రాష్ట్రీయం
Beer Sale: ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లతో చిల్ అవుతున్నారు.. 18 రోజుల్లో 23 లక్షల కేస్ లు విక్రయం.. రూ.670 కోట్ల ఆదాయం
Rudraఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లతో చిల్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు.. అసలే ఎండలు, వరుసగా కలిసివచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్‌ వెరసి ఈ నెలలో తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి.
Surya Thilak on Mulugu Lord Ram: నుదుటన సూర్య తిలకం ఆ అయోధ్య రాముడికే కాదు.. మన తెలంగాణలోని రాముడికి కూడా.. ములుగులోని చిన్ని రాముడి నుదుటన సూర్య తిలకం.. తన్మయత్వంతో పులకించిన భక్త జనం
Rudraశ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించడాన్ని చూసి యావత్తు భక్తజనం తన్మయత్వంతో పులకించిపోయింది.
Raghu Rama Krishna Raju Files Nomination: టీడీపీ, జ‌న‌సేన కూట‌మికి షాక్ ఇచ్చిన ర‌ఘురామ కృష్ణంరాజు, బీ ఫాం ఇవ్వ‌క‌పోయినప్ప‌టికీ ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ దాఖలు, రెబ‌ల్ గా పోటీ చేస్తారా?
VNSటీడీపీ తరపున ఎవరికీ బీఫాం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నామినేషన్ (Raghu Rama Krishna Raju Nomination) వేశారు. రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) భార్య, కుమారుడు భరత్ శుక్రవారం ఉండి రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
EC Notices To Ys Sharmila: వైయ‌స్ ష‌ర్మిల‌కు ఎన్నిక‌ల సంఘం షాక్, వివేకా హ‌త్య‌కేసులో వ్యాఖ్య‌ల‌పై 48 గంట‌ల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ఆదేశం
VNSవైఎస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికల వేళ విపక్షాలు వివేకా హత్య కేసు విషయంలో వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
Andhra Pradesh: ఎన్నికల ప్రచారాన్ని ఆపేసి తల్లీ బిడ్డను రక్షించేందుకు ఆస్పత్రికి పరిగెత్తిన టీడీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, వీడియో ఇదిగో..
Hazarath Reddyసమాచారం వచ్చిన వెంటనే స్పందించిన డాక్టర్ లక్ష్మి.. గైనకాలజిస్టు కావడంతో వెంటనే దర్శిలోని ఆసుపత్రికి వెళ్లారు. ఎమర్జెన్సీగా మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. మహిళ బంధువులు గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ, మనవడ్ని కాపాడిన లక్ష్మికి మహిళ తల్లి ధన్యవాదాలు తెలిపారు.
Kakinada Memantha Siddham Sabha: జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌ పారిపోయాడు, చంద్రబాబు సంకలో పిల్లి ఈ పవన్ కళ్యాణ్ అంటూ కాకినాడలో విరుచుకుపడిన సీఎం జగన్
Hazarath Reddyమేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 18వ రోజు తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు.కాకినాడలో ఉప్పొంగి ప్రవహిస్తన్న నిండు గోదావరి కనిపిస్తోందన్నారు.
Madhavi Latha Arrow at Mosque Video: మసీదు వైపు బాణం విడుస్తున్నట్లుగా మాధవీలత యాక్షన్, చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన ఒవైసీ, బీజేపీ అభ్యర్థి రియాక్షన్ ఏంటంటే..
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల వేళ హైదరాబాద్ లో బీజేపీ, ఎంఐఎంల మధ్య ఫైట్ సెగలు రేపుతోంది. మసీదు వైపు బాణం విడుస్తున్నట్లు సైగలు చేసిన మాధవీలతపై ఈసీ యాక్షన్‌ తీసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
2024 భారతదేశం ఎన్నికలు: రాజీనామా చేసి రా.. నువ్వా నేనా చూసుకుందాం, క‌డియం శ్రీహ‌రికి సవాల్ విసిరిన రాజయ్య, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. ద‌మ్ముంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని, ఇదే ఘ‌న్‌పూర్‌లో నువ్వా.. నేనా చూసుకుందాం అని అన్నారు.
