క్రీడలు

T20 World Cup 2022: ఐసీసీ వరల్డ్‌కప్‌ టోర్నీల్లో యూఏఈ తొలి విజయం, నమీబియాపై ఏడు పరుగుల తేడాతో విక్టరీ, సూపర్‌ 12 రౌండ్‌లోకి నెదర్లాండ్స్‌

Hazarath Reddy

నేడు జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ గ్రూప్‌ ఏలో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై యూఏఈ ఏడు పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. నమీబియా ఓడిపోవడంతో.. గ్రూప్‌ ఏ నుంచి శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్‌ సూపర్‌ 12 రౌండ్‌లోకి ప్రవేశించింది.

T20 World Cup 2022: సెమీస్‌కు వెళ్లే నాలుగు జట్లు ఇవే, భారత్ ప్రపంచకప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన సచిన్‌ టెండూల్కర్‌, జస్ప్రీత్‌ బుమ్రా లేకపోవడం పెద్ద లోటేనని వెల్లడి

Hazarath Reddy

ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ సమరం ఆరంభమైంది. గ్రూప్‌స్టేజ్‌ మ్యాచ్‌లు నేటి తో పూర్తికానుండగా.. ఈ నెల 22 నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు (T20 World Cup 2022)మొదలునున్నాయి.ఇందులో గెలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు వెళ్లనున్నాయి

T20 World Cup 2022: ఘోర పరాభవంతో ప్రపంచకప్ నుండి వైదొలిగిన వెస్టిండీస్‌, పసికూన ఐర్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పూరన్‌ బృందం, సూపర్‌-12కు అర్హత సాధించిన ఐర్లాండ్

Hazarath Reddy

రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌కు టీ20 వరల్డ్‌కప్‌-2022లో ఘోర పరాభవం ఎదురైంది.గ్రూప్‌-బి క్వాలిఫైయర్స్‌లో భాగంగా ఐర్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పూరన్‌ బృందం చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఐర్లాండ్‌ సూపర్‌-12కు అర్హత సాధించింది.

T20 World Cup: క్రికెట్ అభిమానులకు పిడుగులాంటి వార్త.. ఎల్లుండి మెల్బోర్న్ వేదికగా జరుగనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు వాన గండం.. వర్షసూచన వెలువరించిన ఆస్ట్రేలియా వాతావరణ శాఖ

Jai K

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. వరల్డ్ కప్ సూపర్-12 దశలో భారత్, పాకిస్థాన్ జట్లు ఈ నెల 23న ఆడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కు మెల్బోర్న్ ఆతిథ్యమిస్తోంది. అయితే అభిమానులకు నిరాశ కలిగించేలా ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వర్షసూచన చేసింది.

Advertisement

Asia Cup 2023: భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లే ప్రసక్తే లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ కార్యదర్శి జై షా

Hazarath Reddy

పాకిస్తాన్‌ వేదికగా వచ్చే ఏడాది (2023) సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌ వన్డే టోర్నీలో (2023 Asia Cup) భారత్‌ పాల్గొనేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా 2023 ఆసియా కప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఉన్న పాకిస్థాన్‌కు భారత్ వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి.

Asia Cup 2023: భారత జట్టు పాకిస్తాన్ వెళ్లేది లేనిది నిర్ణయించేది బీసీసీఐ కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపిన కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ

Hazarath Reddy

జై షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బిన్నీ ఓ ప్రకటన విడుదల చేశాడు.2023 ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లాలా వద్దా అనే దానిపై బీసీసీఐ తనంతట తానుగా కాల్ తీసుకోలేదని, అలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వంపై ఆధారపడుతుందని బోర్డు కొత్త అధ్యక్షుడు రోజరీ బిన్నీ గురువారం చెప్పారు.

T20 World Cup 2022: పొట్టలు వేలాడేసుకుని గ్రౌండ్‌లో ఎలా పరిగెడతారు, పాకిస్తాన్ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కోచ్‌ మిస్బా ఉ​ల్‌ హక్

Hazarath Reddy

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, మాజీ కోచ్‌ మిస్బా ఉ​ల్‌ హక్‌ (Misbah-Ul-Haq) తమ జట్టును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మా ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌పై పట్టింపు లేదని.. గ్రౌండ్‌లో పొట్టలు వేలాడటం అందరికీ కనిపిస్తోందంటూ దారుణంగా విమర్శలు గుప్పించాడు.

New BCCI President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు 36వ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న మాజీ క్రికెటర్

Hazarath Reddy

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ నియమితులయ్యారు. సౌరవ్ గంగూలీ తర్వాత బిన్నీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు 36వ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి 67 ఏళ్ల ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.

Advertisement

T20 World Cup: పాకిస్థాన్ ను ఓడిస్తే టీ20 ప్రపంచ కప్ మనదే.. సురేశ్ రైనా వెల్లడి.. టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉందన్న మాజీ బ్యాట్స్ మెన్.. ఈ నెల 23న భారత్, పాక్ ల మధ్య హై ఓల్డేజ్ మ్యాచ్

Jai K

ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఈ నెల 23వ తేదీపైనే ఉంది. ఆరోజు హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా-పాక్ లు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ICC T20 World cup 2022: పాకిస్తాన్ బౌలర్‌కి సలహాలిచ్చిన భారత్ బౌలర్ షమీ, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Hazarath Reddy

నెట్స్ లో బౌలింగ్ సాధన చేస్తున్న టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ వద్దకు పాకిస్థాన్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిదీ వచ్చాడు. దాయాది బౌలర్ ను షమీ ఉత్సాహంగా పలకరించాడు.

