MP Awadhesh Prasad: రామ్..సీతా మీరెక్కడా?...కన్నీరు పెట్టిన ఎంపీ అవధేష్ ప్రసాద్, దళిత మహిళపై అత్యాచారం కేసులో న్యాయం చేయాలని డిమాండ్

గుక్కపట్టి ఏడ్చారు అయోధ్య ఎంపీ, ఎస్పీ నేత అవధేష్ ప్రసాద్( MP Awadhesh Prasad). రామ్, సీతా మీరెక్కడున్నారు? అంటూ విలేకరుల సమావేశంలో

MP Awadhesh Prasad: రామ్..సీతా మీరెక్కడా?...కన్నీరు పెట్టిన ఎంపీ అవధేష్ ప్రసాద్, దళిత మహిళపై అత్యాచారం కేసులో న్యాయం చేయాలని డిమాండ్
SP MP Awadhesh Prasad cries in tears, asks Ram, Sita, where are you(X)

గుక్కపట్టి ఏడ్చారు అయోధ్య ఎంపీ, ఎస్పీ నేత అవధేష్ ప్రసాద్( MP Awadhesh Prasad). రామ్, సీతా మీరెక్కడున్నారు? అంటూ విలేకరుల సమావేశంలో అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంపీ అవధేష్ ప్రసాద్.

దళిత మహిళపై అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు(Ayodhya MP cries). అయోధ్యకు సమీపంలో అత్యాచారం, హత్యకు గురైన 22 ఏళ్ల దళిత మహిళ కుటుంబానికి న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ముందు లేవనెత్తుతామని ఉద్వేగంతో చెప్పారు. 

ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో అదృశ్యమైన 22 ఏళ్ల దళిత యువత శవం ఓ కాలువలో దొరికింది. ఒంటిపై బట్టలు లేకుండా ఉండగా , శరీరంపై తీవ్రమైన గాయాలు, విరిగిన ఎముకలు ఉన్నాయి. ఆమె చేతులు, కాళ్లు తాళ్లతో కట్టబడి ఉండడగా శవాన్ని తరలించే సమయంలో ఆమె కాలు విరిగిందని గమనించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు, ఇది రాష్ట్ర బడ్జెట్‌ కాదంటూ మండిపాటు

SP MP Awadhesh Prasad cries in tears, asks Ram, Sita, where are you?

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 02, 2025 03:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).