Telangana Elections 2024: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన వీడియో ఇదిగో..
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్‌ఎస్‌ రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు తెలియజేశారు
Andhra Pradesh Elections 2024: వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విశాఖ ఈస్ట్ మాజీ ఇన్‌చార్జి అక్కరమాని విజయనిర్మల, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు
Hazarath Reddyవిశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఎ) మాజీ చైర్‌పర్సన్‌, తూర్పు నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్‌చార్జి అక్కరమాని విజయనిర్మల, ఆమె భర్త వెంకటరావు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి అధినేత నారా చంద్రబాబునాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Telugu States Weather Update: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరిక
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు రెండు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి.సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి
Lok Sabha Elections 2024: బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో 15 సీట్లు కూడా రావు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేరళలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా
Hazarath Reddyకేరళలోని అట్టింగల్‌లో కాంగ్రెస్‌ నాయకుడు అదూర్‌ ప్రకాష్‌ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా జరిగిన ర్యాలీలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ విజయం సాధిస్తుందని, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం 14 స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు.
Telangana Elections 2024: సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడు, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, లోక్ సభ ఎన్నికలే టార్గెట్‌గా నయా స్కెచ్
Hazarath Reddyతెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ సైగ చేస్తే చాలని అన్నారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు (BRS MP Candidates) , ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
Telangana Elections 2024: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyతెలంగాణ లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా మరో నేత బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రటించారు.
CM Jagan Stone Attack Case: సీఎం జగన్‌పై రాయిదాడి కేసులో నిందితుడు సతీష్‌ అరెస్ట్‌, కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయి దాడి కేసులో సతీష్‌ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్‌ ఏ1గా ఉన్నాడు. నిందితుడు సతీష్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana: హనుమాన్ దుస్తులతో స్కూలుకు విద్యార్థులు, తీవ్ర అభ్యంతరం తెలిపిన హెడ్ మాస్టర్, కోపంతో స్కూలును ధ్వంసం చేసిన విద్యార్థులు, వీడియో వైరల్
Hazarath Reddyమంచిర్యాల కన్నెపల్లి గ్రామంలోని బ్లెస్డ్ మదర్ థెరిసా హైస్కూలు హనుమాన్‌ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్‌, హెడ్ మాస్టర్ పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
Cash-For-Vote Case: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జూలై 24కి వాయిదా, వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరఫున న్యాయవాది కోరడంతో విచారణను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం జూలై 24కి వాయిదా వేసింది
Road Accident Video: మూల మలుపులు వద్ద అతివేగంతో వచ్చిన కారు లారీని గుద్దిన వీడియో ఇదిగో, ఓవర్ టేక్ చాలా ప్రమాదకరం అంటూ షేర్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోను షేర్ చేశారు.అందులో మూల మలుపుల వద్ద అతివేగంతో భారీ వాహనాలను ఇలా ఓవర్ టేక్ చేయడం అత్యంత ప్రమాదకరం.
Andhra Pradesh Elections 2024: తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్, వైసీపీలో చేరిన రాజోలు జనసేన ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు, ఇతర నేతలు
Hazarath Reddyఏపీ ఎన్నికలవేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. సీఎం వైయస్ జగన్ రాజోలు ఇంఛార్జ్, బొంతు రాజేశ్వరరావు, ఇతర నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటుగా అమ‌లాపురం ఇంఛార్జ్ రాజబాబు, ముమ్మడివరం ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ, పిఠాపురం ఇంఛార్జ్ శేషు కుమారి, కాకినాడ మాజీ మేయర్ సరోజ తదితరులు వైసీపీలో చేరారు.
Telangana: ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందిన గర్భిణి, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన
Hazarath Reddyడాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి.. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన. నారాయణపేట - మద్దూరు మండలం భీంపురానికి చెందిన గర్భిణీ గోవిందమ్మ (36) ప్రసవం కోసం మద్దూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. కానీ అక్కడి వైద్యులు కష్టంగా ఉంది వేరే ఆస్పత్రికు వెళ్లాలని సూచించారు.