T20 World Cup: వైరల్ వీడియోలు, కోహ్లీ ఫీల్డింగ్ చూస్తే ఫిదా కావాల్సిందే, మెరుపువేగంతో త్రో వేసి రనౌట్, బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్

Hazarath Reddy

ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లి స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో హర్షల్‌ పటేల్‌ వేసిన రెండో బంతిని జోష్‌ ఇంగ్లిస్‌ ఆన్‌సైడ్‌ దిశగా ఆడాడు. అయితే క్విక్‌ సింగిల్‌ కోసం ఇంగ్లిస్‌ ప్రయత్నించడంతో టిమ్‌ డేవిడ్‌ స్పందించాడు.

ICC T20 World Cup 2022: రెండుసార్లు ప్రపంచ కప్ విజేతకు షాకిచ్చిన పసికూన, 42 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించిన స్కాట్లాండ్

Hazarath Reddy

టీ20 ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. నిన్న మాజీ చాంపియన్ శ్రీలంకకు నమీబియా షాకిస్తే.. తాజాగా రెండుసార్లు ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్ ను ఓడించి మరో పసికూన స్కాట్లాండ్ సంచలనం సృష్టించింది.

Advertisement

T20 World Cup 2022: ఆస్ట్రేలియాపై నిప్పులు చెరిగిన మహమ్మద్ షమీ, తొలి వార్మప్ మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

T20 World Cup: క్వాలిఫయర్ మ్యాచ్‌లో పసికూన నమీబియా చేతిలో ఓడిన లంక.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నమీబియా.. తమ పేరు గుర్తుపెట్టుకోమని నమీబియా సందేశమిచ్చిందన్న సచిన్.. ట్వీట్ వైరల్

Jai K

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆసియాకప్ విజేత శ్రీలంకతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో నమీబియా సంచలన విజయం సాధించింది. అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘తన పేరును గుర్తు పెట్టుకోమని నమీబియా క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పింది’ అని సచిన్ ట్వీట్ చేశాడు.

Sourav Ganguly: క్యాబ్ అధ్యక్షుడిగా మళ్లీ గంగూలీ! అనూహ్యంగా రేసులోకిబీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు కొనసాగాలని భావించిన గంగూలీ.. 2015-2019 మధ్య క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేసిన ‘దాదా’.. ఈ నెల 22న క్యాబ్ అధ్యక్ష పదవికి నామినేషన్..

Jai K

బీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు కొనసాగాలని భావించి కుదరకపోవడంతో నిష్క్రమిస్తున్న సౌరవ్ గంగూలీ అనూహ్యంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నాడు.

Womens Asia Cup 2022, India vs Sri Lanka: ఆసియాకప్ 2022 కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు, శ్రీలంకను చిత్తు చేసి ఏడో సారి కప్పు సొంతం చేసుకున్న టీమిండియా

kanha

భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత మహిళల జట్టు విజయం సాధించింది.

Advertisement

Arjun Tendulkar: దేశవాళీ క్రికెట్లో నిప్పులు చెరిగిన సచిన్ తనయుడు.. ముంబయి జట్టు నుంచి గోవాకు మారిన అర్జున్ టెండూల్కర్.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గోవాకు ప్రాతినిధ్యం.. హైదరాబాదు జట్టుతో మ్యాచ్.. 4 ఓవర్లలో 4 వికెట్లు తీసిన వైనం

Jai K

టీమిండియాకు ఆడాలన్న కలను సాకారం చేసుకునేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎడమచేతివాటం పేస్ బౌలర్ అయిన అర్జున్ టెండూల్కర్ దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిప్పులు చెరిగే బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు.

Women IPL: వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్.. టోర్నీపై నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. 5 జట్లతో మహిళల ఐపీఎల్.. విశాఖ, కొచ్చి నగరాలతో సౌత్ జోన్ ఫ్రాంచైజీ!

Jai K

పురుషుల తరహాలోనే మహిళా క్రికెటర్లకు కూడా ఐపీఎల్ నిర్వహించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇన్నాళ్లకు అది సాకారమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది.

T20 World Cup 2022: మహమ్మద్ షమీ కన్నా సిరాజ్ బెటర్, సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్, బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు సిరాజ్ అని వెల్లడి

Hazarath Reddy

అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్ 2022 ఆరంభమవుతున్న సంగతి విదితమే. టీమిండియాలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే.

Team India World Record: టీమిండియా ప్రపంచ రికార్డు, అంతర్జాతీయ వన్డేల్లో చేజింగ్‌లో 300 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కిన భారత్, రెండవ స్థానంలో ఆసీస్

Hazarath Reddy

ప్రపంచంలోని మేటి జట్లలో ఒకటిగా రికార్డులకెక్కిన భారత్ (team india) తాజాగా మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలోవేసుకుంది. క్రికెట్ ప్రపంచంలోనే తొలిసారి అంతర్జాతీయ వన్డేల్లో చేజింగ్‌లో 300 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది

Advertisement
Advertisement