ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: మార్చి 1 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌, గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ, వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Hazarath Reddy

వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని, ఏపీ సీఎస్‌ జవహార్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రజారోగ్యానికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు

Taraka Ratna Health Update: తారకరత్నకు హార్ట్‌లో కుడి,ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్, మాసివ్‌ హార్ట్‌ ఎటాక్‌ లెఫ్ట్‌ సైడ్‌తో కుప్పకూలారని తెలిపిన బాలకృష్ణ, బెంగుళూరు తరలించేందుకు ఏర్పాట్లు

Hazarath Reddy

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు. ‘తారకరత్నకు స్టంట్‌లు వేయలేదు. యాంజియోగ్రామ్‌ మాత్రమే పూర్తైంది. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోలుకున్న తర్వాత స్టంట్స్‌ వేస్తారా?.. ఇతర ట్రీట్‌మెంట్‌లు అందిస్తారా? అనేది వేచిచూడాలి.

Nara Lokesh Yuva Galam: నారా లోకేష్‌ పాదయాత్రలో అపశ్రుతి, స్పృహ తప్పి పడిపోయిన నందమూరి తారకరత్న, కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించిన అధికారులు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Hazarath Reddy

నారా లోకేష్‌ పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను చికిత్స కోసం కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్‌ ఆసుపత్రికి తరలించారు.

Jamuna No More: తెలుగు చిత్రసీమలో స్వర్ణ యుగానికి తెరపడింది, జమున కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపిస సీఎం జగన్

Hazarath Reddy

ప్రముఖ సీనియర్‌ నటి జమున(86) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని స్వగృహంలోనే శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 29, 30 తేదీల్లో ఏపీలో మోస్తరు వర్షాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతల క్షీణత

Hazarath Reddy

తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా మూడు రోజులపాటు నెమ్మదిగా పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) గురువారం రాత్రి నివేదికలో తెలిపింది.

Srikakulam Youth Dies In US: అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి.. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే విషాదం

Rudra

ఉపాధి కోసం అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళం జిల్లా యువకుడు రవికుమార్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

NBK On Akkineni: అక్కినేని తొక్కినేని వ్యాఖ్యల వివాదంపై బాలకృష్ణ క్లారిటీ, అనుకోకుండా ఫ్లోలో ఆ మాట వచ్చేసింది, నాగేశ్వరరావు నాకు బాబాయి లాంటి వారు..

kanha

అక్కినేని నాగేశ్వరరావుపై తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ స్పందించారు. నాగేశ్వరరావుపై తాను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని, అనుకోకుండా తొక్కినేని అనే పదాన్ని మాట్లాడానని బాలకృష్ణ స్పష్టం చేశారు.

AP CM Jagan On Republic Day: ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుందామని సీఎం జగన్ ట్వీట్

kanha

స్వతంత్ర భారతాన్ని గణతంత్ర దేశంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నేడు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం తన సందేశాన్ని ట్వీట్ చేశారు.

Advertisement

Padma Awards 2023: తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ పురస్కారాలు దక్కింది వీరికే! తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏడుగురికి పద్మ అవార్డులు

VNS

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను (Padma awards 2023) కేంద్రం ప్రకటించింది.ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. అందులో ఆరుగురు పద్మ విభూషణ్, 9 మంది పద్మ భూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.

Andhra Pradesh: ఆర్బీకే వ్యవస్థను బలోపేతం చేయండి, పశువులకు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టండి, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్

Hazarath Reddy

తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల్లో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు.

YSR Mobile Veterinary Ambulances: మూగ జీవాలకు మెరుగైన వైద్యం, 165 వైఎస్సార్ వెటర్నరీ అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీలో మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య (మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌) సేవలను (YSR Mobile Veterinary Ambulances) మరింత విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది.

