ఆంధ్ర ప్రదేశ్

Gun Misfire: గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలు.. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘటన (వీడియో)

Rudra

అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘోరం జరిగింది. గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి ఏఆర్ కానిస్టేబుల్ సుబ్బరాజుకు గాయాలయ్యాయి.

AP Formation Day Wishes: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నేడు.. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ ప్రత్యేకమైన కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.

Rudra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగింది.

Blade Attack: బ్లేడ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి.. మహిళలకూ గాయాలు.. ఏపీ తాడేపల్లిలో ఘటన (వీడియో)

Rudra

ఏపీలోని తాడేపల్లి పట్టణం ఉండవల్లి సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నూడుల్స్ బండి వద్ద యువకుల మధ్య పరస్పర వాదనలతో మొదలైన ఓ గొడవ చివరకు బ్లేడ్లతో దాడి చేసుకునే వరకు వచ్చింది.

Andhra Pradesh Formation Day 2024 Wishes: ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ Whatsapp, Instagram, Facebook ద్వారా తెలియచేయాలని ఉందా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉచితంగా వాడుకోవచ్చు..

sajaya

పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.

Advertisement

Andhra Pradesh Formation Day 2024 Wishes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..

sajaya

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మీ బంధు మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవచ్చు.

Andhra Pradesh: పెన్షన్ల పంపిణీలో రగడ, దెందులూరులో కొట్టుకున్న టీడీపీ - జనసేన నేతలు...వీడియో ఇదిగో

Arun Charagonda

ఏపీలో కూటమిలోని మిత్రపక్షాల మధ్య రగడ తారాస్థాయికి చేరింది. మరోసారి రెచ్చిపోయి కొట్టుకున్నారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. దీంతో ఏలూరు జిల్లా కొల్లేరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దెందులూరు నియోజకవర్గం హైడిచింతపాడులో పెన్షన్ల పంపిణి విషయంలో తలెత్తిన వివాదం చివరకు టీడీపీ-జనసేన నేతలు కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Prakasam: బీటెక్ విద్యార్థుల అరాచకం, మూడు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న స్టూడెంట్...వైరల్ వీడియో

Arun Charagonda

ప్రకాశం - మార్కాపురం మండలంలోని దరిమడుగు సమీపంలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్ధుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో దరిమడుగు రహదారిపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్లోబల్, ఇందిరా, జార్జి ఇంజీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.

Andhra Pradesh: షాకింగ్ వీడియో, స్కూటీపై క్రాకర్స్ తీసుకెళ్తుండగా పేలుడు..ఒకరు మృతి...సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో

Arun Charagonda

బాణాసంచా పేలి మహిళ మృతి చెందిన సంఘటన ఏలూరులో చోటు చేసుకుంది. తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద ఉల్లిపాయలు బాంబు తీసుకెళుతుండగా బండి గోతిలో పడి పేలిపోయాయి బాంబులు. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరి కొందరికి గాయాలయ్యాయి.

Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్, పాకిస్థాన్‌లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ వీడియో సందేశం, ఓ చిన్నారి పాటను షేర్‌ చేసిన పవన్‌

Arun Charagonda

దీపావళి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్ చేశారు. ఓ చిన్నారి పాడిన పాటను షేర్ చేస్తూ దేశ విభజనకు సంబంధించి సంచలన ట్వీట్ చేశారు. పాకిస్థాన్ కు చెందిన హిందూ పిల్లల ఈ పాట విభజన యొక్క లోతైన బాధను ప్రతిబింబిస్తుంది. భారత్ తో మళ్లీ కలవాలని కోరుకునే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు అని తెలిపారు పవన్.

Vijayasai Reddy: చంద్రబాబుకు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు, ప్రాజెక్టు ఎత్తును తగ్గించి ద్రోహం చేస్తున్న చంద్రబాబు అని మండిపడ్డ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Arun Charagonda

పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన..అధికారంలోకి రావడం ఆలస్యం-పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అని మండిపడ్డారు.

