భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇండోర్లో రెండో మ్యాచ్ జరుగుతోంది. పాట్ కమిన్స్ స్థానంలో ఆస్ట్రేలియాకు కెప్టెన్గా వచ్చిన స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ పేలుడు సెంచరీలతో జట్టు భారీ స్కోరుకు పునాది వేశారు. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 5 వికెట్లకు 399 పరుగులు చేసింది. తొలి వన్డేలో విజయం సాధించి సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే సిరీస్ని కూడా కైవసం చేసుకుంటుంది. శుభమన్ గిల్ 104, శ్రేయాస్ అయ్యర్ 105, కేఎల్ రాహుల్ 52 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. 72 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 6 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ బాదిన సిక్సర్ స్టేడియం బయటపడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

6⃣6⃣6⃣6⃣
The crowd here in Indore has been treated with Signature SKY brilliance! 💥💥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN
— BCCI (@BCCI) September 24, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)