రాష్ట్రీయం

Diwali Victims: దీపావళి పండుగ నాడు అపశ్రుతులు.. హైదరాబాద్ లోని సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు

Rudra

తెలంగాణలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు బాణసంచా కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

Gun Misfire: గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలు.. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘటన (వీడియో)

Rudra

అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘోరం జరిగింది. గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి ఏఆర్ కానిస్టేబుల్ సుబ్బరాజుకు గాయాలయ్యాయి.

AP Formation Day Wishes: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నేడు.. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ ప్రత్యేకమైన కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.

Rudra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగింది.

Blade Attack: బ్లేడ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి.. మహిళలకూ గాయాలు.. ఏపీ తాడేపల్లిలో ఘటన (వీడియో)

Rudra

ఏపీలోని తాడేపల్లి పట్టణం ఉండవల్లి సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నూడుల్స్ బండి వద్ద యువకుల మధ్య పరస్పర వాదనలతో మొదలైన ఓ గొడవ చివరకు బ్లేడ్లతో దాడి చేసుకునే వరకు వచ్చింది.

Advertisement

KCR Re-Entry: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రీ-ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.. మరి గులాబీ దళాధిపతి పురాగమనం ఎప్పుడంటే??

Rudra

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుండగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వల్లే తెలంగాణ వెనక్కు వెళ్లిందని కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ కు దిగింది.

Andhra Pradesh Formation Day 2024 Wishes: ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ Whatsapp, Instagram, Facebook ద్వారా తెలియచేయాలని ఉందా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉచితంగా వాడుకోవచ్చు..

sajaya

పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.

Andhra Pradesh Formation Day 2024 Wishes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..

sajaya

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మీ బంధు మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవచ్చు.

Andhra Pradesh: పెన్షన్ల పంపిణీలో రగడ, దెందులూరులో కొట్టుకున్న టీడీపీ - జనసేన నేతలు...వీడియో ఇదిగో

Arun Charagonda

ఏపీలో కూటమిలోని మిత్రపక్షాల మధ్య రగడ తారాస్థాయికి చేరింది. మరోసారి రెచ్చిపోయి కొట్టుకున్నారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. దీంతో ఏలూరు జిల్లా కొల్లేరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దెందులూరు నియోజకవర్గం హైడిచింతపాడులో పెన్షన్ల పంపిణి విషయంలో తలెత్తిన వివాదం చివరకు టీడీపీ-జనసేన నేతలు కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Prakasam: బీటెక్ విద్యార్థుల అరాచకం, మూడు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న స్టూడెంట్...వైరల్ వీడియో

Arun Charagonda

ప్రకాశం - మార్కాపురం మండలంలోని దరిమడుగు సమీపంలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్ధుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో దరిమడుగు రహదారిపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్లోబల్, ఇందిరా, జార్జి ఇంజీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.

Andhra Pradesh: షాకింగ్ వీడియో, స్కూటీపై క్రాకర్స్ తీసుకెళ్తుండగా పేలుడు..ఒకరు మృతి...సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో

Arun Charagonda

బాణాసంచా పేలి మహిళ మృతి చెందిన సంఘటన ఏలూరులో చోటు చేసుకుంది. తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద ఉల్లిపాయలు బాంబు తీసుకెళుతుండగా బండి గోతిలో పడి పేలిపోయాయి బాంబులు. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరి కొందరికి గాయాలయ్యాయి.

Karimnagar: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తప్పిన ప్రమాదం, ఇందిరాగాంధీకి నివాళి అర్పిస్తూ గద్దె కూలడంతో కిందపడ్డ ఎమ్మెల్యే...వీడియో

Arun Charagonda

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్ - ఇంధిరా చౌక్ వద్ద ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ పూలమాల వేసే క్రమంలో విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలడంతో ఒకసారిగా కిందపడ్డారు మేడిపల్లి సత్యం. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.

