రాష్ట్రీయం

Andhra Pradesh Elections 2024: జనసేన ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం రూ. 10 కోట్లు విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జనసేనాని పవన్ కల్యాణ్ తన సొంత పార్టీ జనసేన కోసం తన సొంత డబ్బు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళం చెక్కులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవీ రత్నంకు అందజేశారు.

Delhi Excise Policy Case: కవిత కేసులో రాజకీయ ప్రమేయం లేదు, అది అంతా అవినీతి కేసు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

హైదరాబాద్, తెలంగాణ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితపై కేసు రాజకీయ ప్రేరేపితమైనది కాదని, ఇది అవినీతి కేసు అని.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి సంబంధించిన కేసు అని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

KTR Slams CM Revanth Reddy: వెంట్రుక కూడా పీకలేవంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన కేటీఆర్, ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అవుతారంటూ జోస్యం

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు (KTR Slams CM Revanth Reddy) చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి నేతలతో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, చంద్రబాబుపై నరసాపురం ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు, నమ్ముకున్నోడికి సీటు ఇప్పించలేదు. మిమ్మల్ని ఎలా నమ్ముతారంటూ..

Hazarath Reddy

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు సంబంధించిన డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామకృష్ణరాజు.. తన సీటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీటు ఇవ్వాలి.. విజయనగరం వదిలేయండి. టీడీపీ నాకు సీటు ఇవ్వాలి

Advertisement

Andhra Pradesh Elections 2024: సైకిల్ గుర్తుకి ఓటు వేయమని చెప్పగానే వెళ్లిపోయిన జనం, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నిండు సభలో చేదు అనుభవం ఎదురైంది. సైకిల్ గుర్తుకి ఓటు వేయమని అడగ్గానే జనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డి ఎక్కడికి వెళ్లిపోతున్నారు ఉండండి అనడం వీడియోలో కనిపిస్తోంది.

Andhra Pradesh Elections 2024: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు, మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధ, అధికారికంగా ప్రకటించిన వైసీపీ

Hazarath Reddy

అనకాపల్లి లోక్‌సభ స్థానానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి పేరును వైఎస్సార్‌సీపీ అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తీహార్ జైలుకు కవిత, ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం, కోర్టులో వాదనలు ఎలా సాగాయంటే..

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 14 రోజుల పాటు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది ట్రయల్‌ కోర్టు.దీంతో ఆమెను తీహార్‌ జైలుకు అధికారులు తరలించనున్నారు. లిక్కర్‌ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.

Andhra Pradesh Fire: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం, ఆయిల్‌ శుద్ధి చేసే కేంద్రంలో చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విజయవాడ నగర శివారు కానూరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్‌ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శకటాలతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

Delhi Excise Policy Case: ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు, కడిగిన ముత్యంలో బటయకు వస్తానని తెలిపిన ఎమ్మెల్సీ కవిత

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది మనీ లాండరింగ్‌ కేసు కాదని, పొలిటికల్‌ లాండరింగ్‌ కేసని విమర్శలు గుప్పించారు.

Andhra Pradesh Elections 2024: తిరుపతి టికెట్ జనసేనకు ఇవ్వడంతో ఏడ్చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని సూటి ప్రశ్న

Hazarath Reddy

తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జనసేన నుంచి ఆరని శ్రీనివాసులుకు టికెట్‌ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టికెట్‌ దక్కలేదని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని, తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరమని అన్నారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, అధికారంలోకి రాగానే మద్యం ధరలు తగ్గిస్తామని తెలిపిన చంద్రబాబు

Hazarath Reddy

తెలుగు తమ్ముళ్లు ఎవరికీ భయపడబోరని, అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుకుంటూ వెళతామే తప్ప, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మేము అధికారంలోకి రాగానే మద్యం ధరలు తగ్గిస్తామని నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Andhra Pradesh: మగవాళ్లు చీరలు కట్టుకుని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు, కర్నూలు జిల్లాలో హోళీ పండగ రోజు జరిగే వింత ఆచారం గురించి ఎవరికైనా తెలుసా..

Hazarath Reddy

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో హొలీ పండుగను మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీర్చడం.. ఇక్కడ వారి సంప్రదాయంగా వస్తోంది

Advertisement

Andhra Pradesh Elections 2024: టీడీపీ అధికారంలోకి వస్తే రూ. 4 వేలు పెన్సన్, కుప్పంలో చంద్రబాబు సంచలన ప్రకటన, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమని వెల్లడి

Hazarath Reddy

ఏపీలో అరాచక పాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మూడు పార్టీల అజెండా ఒక్కటేనని... రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు (Chandrababu Naidu ) ఉద్ఘాటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు.

Andhra Pradesh Elections 2024: జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు రఘురామ కాదు, ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు, నరసాపురం సీటు నాకు రాకుండా అడ్డుకున్నారని మండిపాటు

Hazarath Reddy

టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఏపీలోని 6 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. రఘురామకృష్ణంరాజు సిట్టింగ్ ఎంపీగా ఉన్న నరసాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరును అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే.

Lok Sabha Elections 2024: బీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్న 17 మంది ఎంపీ అభ్యర్థులు వీళ్లే, హైదరాబాద్‌ నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పోటీ

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ (BRS) మొత్తం ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. తాజాగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించారు

Telangana Shocker: ఆటో డ్రైవర్ మీద దాడి చేసిన వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసులు, రూ. 5 వేల అప్పు చెల్లించలేదని విచక్షణారహితంగా దాడి చేసిన వ్యాపారి

Hazarath Reddy

డబ్బులు చెల్లించలేదని ఇంటికి వెళ్లి తన కొడుకుతో వీడియో తీయిస్తూ విచక్షణారహితంగా దాడి చేశాడు.దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు వడ్డివ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Telangana: హోలీ రోజు తీవ్ర విషాదం, వార్దా నదిలో ఈతకు వెల్లి నలుగురు యువకులు మృతి, డెడ్ బాడీలను వెలికి తీసిన జాలర్లు

Hazarath Reddy

హోలీ పండుగపూట కుమ్రంభీం ఆసిఫాబాద్‌ (Asifabad) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నదిలో స్నానికి వెళ్లిన నలుగురు యువకులు నీట మునిగి చనిపోయారు(Death of four youths). జాలర్లు మృతదేహాలను వెలికి తీశారు.

Telangana Shocker: భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న జడ్జి, కుటుంబ కలహాలే కారణమని తేల్చిన పోలీసులు, హైదరాబాద్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదివారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 36 ఏళ్ల, ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (JFCM), చిన్న సమస్యపై తన భార్యతో "వాదన" కారణంగా కలత చెంది, తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా తెలిపారు.

Nara Lokesh Fire on Police: డీజీపీని తమాషాలు ఆడొద్దని చెప్పండంటూ పోలీసులకు నారా లోకేష్ వార్నింగ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు.. వైఎస్సార్‌సీపీ నేతల కార్లు ఎందుకు ఆపి సోదాలు చేయడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్నారు.

Telangana: పోలీసు డ్రెస్ వేసుకొని దొంగతనానికి వచ్చిన వ్యక్తిని పట్టుకుని చితకబాదిన స్థానికులు, అనంతరం పోలీసులకు అప్పగింత, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

నిర్మల్ - కడెం మండలంలో కరీంనగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పోలీసు డ్రెస్ వేసుకొని వచ్చి మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు.. అనంతరం మరో దగ్గర దొంగతనానికి పాల్పడుతుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.

Advertisement
Advertisement