Viral

Viral Video: వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఇంటిపైకి ఎక్కిన స్కూటీ, ఇద్దరు అమ్మాయిలు అరుపులు కేకలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఇండోనేషియాకు చెందిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి స్కూటర్‌పై మరో యువతిని ఎక్కించుకుని వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఏకంగా ఓ ఇంటిపైకి ఎక్కేసింది.అది పెంకుటిల్లు కావడంతో పెంకులు చెల్లాచెదురై స్కూటర్, ఇద్దరమ్మాయిలు అక్కడ ఇరుక్కుపోయారు.

Entire 140 cr Indians are Hindu: దేశంలోని 140 కోట్ల మంది హిందువులే.. ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మన్మోహన్ వైద్య సంచలన వ్యాఖ్యలు

Rudra

దేశంలోని 140 కోట్ల మంది హిందువులేనని ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మన్మోహన్ వైద్య అన్నారు. ప్రస్తుతం దేశంలో నివసిస్తున్న వారి పూర్వీకులు అందరూ హిందువులేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Group-1 Deadline Extended: తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

Rudra

గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది.

Free Treatment: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స.. పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించిన కేంద్రం.. ఎక్కడ అంటే?

Rudra

రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకువస్తున్నది. ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నారు.

Advertisement

Case Against BS Yediyurappa: నా కుమార్తెపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.. బాలిక తల్లి ఫిర్యాదుతో కర్ణాటక మాజీ సీఎంపై పోక్సో కేసు నమోదు

Rudra

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు బీఎస్‌ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

Ramadan Iftar Feast: ముస్లిం సోదరులకు నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరుఫున ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం రేవంత్

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు నేడు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మొదటి శుక్రవారం కావడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.

President, PM in Telangana: నేడు తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. 'ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్‌- 2024'లో పాల్గొననున్న రాష్ట్రపతి.. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..

Rudra

నేడు తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ రానున్నారు. నగర శివారులోని కన్హ శాంతి వనంలో నిర్వహించే 'ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్‌- 2024' కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు.

Half Day Schools: నేటి నుంచే ఒంటిపూట బడులు.. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు.. 12.30 గంటల తర్వాత మధ్యాహ్న భోజనం

Rudra

తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు.

Advertisement

HC on Illicit Relationship: భర్తకు విడాకులు ఇవ్వకుండా వేరొకరితో సహజీవనం చెల్లదు, అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

లైవ్-ఇన్ జంట అలహాబాద్ హైకోర్టులో ప్రొటెక్షన్ అప్పీల్‌ను దాఖలు చేశారు, అయితే ఇద్దరూ ఇప్పటికే ఇతర వ్యక్తులను వివాహం చేసుకున్నారు. వారి సంబంధిత వివాహాల నుండి విడాకుల పత్రం లేనందున అది తిరస్కరించబడింది. న్యాయస్థానం ఈ అక్రమ భాగస్వామ్యాలను ఉపేక్షించబోదని, అలా చేస్తే సామాజిక వ్యవస్థకు భంగం వాటిల్లుతుందని జస్టిస్ రేణు అగర్వాల్ ధర్మాసనం హెచ్చరించింది.

Ranji Trophy: 42వ సారి రంజీ ట్రోఫీని ఎగరేసుకుపోయిన ముంబై, విదర్భపై 169 పరుగుల తేడాతో ఘన విజయం

Hazarath Reddy

గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఐదో రోజు విదర్భపై 169 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఐదో రోజు విదర్భపై 169 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది .

Unnatural Sex With Minor Boy: పదేళ్ల బాలుడితో ఉపాధ్యాయుడు అసహజ సెక్స్, జీవిత ఖైదు విధించిన కోటా ప్రత్యేక కోర్టు

Hazarath Reddy

మసీదులో పిల్లలకు అరబిక్ భాష నేర్పిన వ్యక్తి.. పదేళ్ల బాలుడితో అసహజ సెక్స్‌కు పాల్పడినందుకు రాజస్థాన్‌లోని కోటాలో ప్రత్యేక కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది.పబ్లిక్ ప్రాసిక్యూటర్ లలిత్ కుమార్ శర్మ ప్రకారం, హర్యానాలోని పల్వాల్ జిల్లాకు చెందిన నసీమ్ ఖాన్ (23) అనే దోషికి కోర్టు రూ.21,000 జరిమానా విధించింది.