RGV Satires on Pawan: మీ అభిమానినంటూ వరుస ట్వీట్లతో పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేసిన ఆర్జీవి, మీరు”పంది బస్సు” మీద తిరుగుతున్నారంటున్న వారిని బస్సు టైర్ కింద తొక్కించేయాలని సూచన

Hazarath Reddy

రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ (RGV Satires on Pawan) వరుస ఫోటోలు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ స్వామి వివేకానంద అని అలాంటి అతను హిట్లర్ వ్యాన్ మీద నుంచి మాట్లాడుతున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి రామ్ గోపాల్ వర్మ కొన్ని ఫోటోలు షేర్ చేశారు.

Advertisement

Janasena Alliance Row: జనసేన పొత్తులపై క్లారిటీ, ఏపీలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళతాం, కొత్త పొత్తులు కలిస్తే వారితో కలిసి వెళ్తాం, స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

ఏపీలో బీజేపీ, జనసేన మధ్య కొంతకాలంగా గ్యాప్ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. దాంతో రెండు పార్టీల మధ్య భాగస్వామ్యం ఉందా? లేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో కొండగట్టులో వారాహి వాహనానికి పూజలు చేసిన సందర్భంగా, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏపీలో బీజేపీతో జనసేన పొత్తులోనే (Janasena Alliance Row) ఉందని స్పష్టం చేశారు.

YS Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, సీబీఐ నోటీసులపై స్పందించిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, 5 రోజుల తర్వాత హాజరవుతానని వెల్లడి

Hazarath Reddy

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నోటీసులపై కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి ( MP Avinash Reddy) స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం విచారణకు హాజరవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారని (MP Avinash Reddy Reacts On CBI Notice) పేర్కొన్నారు.

APSCHE Exam Calendar 2023-24: ఏపీలో మే 15 నుంచి ఈఏపీసెట్‌, అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను విడుదల చేసిన APSCHE, పూర్తి వివరాలు కథనంలో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2023-2024కి సంబంధించిన అన్ని సాధారణ ప్రవేశ పరీక్షల తేదీలను విడుదల (APSCHE Exam Calendar 2023-24) చేసింది. అభ్యర్థులు మొత్తం APSCHE పరీక్షా క్యాలెండర్ 2023-24ను ఓ సారి ఈ కథనంలో చెక్ చేసుకోవచ్చు.

Nara Lokesh Padayatra Schedule: నారా లోకేశ్‌ పాదయాత్రకు పోలీసులు అనుమతి, షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ప్రకటన, యువగళం పూర్తి షెడ్యూల్ ఇదే..

Hazarath Reddy

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు (Nara Lokesh Padayatra ) పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్‌ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగించొద్దని ఎస్పీ సూచించారు.

Advertisement

Ex-Minister’s Driver Suicide: మాజీ హోం మంత్రి సుచరిత ఎస్కార్ట్ డ్రైవర్ ఆత్మహత్య

Rudra

ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత నివాసం వద్ద ఆమె ఎస్కార్ట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన నిన్న రాత్రి 9 గంటలకు చోటు చేసుకుంది.

BSNL IPTV: బీఎస్ఎన్ఎల్ నుంచి ఐపీటీవీ సర్వీసులు.. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌తో వెయ్యికి పైగా టీవీ ఛానెళ్లు

Rudra

మీరు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులా? అయితే ఇది మీకు తప్పకుండా శుభవార్తే. ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. సిటీ మీడియాతో కలిసి ఉల్కా టీవీ పేరుతో విజయవాడలో ఇటీవల ఈ సర్వీసులను ప్రారంభించింది.

Angapradakshina In Tirumala: నేటి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల.. సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అంగప్రదక్షిణకు అనుమతి

Rudra

నేటి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణం కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. అలాగే, బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని నిలిపివేసినట్టు పేర్కొంది.

AP CID New Chief N Sanjay: ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ డీజీగా ఎన్‌ సంజయ్‌, ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్‌ కుమార్‌ను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ డీజీగా ఎన్‌ సంజయ్‌ ఐపీఎస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఫైర్‌ సర్వీసెస్‌(విపత్తు నిర్వహణ) డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్‌ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది

Advertisement
Advertisement