TTD Chairman BR Naidu: టీటీడీలో సమూల మార్పులు తీసుకొస్తాం, సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తామన్న ఛైర్మన్ బీఆర్ నాయుడు, శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కడం నా అదృష్టం అని వెల్లడి

Arun Charagonda

టీటీడీలో సమూల మార్పులు తీసుకొస్తామని తెలిపారు నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా నియమితులైన తర్వాత మాట్లాడిన నాయుడు...గత పాలకవర్గంతో పోలిస్తే తాము బాగా పని చేసి ప్రజలు, భక్తుల మన్ననలు పొందుతామని తెలిపారు. తాను చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగానని శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. టీటీడీలో ఏ చిన్న సమస్య వచ్చినా సత్వరమే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని వెల్లడించారు.

Andhra Pradesh: ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా..?, తస్మాత్ జాగ్రత్త..డబ్బులు కాజేస్తున్న యువకుడిని పట్టుకుని చితకబాదిన స్ధానికులు

Arun Charagonda

కర్నూలులో బడా మోసం బయటపడింది. ఏటీఎం మెషిన్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వారికి టోకరా వేస్తున్నాడు ఓ యువకుడు. మెషిన్ లో డిపాజిట్ కి బదులు.. ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్సెక్షన్ చేస్తానంటూ భారీగా డబ్బులు కాజేస్తున్నాడు యువకుడు. దీంతో యువకుడిని పట్టుకుని చితకబాదారు స్థానికులు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, అన్నమయ్య జిల్లాలో 1000 లీటర్లకు సారా ఊటని ధ్వంసం చేసిన పోలీసులు, నాటు సారా తయారు చేసి అమ్మితే కేసులు తప్పవని హెచ్చరిక

Vikas M

అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నారమాకులపల్లి తండాలో సీఐ కళా వెంకట్రావు, ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు చేసిన ఆకస్మిక దాడులలో 1000 లీటర్లకు సారా ఊట ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేయడం, అమ్మడం నేరమని, పోలీసు నియమాలు పాటించని వారిపై పోలీసు కేసులు తప్పవని హెచ్చరించారు.

B.R. Naidu as TTD chairman: టీటీడీ నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు, 24 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు,పూర్తి లిస్టు ఇదిగో..

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో TTD పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు TTD అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Free Gas Cylinders Scheme: ఏపీలో రేపటి నుంచి ఉచిత సిలిండర్ పథకం అమల్లోకి, మూడు సిలిండర్లు ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

దీపం-2 కింద నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతాయి, నాలుగు నెలల వ్యవధిలో ఇవి అందించబడతాయి. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ల కోసం ముందస్తుగా చెల్లించాలని భావిస్తున్నారు. రాష్ట్రం వాటిని 48 గంటల్లో తిరిగి చెల్లిస్తుంది. ఈ రీయింబర్స్‌మెంట్‌లో రూ. 876 ఉంటుంది, మిగిలిన రూ. 25 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా కవర్ చేస్తుంది

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం వీడియో ఇదిగో, బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడి ఇద్దరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

Advertisement

Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో పలు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, కరవు మండలాల జాబితాను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 5 జిల్లాల్లో 54 కరువు మండలాలు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కరవు మండలాల జాబితాను తాజాగా ప్రకటించింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలు కరవు వల్ల ప్రభావితం అయినట్లు అధికారులు గుర్తించారు.

Weather Forecast: సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, ఈ జిల్లాలకు అలర్ట్

Hazarath Reddy

నిన్న దక్షిణ ఒడిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ చత్తీస్ ఘడ్, ఒడిస్సా ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ, ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

Nara Lokesh Meets Satya Nadella: అమరావతిని ఏఐ రాజధానిగా చేయడమే మా లక్ష్యం, సత్య నాదెళ్లతో భేటి అయిన నారా లోకేష్, ఏపీలో పెట్టుబడులపై చర్చలు

Hazarath Reddy

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ యూఎస్ పర్యటనలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) ప్రియా బాలసుబ్రహ్మణ్యం, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు

Vijayasai Reddy on Chandrababu: బాబు వస్తే కరువు వస్తుంది, చంద్రబాబు, కరువు కవల పిల్లలు, ఏపీ ఐదు జిల్లాల్లో 54 కరువు మండలాల జీవో ప్రకటనపై విజయసాయిరెడ్డి సెటైర్

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. ఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభు­త్వమే తేల్చింది.

Advertisement
Advertisement