Maha Kumbh Mela 2025: 40 కోట్ల మంది అనుకుంటే 50 కోట్లు దాటిపోయారు, కుంభమేళాలో 53 కోట్ల మంది పుణ్య స్నానాలు, రికార్డు స్థాయిలో పోటెత్తుతున్న భక్తులు
త్రివేణి సంగమంలో ఇప్పటి వరకూ 53 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది.
ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. కోట్లాదిగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళా ప్రారంభమైన గత నెల 13వ తేదీ నుంచి ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో భక్తులు ప్రయాగ్రాజ్ను సందర్శించినట్లు అధికారులు వెల్లండించారు.
త్రివేణి సంగమంలో ఇప్పటి వరకూ 53 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది. కాగా, జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా... ఈ నెల 26 వరకు కొనసాగనుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు.
Maha Kumbh Mela 2025
#WATCH | Prayagraj, UP | Devotees continue to arrive at #MahaKumbh2025 to take a holy dip at Triveni Sangam
Over 52 crore devotees have taken a holy dip so far at the world's largest human gathering, #MahaKumbh2025. pic.twitter.com/R4i1wfayE4
— ANI (@ANI) February 17, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 17, 2025 03:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

