తెలంగాణ

Telangana Factory Blast: తెలంగాణ భారీ అగ్నిప్రమాదం, స్కాన్ ఎనర్జీ కంపెనీలో ఒక్కసారిగా పేలుడు, ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని స్కాన్ ఎనర్జీ కంపెనీలో సోమవారం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన పేలుడు కంపెనీలోని బ్యాటరీ గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించినట్లు సమాచారం.

Maha Shivaratri: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు, వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్.వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా శివరాత్రికి ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఈసారి మహాశివరాత్రి శుక్రవారం (మార్చి 8) నాడు వచ్చింది.

Numaish Exhibition End: ముగిసిన నుమాయిష్‌ పండుగ.. 49 రోజుల్లో 24 లక్షల మంది సందర్శకులు.. చివరి రోజు దాదాపు 80 వేలకు పైగా సందర్శకులు

Rudra

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన నుమాయిష్‌ ఆదివారంతో ముగిసింది. 49 రోజులుగా జరిగిన ఈ ఎగ్జిబిషన్‌ను దాదాపు 24 లక్షల వరకు సందర్శకులు సందర్శించారు.

Book Fair End Today: నేటితో ముగియనున్న బుక్‌ ఫెయిర్‌.. నిన్న ఆదివారం భారీగా తరలివచ్చిన పుస్తక ప్రియులు

Rudra

హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది.

Advertisement

Adluri Laxman: ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కు తప్పిన ముప్పు.. లారీని తప్పించబోయి బోల్తా పడిన కారు.. ఎమ్మెల్యేకు గాయాలు (వీడియో వైరల్)

Rudra

ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కు (Adluri Laxman Kumar) పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.

Gottipati Ravikumar: టీడీపీ ఎమ్మెల్యే కారుకు యాక్సిడెంట్, సూర్యాపేట దగ్గ‌ర ప్ర‌మాదానికి గురైన కారు, ఎమ్మెల్యే సేఫ్

VNS

ఆంధ్రప్రదేశ్ లోని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కు (Gottipati ravikumar) తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని సూర్యాపేట (Suryapet) వద్ద ప్రమాదానికి గురైంది.

Sai Dharam Tej: టైటిల్ నుంచి ఆ పదాన్ని తొలగించండి.. సాయిధరమ్‌ తేజ్ ‘గాంజా శంకర్’ సినిమాకు నార్కోటిక్స్ పోలీసుల నోటీసులు

Rudra

టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్‌ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా యూనిట్‌ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Numaish Last Day Today: హైదరాబాద్ నుమాయిష్‌ నేడే ఆఖరు.. శనివారం నాటికి దాదాపు ఇరవై లక్షలు దాటిన సందర్శకుల సంఖ్య

Rudra

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌) నేడు ఆదివారం ముగియనుంది.

Advertisement

Telangana Assembly: తెలంగాణ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ

sajaya

గత ప్రభుత్వం 2014-2023 వరకు సాగునీటి రంగానికి ఎకరాకు రూ.11.45 లక్షలు వెచ్చించి రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అయితే కేవలం 15 లక్షల ఎకరాల ఆయకట్టును మాత్రమే ఏర్పాటు చేసిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Gruha Jyothi-Aadhar Link: ఆధార్‌ ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిచ్చే ‘గృహజ్యోతి’ స్కీమ్.. విద్యుత్తు కనెక్షన్‌ నంబర్‌ కు ఆధార్‌ తో అనుసంధానం తప్పనిసరి.. ఆధార్ లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.. మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

Rudra

200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇచ్చే గృహజ్యోతి పథకం.. ఆధార్‌ కార్డు ఉన్నవారికే అందుతుందని తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

Telangana Elections 2024: కాంగ్రెస్ పార్టీలో చేరిన అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డి, హస్తం గూటికి చేరిన బీఆర్ఎస్ నేతల లిస్టు ఇదే..

Hazarath Reddy

పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ అయ్యారు.

Telangana: బీసీ కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ, కులగణన చేస్తే బీసీ కులాలే నష్టపోతాయని బీఆర్ఎస్ ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు నేడు ఆఖరి రోజు. ఈ రోజు సమావేశాల్లో బీసీ కుల గణన తీర్మానంను (caste enumeration resolution) శాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశ పెట్టారు. కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది.

Advertisement

Telangana: వ్యాపారి నుండి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, ఔషధాల టెండర్‌ కోసం కమిషన్ కక్కుర్తి..

Hazarath Reddy

నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ రూ.3 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాధితుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్‌ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్‌ చేశారు. దీంతో, సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.

Hyd Student Dies in Canada: ఉన్నత చదువులకు కెనడా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి గుండెపోటుతో మృతి, మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావాలని తల్లిదండ్రులు వినతి

Hazarath Reddy

షేక్ ముజమ్మిల్ అహ్మద్ అనే భారతీయ విద్యార్థి కెనడాలో గుండెపోటుతో మరణించాడు. కొడుకు మరణవార్త విన్న అతని కుటుంబం మా బిడ్డ అస్థికలను తిరిగి హైదరాబాద్‌కు పంపించేలా ఏర్పాటు చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌ను అభ్యర్థించింది.

Helicopter Ride for Medaram: మేడారానికి హెలికాప్టర్‌ లో వెళ్లొచ్చు.. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు .. త్వరలో ధరల వెల్లడి

Rudra

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు ఆకాశ మార్గంలో వెళ్లేవారి కోసం గత మూడు దఫాల్లో హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ ఎప్పటిలాగే ఈసారి కూడా ఏర్పాట్లు చేస్తున్నది.

TS Traffic Challan Discount Offer Ends: ముగిసిన ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు.. మొత్తం 1.67 కోట్ల చలాన్ల ద్వారా రూ.150.3 కోట్లు వసూలు

Rudra

గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది.. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

Jagtial Shocker: జగిత్యాలలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి

Rudra

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ధరూర్‌ కు చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడు హర్షిత్ (9) గుండెపోటుతో మరణించాడు.

Free Bus Travel For Women: మెట్రో రైలు మాదిరిగా ఆర్టీసీ బస్సులో సీట్లు, ప్రయాణికుల సంఖ్య పెరగడంతో టీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం

Hazarath Reddy

తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సు నిండా సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉండడం లేదని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ భావించింది. దీంతో బస్సు మధ్యలో మెట్రోరైలు మాదిరిగా సిటింగ్ ఏర్పాటు చేసింది.

CAG Report on Kaleshwaram Project: అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం, ఖజానాకు రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడి

Hazarath Reddy

కాళేశ్వరం ప్రాజెక్టులో రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాగ్ వెల్లడించింది. మార్పుల వల్ల గతంలో చేసిన కొన్ని పనులు నిరర్థకంగా మారాయని తెలిపింది. దీంతో రూ.765 కోట్లు నష్టం వాటిల్లిందని తన రిపోర్టులో వెల్లడించింది.

Telangana: ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, ప్రాణం పోతుందని తెలిసి కూడా 50 మంది ప్రయాణికులను రక్షించాడు, ఖమ్మంలో విషాదకర ఘటన

Hazarath Reddy

ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ శ్రీనివాస రావుకు ఉన్నట్టుండి హార్ట్‌ ఎటాక్ వచ్చింది.

Advertisement
Advertisement