Cyberabad Police: దీపావళి సైబరాబాద్ పోలీసుల కీలక సూచన, రాత్రి 8 నుండి 10 వరకు బాణాసంచా పేల్చడానికి అనుమతి , పబ్లిక్ రోడ్లు & బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధం అని వెల్లడి

Arun Charagonda

దీపావళి సందర్భంగా సైబరాబాద్ పోలీసులు కీలక సూచన చేశారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా పేల్చడానికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 02 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు & బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని తేల్చిచెప్పారు. .

Advertisement

MP Kiran Kumar Reddy: ఫోర్త్ సిటీపై విష ప్రచారం సరికాదు, తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

Arun Charagonda

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొన్ని పత్రికల్లో నిరాధారమైన కథనాలు రాస్తున్నారు అన్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్, పాకిస్థాన్‌లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ వీడియో సందేశం, ఓ చిన్నారి పాటను షేర్‌ చేసిన పవన్‌

Arun Charagonda

దీపావళి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్ చేశారు. ఓ చిన్నారి పాడిన పాటను షేర్ చేస్తూ దేశ విభజనకు సంబంధించి సంచలన ట్వీట్ చేశారు. పాకిస్థాన్ కు చెందిన హిందూ పిల్లల ఈ పాట విభజన యొక్క లోతైన బాధను ప్రతిబింబిస్తుంది. భారత్ తో మళ్లీ కలవాలని కోరుకునే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు అని తెలిపారు పవన్.

Warangal: ఎస్‌ఐ వేధింపులతో పోలీస్ స్టేషన్‌లోనే యువకుడి ఆత్మహత్యయత్నం, ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్, వెంటనే అప్రమత్తమైన పోలీసులు..ఆస్పత్రికి తరలింపు, వీడియో

Arun Charagonda

ఎస్ఐ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు ఓ చిరు వ్యాపారి. వరంగల్‌లోని మట్టేవాడ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఆటోనగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారి శ్రీధర్‌ను గత నెల రోజుల నుండి ఎస్ఐ విఠల్ వేధిస్తున్నాడంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యయత్నం చేశాడు.

RS Praveen Kumar: మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ, విలువైన పత్రాలు మాయం...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని కోసినిలో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.

Advertisement

CM Revanth Reddy: సిరిసిల్ల కళాకారుడి అద్భుతం, వాటర్ మిలన్‌పై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు. గంభీరావుపేటకు చెందిన సంతోష్ అనే కళాకారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానంతో వాటర్ మిలన్ పై రేవంత్ చిత్రాన్ని తీర్చిదిద్ది అందరినీ అబ్బుర పరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

BJP MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం, లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు, అందరం ప్రతిజ్ఞ చేయాలని వీడియో రిలీజ్

Arun Charagonda

దీపావళి వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు అన్నారు. అలాగే దేవుళ్ల బొమ్మ ఉన్న టపాసులను కొనుగోలు చేయవద్దని తద్వారా వచ్చే దీపావళికి అయినా అలాంటి టపాసులు మార్కెట్‌లోకి రావన్నారు. ఇందుకు అందరూ ప్రతిజ్ఞ చేసి కలిసి రావాలని కోరారు రాజాసింగ్.

Vijayasai Reddy: చంద్రబాబుకు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు, ప్రాజెక్టు ఎత్తును తగ్గించి ద్రోహం చేస్తున్న చంద్రబాబు అని మండిపడ్డ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Arun Charagonda

పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన..అధికారంలోకి రావడం ఆలస్యం-పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అని మండిపడ్డారు.

TTD Chairman BR Naidu: టీటీడీలో సమూల మార్పులు తీసుకొస్తాం, సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తామన్న ఛైర్మన్ బీఆర్ నాయుడు, శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కడం నా అదృష్టం అని వెల్లడి

Arun Charagonda

టీటీడీలో సమూల మార్పులు తీసుకొస్తామని తెలిపారు నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా నియమితులైన తర్వాత మాట్లాడిన నాయుడు...గత పాలకవర్గంతో పోలిస్తే తాము బాగా పని చేసి ప్రజలు, భక్తుల మన్ననలు పొందుతామని తెలిపారు. తాను చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగానని శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. టీటీడీలో ఏ చిన్న సమస్య వచ్చినా సత్వరమే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని వెల్లడించారు.

Advertisement
Advertisement