18 OTT Platforms Blocked: అసభ్యకర కంటెంట్ అందించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన కేంద్రం, 57 సోషల్ మీడియా ఖాతాలు కూడా బ్యాన్

Hazarath Reddy

19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు (Google Play Storeలో 7, Apple యాప్ స్టోర్‌లో 3), ఈ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించబడిన 57 సోషల్ మీడియా ఖాతాలు భారతదేశంలో పబ్లిక్ యాక్సెస్ కోసం నిలిపివేయబడ్డాయి.

Advertisement

Accident Caught on Camera: రద్దీ మార్కెట్లో ఘోర రోడ్డు ప్రమాదం, పుల్లుగా మందు తాగి జనాల మీదకు కారును నడిపిన డ్రైవర్, ఒకరు మృతి, ఆరుమందికి గాయాలు

Hazarath Reddy

దేశ రాధాని ఢిల్లీలోని ఘాజీపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్‌‌(Taxi Driver) తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏండ్ల మహిళ మరణించగా, మరో ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు.

Paytm layoffs: పేటీఎంలో మొదలైన ఉద్యోగాల కోతలు, 20 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న వన్ 97 కమ్యూనికేషన్స్

Hazarath Reddy

Paytm మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా డిపార్ట్‌మెంట్‌ల వారీగా శ్రామిక శక్తిని తగ్గించడానికి సిద్ధంగా ఉందని మనీకంట్రోల్ నివేదించింది.

Geethanjali Suicide Case: గీతాంజలి కేసులో తొలి అరెస్ట్‌, పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగతా వారి కోసం వెతుకులాట

Hazarath Reddy

సోషల్‌ మీడియా ట్రోలింగ్‌తో బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో తొలి అరెస్ట్‌ జరిగింది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడు అంటూ వార్తలు వస్తున్నాయి.

MP Antony on Pulwama Attack: పుల్వామా దాడి పేరు చెప్పుకుని బీజేపీ అప్పుడు అధికారంలోకి వస్తే.. ఇప్పుడు సీఏఏతో రావాలని చూస్తోంది, కాంగ్రెస్ ఎంపీ ఆంటోని సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

2019 లోక్‌సభ ఎన్నికల్లో పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల త్యాగాలను ఉపయోగించుకోవడం ద్వారా కాషాయ పార్టీ విజయం సాధించిందని కాంగ్రెస్ ఎంపి ఆంటో ఆంటోనీ బిజెపిపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో బుధవారం కేరళలో వివాదం చెలరేగింది

Advertisement

News18 Mega Opinion Poll: మళ్లీ మోదీకే పట్టం కట్టనున్న ఓటర్లు, న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైన సంచలన విషయాలు ఇవిగో..

Hazarath Reddy

న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వేలో ఓటర్లు మళ్లీ బీజేపీకే పట్టం కట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఓటు వేస్తామని దేశంలో 85 శాతం మంది అభిప్రాయపడినట్లు ఈ సర్వేలో వెల్లడయింది.

418 Kidney Stones Removed From Patient: 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి 418 రాళ్లను తొలగించిన వైద్యులు, శరీరంపై కోత పెట్టకుండా కొద్దిపాటి శస్త్రచికిత్సతో రాళ్లను తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు

Hazarath Reddy

60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి ఏకంగా 418 రాళ్లను వైద్యులు తీసేశారు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అత్యాధునిక పరికరాలతో కొద్దిపాటి శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా ఈ రాళ్లను తొలగించారు.

Suicide Caught on Camera: కరెంట్ తీగలు పట్టుకుని సూసైడ్ చేసుకున్న యువకుడు, షాకింగ్ లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

షాకింగ్ సంఘటనలో, మార్చి 12, సోమవారం హర్యానాలోని అంబాలా కాంట్ రైల్వే స్టేషన్‌లో ఓవర్‌హెడ్ వైర్ స్తంభం ఎక్కి ఒక యువకుడు మరణించాడు. ఓవర్‌హెడ్ కేబుల్‌ తాకడంతో యువకుడు మంటల్లో కాలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

Rameshwaram Cafe Blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ బాస్ట్‌ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్, ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ బాస్ట్‌ కేసులో ప్రధాన నిందితుడిని కలిసి వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకున్నది. పేలుడు ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ.. బళ్లారి పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడితో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు

Advertisement
Advertisement