై బుల్డోజర్‌తో టోల్ ప్లాజాను ధ్వంసం చేశాడు. యూపీలోని హాపూర్ లో ఢిల్లీ - లక్నో నేషనల్ హైవేపై ఉన్న టోల్ ప్లాజా వద్ద JCB డ్రైవర్ నుండి టోల్ ప్లాజా సిబ్బంది టాక్స్ డిమాండ్ చేశారు.

Advertisement

Amit Shah Takes Charges as HM: వీడియో ఇదిగో, రెండోసారి కేంద్ర హోమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, ఆరోగ్య శాఖా మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు

Hazarath Reddy

కేంద్ర హోం శాఖ మంత్రి (Union Home Minister) గా అమిత్‌ షా (Amit Shah) వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రిగా ( Minister of Health and Family Welfare) జేపీ నడ్డా (JP Nadda) బాధ్యతలు స్వీకరించారు. నడ్డాతోపాటు అనుప్రియా పటేల్‌, జాదవ్‌ ప్రతాప్రావు గణ్‌పత్‌రావ్‌ కూడా సహాయ మంత్రులు బాధ్యతలు చేపట్టారు.

Chandrababu: టీడీపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు, సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నేతగా చంద్రబాబును ఎన్నుకుంది టీడీపీ పార్టీ. నేడు జరిగిన ఎన్టీయే పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు చంద్రబాబు పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీంగా ఆమోదం తెలిపారు

Andhra Pradesh Capital Row: మూడు రాజధానులకి పుల్‌స్టాప్ పెట్టిన చంద్రబాబు, ఏపీ రాజధానిగా అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం

Hazarath Reddy

ఏపీ రాజధానిపై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖపట్నంను ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు.

Modi Cabinet 2024: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు, మిగతా ఇద్దరు ఏపీ మంత్రులకు శాఖలు ఏవంటే..

Hazarath Reddy

ఏపీ నుంచి నుంచి రామ్మోహన్‌ నాయుడికి పౌరవిమానయాన బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ (సహాయ), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ) కేటాయించారు.

Advertisement

Modi Cabinet 2024: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్, బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి

Hazarath Reddy

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొలువు తీరిన మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు ర‌క్ష‌ణ శాఖ‌, అమిత్ షాకు హోంశాఖ‌, జైశంక‌ర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. బండి సంజయ్‌ కుమార్‌ హోంశాఖ (సహాయ) మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు.

Modi Cabinet Portfolios Allocated: మళ్లీ హోం మంత్రి అమిత్ షానే, కేంద్ర మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు లిస్టు ఇదిగో, తెలుగు రాష్ట్రాల మంత్రులకు ఏయే శాఖలంటే..

Hazarath Reddy

ధాని న‌రేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొలువు తీరిన మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు ర‌క్ష‌ణ శాఖ‌, అమిత్ షాకు హోంశాఖ‌, జైశంక‌ర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు. ఇక బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీకి మరోసారి రోడ్లు, రవాణా శాఖ కేటాయించారు

Suresh Gopi To Quit Modi Cabinet? కేంద్ర క్యాబినెట్‌కు బీజేపీ ఎంపీ సురేష్ గోపీ రాజీనామా వార్తలు, క్లారిటీ ఇచ్చిన సినీ నటుడు

Hazarath Reddy

కేంద్ర క్యాబినెట్‌లో కొనసాగడంపై ఆసక్తి లేదంటూ తనపై వచ్చిన ఆరోపణలపై బీజేపీ (BJP) ఎంపీ సురేశ్‌ గోపి (Suresh Gopi) స్పందించారు. అదంతా తప్పుడు సమాచారమని కొట్టిపారేసిన ఆయన.. క్యాబినెట్‌ నుంచి వైదొలిగే ఉద్దేశం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు.

Nallagatla Swamidas: వీడియో ఇదిగో, ఐ ప్యాక్ వల్లే మాకు ఘోర పరాజయం, తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఐపాక్‌ సంస్థ వల్ల నష్టం జరిగిందన్నారు.

Advertisement

TDP Leader Murder: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరి దారుణ హత్య, వేటకొడవళ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. బొమ్మిర్రెడ్డిపల్లె గ్రామంలో గౌరీనాథ్ చౌదరిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడికి పాల్పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు బలగాలను మోహరించారు.

MLA Raghurama Krishnam Raju: పోలీసు కస్టడీలో నన్ను చిత్రహింసలకు గురి చేశారు, జగన్ మీద హత్యాయత్నం కేసు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు

Hazarath Reddy

ఏపీ మాజీ సీఎం జగన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై గుంటూరు పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.

Kesineni Nani Quits Politics: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, సంచలన ప్రకటన చేసిన కేశినేని నాని

Hazarath Reddy

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి సొంత తమ్ముడి కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచించిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాననని వెల్లడించారు.

Mega DSC in Telangana: డీఎస్సీ ద్వారా త్వరలో టీచర్ పోస్టులు భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ బడి విలువేంటో నాకు తెలుసని వెల్లడి

Hazarath Reddy

డీఎస్సీ ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement
Advertisement