రాష్ట్రీయం

Rain Forecast for Telangana: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూస్! రెండు రోజుల పాటూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌న్న ఐఎండీ, ఏయే జిల్లాల్లో వ‌ర్షాలున్నాయంటే?

VNS

గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్‌ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి.

Heatwave Warning: బీ అల‌ర్ట్! రాబోయే ఐదు రోజుల పాటూ అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రండి, ఏపీలోని ప‌లు జిల్లాలో వ‌డ‌గాల్పులు వీస్తాయ‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌

VNS

ఏపీలో వడగాలులు (Heat Wave) వీచే అవకాశం ఉంది. గురువారం పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలో 130 మండలాల్లో వడగాలులు, ఎల్లుండి 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

SangaReddy Fire: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సీఎం ఆదేశాలు

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా హత్నుర మండలంలోని కెమికల్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డి ని ఆదేశించారు

Shah Rukh In Visakhapatnam: వీడియో ఇదిగో, విశాఖలో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, రేపు సాయంత్రం వరకు అక్కడే..

Hazarath Reddy

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. వైఎస్సాఆర్ స్టేడియంలో కలకత్తా నైట్ రైడర్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కు జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు. ముంబాయి నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు.

Advertisement

Telangana: మంచి నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంక్లో కోతుల మృతదేహాలు, కొన్ని రోజుల నుంచి అవే నీళ్లు తాగుతున్న ఆ మున్సిపాలిటీ ప్రజలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో 1వ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్లో కోతుల మృతదేహాలు లభించాయి. దాదాపు 30 కోతుల మృతదేహాలు ట్యాంకులో లభించాయి.అయితే గత కొన్ని రోజులుగా ఇదే ట్యాంకు నుంచి మంచినీటి సరఫరా చేస్తున్నారు ఎన్ఎస్పీ అధికారులు.

Andhra Pradesh: పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి, కుటుంబాన్ని పరామర్శించేందుకు ఒకేసారి వెళ్లిన టీడీపీ, వైసీపీ నేతలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వజ్రమ్మ (80) అనే వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో మృతి చెందింది. ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి జోగి రమేశ్, టీడీపీ నేత బోడె ప్రసాద్ ఒకేసారి వెళ్లారు.

Film Chamber Fire Videos: హైదరాబాద్‌ ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్నిప్రమాదం, ఎగిసిపడుతున్న మంటలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉ‍న్న ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.

Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మనిషా శాడిస్టా, పూతలపట్టులో సీఎం జగన్ తీవ్ర విమర్శలు, ఈసీకి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపాటు

Hazarath Reddy

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ పార్టీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 7వ రోజు కొనసాగుతోంది. 7వ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ (CM Jagan Speech in Memantha Siddham Puthalapattu) మాట్లాడారు.

Advertisement

Sangareddy Fire Videos: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, డైరెక్టర్‌‌తో పాటుగా ఆరుగురు కార్మికులు మృతి, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ఈరోజు( బుధవారం) రియాక్టర్‌ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితో పాటు మరో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Telangana: గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చెయ్యి, రాత్రంతా గుడిలోనే జాగారం, ఉదయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు

Hazarath Reddy

బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో పనిచేసే సురేశ్ హుండి పై భాగాన్ని ధ్వంసం చేసి అందులో డబ్బు తీసేందుకు లోపల చెయ్యి పెట్టగా అది హుండీలో ఇరుక్కుపోయింది.ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకి సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Andhra Pradesh: ఒకటో తేదీ ఇంటికి రాని పెన్సన్, ఇద్దరు వృద్ధులు గుండెపోటుతో మృతి, ఎక్స్ వేదికగా ప్రతిపక్షాలపై వైసీపీ ఫైర్

Hazarath Reddy

కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు.కూలీ పని చేసుకునే వెంకట్రావ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.

CM Revanth Reddy Slams KCR: పదేళ్ల కేసీఆర్‌ పాలనలో వందేళ్ల విధ్వంసం, బీఆర్ఎస్ అధినేతపై మండిపడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

రానున్న లోక్‌సభ ఎన్నిలకు తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణకు ఇవ్వనున్న ప్రత్యేక నిధులు, అనుమతులను అందులో పొందుపరుస్తామని చెప్పారు.

Advertisement

Telangana Elections 2024: రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా? కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టాలా?, తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశ్నించిన మందకృష్ణ మాదిగ

Hazarath Reddy

రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయకుండా వస్తున్న ఎమ్మెల్యేలను ఎలా పార్టీలో చేర్చుకుంటున్నావు అని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా?.. కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టాలా? ఇప్పుడు నీవే చెప్పు ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు.

Memantha Siddham: ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి, మదనపల్లి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్, ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉందని వెల్లడి

Hazarath Reddy

మదనపల్లిలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్ధేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవబోతుంది. ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకు వీలు లేదు.. డబుల్‌ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. మీరంతా కూడా సిద్ధమేనా’ అన్నారు.

Pension Distribution in AP: ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్‌, విధి విధానాలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి(ఏప్రిల్‌3) పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 6 వరకు (మొత్తం నాలుగు రోజులు) పెన్షన్లను పంపిణీ జరగనుంది. అయితే సచివాలయ సిబ్బంది కొరత కారణంగా రెండు విధానాల్లో పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం విధివిధానాలు జారీ చేసింది.

Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికలు, ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ఎన్నికల సంఘం

Hazarath Reddy

ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ( central election commission) బదిలీ చేసింది. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట ఎన్నికల సంఘం సీఈవో ఎంకే మీనాను ఆదేశించింది

Advertisement

Telangana Elections 2024: వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య, మిగతా మూడు స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

Hazarath Reddy

వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.

Andhra Pradesh Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే 114 మంది అభ్యర్థులు వీరే, శింగనమల నుంచి మాజీ మంత్రి శైలజానాథ్‌ పోటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు లోక్‌సభ, 114 మంది ఎ‍మ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ మంగళవారం(ఏప్రిల్‌ 2) విడుదల చేసింది.అసెంబ్లీ టికెట్లు పొందినవారిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలున్నారు.

Pension Distribution in Andhra Pradesh: పెన్సన్ ఇంటికి రాదేమోననే భయంతో ఇద్దరు గుండెపోటుతో మృతి, పెన్సన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో ఇప్పుడు పెన్సన్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఏపీలో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.

Andhra Pradesh Elections 2024: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, కడప నుంచి ఎంపీగా బరిలో వైఎస్ షర్మిల

Hazarath Reddy

లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.

Advertisement
Advertisement