మిస్‌ యూనివర్స్‌ – 2022 పోటీల్లో అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్‌విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. మొత్తం 80 దేశాల అందగత్తెలు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో ఆమె అందర్నీ పక్కకు నెట్టి విశ్వ సుందరిగా నిలిచింది. భారత్‌కు చెందిన పంజాబీ అందగత్తె, మిస్‌ యూనివర్స్‌-2021 హర్నాజ్‌ సంధు.. ఈ పోటీల్లో పాల్గొని బొన్ని గాబ్రియేల్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తొడిగింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై భావోధ్వేగానికి గురైంది.

విశ్వ సుందరి పేరును ప్రకటించేటప్పుడు స్టేజ్‌పైకి వచ్చిన హర్నాజ్‌.. మిస్‌ యూనివర్స్‌ హోదాలో చివరిసారిగా ర్యాంప్‌పై వాక్‌ చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ర్యాంప్‌ వాక్‌ చేస్తూ కిందపడిపోబోయింది. అనంతరం తిరిగి ఆమె వాక్‌ కొనసాగించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. గతేడాది జరిగిన మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో హర్నాజ్‌ సంధూ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో సుమారు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రతిష్ఠాత్మక విశ్వసుందరి కిరీటం దక్కినట్లైంది. సుస్మితా సేన్‌ (1994), లారా దత్తా (2000)ల తర్వాత ఈ ఘనత సాధించిన బ్యూటీక్వీన్‌గా హర్నాజ్‌ గుర్తింపు పొందింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)