World
Dr. Michiaki Takahashi's 94th Birthday: డాక్టర్ మిచియాకి తకహషి 94వ పుట్టినరోజు, చికెన్‌పాక్స్ మొదటి వ్యాక్సిన్‌ను కనిపెట్టిన వైద్యులు, మశూచి వంటి వ్యాధుల నివారణకు ఎంతో కృషి చేసిన డాక్టర్
Hazarath Reddyచికెన్‌పాక్స్ వ్యాక్సిన్‌ను కనిపెట్టిన డాక్టర్ మిచియాకి తకహషికి ఈరోజు గూగుల్ తన 94వ జయంతి (Dr. Michiaki Takahashi's 94th Birthday) సందర్భంగా డూడుల్‌తో నివాళులర్పించింది. నిజానికి, డాక్టర్ మిచియాకి తకహషి జపాన్‌లోని ఒసాకాలో 1928లో ఈ రోజున జన్మించారు. అతను ఒసాకా విశ్వవిద్యాలయం నుండి తన వైద్య పట్టా పొందాడు
Huawei: హువావేకు ఆదాయ పన్నుశాఖ భారీ షాక్, దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన పలు కార్యాలయాల్లో ఐటీ దాడులు, భారత నియమాలకు కట్టుబడి ఉన్నామని తెలిపిన హువావే
Hazarath Reddyప్రముఖ చైనీస్‌ టెలికాం దిగ్గజం హువావేకు ఆదాయ పన్నుశాఖ గట్టి షాక్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన ఆయా ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేత విచారణలో భాగంగా హువావేకి చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి.
Indonesia: స్కూలులో కామాంధుడుగా మారిన టీచర్, 13 మంది విద్యార్థినులపై దారుణంగా అత్యాచారం, గర్భం దాల్చిన ఎనిమిది మంది, నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన ఇండోనేషియా కోర్టు
Hazarath Reddyఇండోనేషియాలో కామాంధుడికి కోర్టు తగిన శిక్ష విధించింది. విద్యాబుద్ధులు నేర్పి సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడు కీచకులుగా మారి అఘాయిత్యానికి పాల్పడినందుకు అతనికి జీవిత ఖైదు (Indonesian teacher gets life in prison) విధించింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా, కేర్‌టేకర్‌గా ఉండాల్సిన వ్యక్తి.. విద్యార్థినులపై తెగబడ్డాడు.
Lassa Fever: లస్సా ఫీవర్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే, లస్సా ఫీవర్ వచ్చిందని తెలుసుకోవడం ఎలాగో చూడండి, ఇప్పటికే యూకేలో ఒకరు మృతి, లస్సా ఫీవర్‌పై పూర్తి సమాచారం ఇదే..
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి (CoronaVirus) ఇప్పటికే మూడు వేవ్‌ల రూపంలో అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగవ్వక ముందే మరో వైరస్‌ మానవాళిపై విరుచుకుపడేందుకు రెడీ అయింది. ‘లస్సా ఫీవర్‌’ పేరుతో మరో ప్రాణాంతక వ్యాధి మానవాలిని భయపెడుతోంది.
COVID Spread: కరోనాపై మరో షాక్, మృతదేహాల్లో 41 రోజుల పాటు సజీవంగానే వైరస్, శవానికి పరీక్ష చేస్తే 41 రోజుల్లో 28 సార్లు కోవిడ్ పాజిటివ్, ఆందోళన కలిగిస్తున్న సరికొత్త అధ్యయనం
Hazarath Reddyకరోనాపై కొత్త విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనావైరస్ కారణంగా మరణించిన వారి మృతదేహాల్లో వైరస్ దాదాపు 41 రోజులపాటు సజీవంగా ఉంటుందని ఇటలీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అయితే, ఇది మృతదేహం నుంచి కూడా ఇతరులకు సంక్రమిస్తుందా? లేదా? అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు.
