తెలంగాణ

GHMC Council Meeting: చరిత్రలో తొలిసారి, బీజేపీ కార్పోరేటర్ల తీరుకు నిరసనగా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరించిన అధికారులు

Hazarath Reddy

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు, వాటర్‌ బోర్డు అధికారులు బయటకు వెళ్లిపోయారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా అధికారులు బాయ్‌కాట్‌ చేశారు. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారులు నిరసన తెలిపారు.

BJP Corporators Protest: 14 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, హైదరాబాద్ వాటర్‌ బోర్డు కార్యాలయంలో రణరంగం, బీజేపీ కార్పొరేటర్ల మెరుపు ధర్నా

Hazarath Reddy

హైదరాబాద్‌లోని GHMC వాటర్‌బోర్డు కార్యాలయం మంగళవారం ఉదయం రణరంగంగా మారింది. సివరేజ్‌ నిర్వహణ చేపట్టడం లేదని, పూడిక తీయట్లేదని బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. డ్రైనేజీల నుంచి తొలగించిన వ్యర్థాలను తీసుకొచ్చి వాటర్‌ బోర్డు కార్యాలయంలో పారబోశారు.

Cyber Fraud: ఆన్‌లైన్ టాస్క్‌పూర్తిచేస్తే కోట్ల విలువైన గిఫ్ట్‌లు, సంగారెడ్డిలో ఇద్దరు మహిళల నుంచి భారీగా ఊడ్చేసిన సైబర్‌ నేరగాళ్లు, విలువైన గిఫ్ట్‌లంటూ మహిళలకు ఎర

VNS

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో భారీ సైబర్ చీటింగ్ కేసు (Cyber Fraud) వెలుగుచూసింది. ఆన్ లైన్ టాస్క్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇద్దరు మహిళలను మోసం చేశారు. వారి నుంచి రూ.25లక్షలు దోచుకున్నారు. ఓ మహిళ నుంచి రూ.20లక్షలు, మరో మహిళ నుంచి 4లక్షలు కాజేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyclone Mocha: తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ గండం, మోచా ఎఫెక్ట్‌ తో మరో ఐదురోజుల పాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం, ప్రభావిత ప్రాంతాల్లో చర్యలపై అధికారులు అప్రమత్తం, హైదరాబాద్‌లోనూ కుండపోత

VNS

తెలంగాణ, ఏపీకి మరో గండం పొంచి ఉంది. మరో ఐదు రోజుల పాటూ భారీ వర్షాలు కురిసే (Rain alert) అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.

Advertisement

Telangana Rains: బీ అలర్ట్, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, తెలంగాణలో మరో మూడు రోజులు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు

Hazarath Reddy

తెలంగాణలో ఎండకాలంలోనే అకాల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతున్నదని హైదరాబాద్‌ కేంద్రం తెలిపింది

Hyderabad: హైదరాబాద్‌లో ఘోర విషాదం, ఆడుకుంటూ నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి, హుస్సేన్‌ సాగర్‌లో తేలియాడుతూ యువతి మృతదేహం

Hazarath Reddy

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ లో ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. కాకినాడకు చెందిన భీమ్‌శంకర్‌ తన భార్య పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ బైక్‌షోరూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. షోరూం ప్రాంగణంలోనే ఓ గదిలో అతడి కుటుంబం నివాసముంటోంది.

Priyanka Tour In Telangana: తెలంగాణకు ప్రియాంక గాంధీ, మే 8న నిరుద్యోగ ర్యాలీకోసం ముమ్మర ఏర్పాట్లు, షెడ్యూల్ దాదాపు ఖరారు, కర్ణాటక ఎన్నికలు ముగియగానే తెలంగాణలో ప్రచారం షురూ

VNS

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తెలంగాణపై దృష్టిసారించనుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ప్రచారం పూర్తవగానే తెలంగాణలో ముఖ్యనేతలు పర్యటించనున్నారు.ఈనెల 8న కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సరూర్ నగర్‌లో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు.

Salaries Hike For Sanitation Workers: సఫాయి కార్మికులకు మేడే బొనాంజా, లక్ష మంది కార్మికులకు జీతం పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం

VNS

మే డే రోజున.. తెలంగాణ ప్రభుత్వం.. పారిశుధ్య కార్మికులకు (Sanitation Workers) తీపి కబురు చెప్పింది. వారి జీతాలు పెంచింది. రాష్ట్రంలో పారిశుధ్య కార్మికుల (Sanitation Workers) వేతనం వెయ్యి రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు.

Advertisement

MP Revanth Reddy: తెలంగాణ నూతన సెక్రటేరియట్‌కు వెళ్లేందుకు యత్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి, అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది

kanha

తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఓ పని మీద స్పెషల్ సిఎస్ అరవింద కుమార్ ను కలిసేందుకు వెళ్లగా, సచివాలయం సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు.

Rains In Hyderabad: భారీ వర్షంతో భాగ్యనగరం అతలాకుతలం.. రోడ్లపైకి చేరిన నీరు... భారీగా నిలిచిన ట్రాఫిక్.. ఈదురుగాలులతో విరిగిపడిన చెట్లు.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వైనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ

Rudra

హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి.

Telangana Secretariat Inauguration: తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇది, మరుగుజ్జులకు కనిపించదు..కొత్త సచివాలయం ఓపెనింగ్ సందర్భంగా సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కామెంట్స్.. కొత్త స‌చివాల‌యంలో కొలువైన సీఎం, మంత్రులు, పలు ఫైళ్లపై తొలి సంతకాలు..

kanha

తెలంగాణా తన చరిత్రలో కొత్త పుంతలు తొక్కుతూ, అత్యాధునిక లక్షణాలతో, ప్రత్యేకమైన డిజైన్‌తో నిర్మించిన రాష్ట్ర పరిపాలన నాడీ కేంద్రమైన సెక్రటేరియట్ యొక్క కొత్త భవనాన్ని ఆదివారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో కుర్చీ వేసి కొన్ని ఫైళ్లపై సంతకాలు చేసి కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.

YS Sharmila: మీడియాతో మాట్లాడుతూ కళ్లు తిరిగి పడిపోయిన వైఎస్ షర్మిల

kanha

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతుండగా స్పృహతప్పి కింద పడిపోయారు. నేలకొండపల్లి మండలం ముటాపురం వీరన్న స్వామి ఉత్సవంలో పాల్గొన్న షర్మిల ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

Yadadri Laxminarasimha Swamy Temple: యాదాద్రిలో ఎల్లుండి నుంచి శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు.. మే 2 నుంచి 4 వరకు నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం నిలిపివేత

Rudra

యాదాద్రిలో (Yadadri) ఎల్లుండి (మంగళవారం) నుంచి శ్రీ నరసింహస్వామి (Yadadri Laxminarasimha Swamy Temple) జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మే నాలుగో తేదీ వరకు రోజు వారీ జరిగే నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Pawan With Chandrababu: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. గంటన్నరపాటు మంతనాలు.. రాజకీయ వర్గాల్లో చర్చ

Rudra

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో నిన్న ఇరువురు నేతల సమావేశం గంటన్నర పాటు జరిగింది.

Warangal Horror: వరంగల్‌లో దారుణం.. అర్ధరాత్రి ఆటోలో వివాహితపై గ్యాంగ్ రేప్.. అరవడంతో బెదిరింపులు

Rudra

వరంగల్‌లో (Warangal) ఘోరం జరిగింది. అర్ధరాత్రి ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ (Driver) సహా అతడి మిత్రులు అత్యాచారానికి ఒడిగట్టారు.

Telangana New Secretariat Inauguration: తెలంగాణ నూతన సచివాలయంలో ప్రారంభమైన చండీయాగం.. మధ్యాహ్నం 1.20 గంటలకు సచివాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్.. లైవ్ వీడియో

Rudra

తెలంగాణ రాజసానికి నిలువుటద్దంలా నిలిచిన నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేటి మధ్యాహ్నం 1.20-1.32 మధ్య ప్రారంభించనున్నారు.

Advertisement

Thota Lakshmi Kantha Rao: కర్ణాటక ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన తోట లక్ష్మీ కాంతారావు

kanha

కర్ణాటక రాష్ట్రంలో మే 10 వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కన్వీనర్, జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీ కాంతారావును ఏఐసీసీ దళిత విభాగం జాతీయ అధ్యక్షులు రాజేష్ లిలోతీయ కర్ణాటకలోని చించోలి నియోజకవర్గ పరిశీలికుడుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Hyderabad Rains: హైదరాబాద్ లో మరో 4 రోజులపాటు భారీ వర్షాలు, వడగండ్ల వానలు, ఆరెంజ్ అలర్ట్ జారీ

kanha

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారత వాతావరణ శాఖ - హైదరాబాద్ (IMD-H) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ-హెచ్ హెచ్చరించింది.

Telangana New Secretariat Building: తెలంగాణ బీజేపీ పార్టీ నుంచి వివాదాస్పద ట్వీట్..అంబేద్కర్ సచివాలయాన్ని మసీదుతో పోల్చిన బీజేపీ, ఇది దళితులకు అవమానం అని మండిపడుతున్న దళిత సంఘాలు..

kanha

తెలంగాణ బీజేపీ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి వివాదాస్పద ట్వీట్ వైరల్ అవుతోంది. సచివాలయం కొత్త భవనం రాష్ట్ర సచివాలయం కంటే మసీదును పోలి ఉందని ఆరోపించింది.

MLA Raja Singh Joining TDP: టీడీపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన రాజా సింగ్, ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది చంద్రబాబే..రాజాసింగ్ జోస్యం..

kanha

తాను టీడీపీలో చేరనున్నట్టు వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీ లో చేరడం లేదని, బీజేపీలోనే కొనసాగాలన్నదే తన అభిమతమని చెప్పారు.

Advertisement
Advertisement