Russia-Ukraine Tensions: వెనక్కి తగ్గిన రష్యా, ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల నుంచి బలగాలు ఉపసంహరణ, డ్రిల్స్ పూర్తి చేసుకున్న త‌ర్వాత దళాలు స‌రిహ‌ద్దు నుంచి వెన‌క్కి మ‌ళ్లాయని తెలిపిన రష్యా రక్షణ మంత్రి
Hazarath Reddyఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల నుంచి కొన్ని బ‌ల‌గాల‌ను ర‌ష్యా (Some Russian Forces Return to Bases) ఉప‌సంహ‌రించింది. ఈ విష‌యాన్ని మాస్కో ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. కొన్ని ద‌ళాల‌ను మాత్రం త‌మ బేస్ క్యాంపుల‌కు పంపిస్తున్న‌ట్లు ర‌ష్యా చెప్పింది. ద‌క్షిణ‌, ఉత్త‌ర సైనిక ప్రాంతాల వ‌ద్ద ఉన్న బ‌ల‌గాల‌ను వెన‌క్కి పంపిన‌ట్లు ర‌ష్యా అధికారులు వెల్ల‌డించారు
Russia-Ukraine Tensions: భారతీయులు వెంటనే ఉక్రెయిన్ వదిలి దేశానికి రండి, ర‌ష్యా వైమానిక దాడులు చేసే అవ‌కాశాలున్నాయని తెలిపిన దౌత్య కార్యాల‌యం
Hazarath Reddyఉక్రెయిన్ పై ర‌ష్యా వైమానిక దాడులు చేసే అవ‌కాశాలు ఉన్న నేప‌థ్యంలో.. ఆ దేశంలో ఉన్న భార‌తీయులకు దౌత్య కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న భార‌తీయులు, విద్యార్థులు త‌క్ష‌ణ‌మే తాత్కాలికంగా ఆ దేశం విడిచి రావాల‌ని దౌత్య‌కార్యాల‌యం ఆ ప్ర‌క‌ట‌న‌లో కోరింది.
COVID-19 Pandemic: కరోనాపై గుడ్ న్యూస్, ఈ ఏడాది చివర నాటికి ముగింపు దశకు వస్తుందని తెలిపిన డబ‍్ల్యూహెచ్ఓ, ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని తెలిపిన అథనమ్
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పటికే కరోనా వేరియంట్లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు వ్యాప్తి చెందడంతో లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా ముగింపు దశపై ఆశాజనక ప్రకటన చేసింది.
Govt Bans 54 Chinese Apps: మళ్లీ 54 చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసిన భారత్, దేశ భద్రతకు పెనుముప్పుగా మారాయని తెలిపిన కేంద్రం
Hazarath Reddyగత సంవత్సరం, భారతదేశం PUBG మొబైల్, టిక్‌టాక్, వీబో, వీచాట్, అలీఎక్స్‌ప్రెస్‌తో సహా వందలాది చైనీస్ యాప్‌లను నిషేధించింది. భారతదేశ భద్రతకు ముప్పుగా పరిణమించే 54 చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించనుందని వార్తా సంస్థ ANI ట్వీట్ చేసింది.
Corona Deaths: విదేశాల్లో కరోనాతో ఎంతమంది భారతీయులు మరణించారో తెలుసా? లెక్కలు వెల్లడించిన కేంద్రం, గల్ఫ్ దేశాల్లోనే అత్యధిక మరణాలు
Naresh. VNSకరోనా మహమ్మారి ధాటికి భారత్‌లో (India) కాకుండా....ప్రపంచవ్యాప్తంగా 4,355 మంది భారతీయులు మృతి (Indians died of Corona) చెందారు. మొత్తం 88 దేశాల్లో భారతీయులు కరోనా భారిన పడి మరణించినట్లు కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన డేటాను పార్లమెంట్‌ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.
England: వద్దని ఏడ్చినా వినని కామాంధుడు, 99 ఏళ్ళ బామ్మపై దారుణంగా అత్యాచారం, నిందితుడికి యావ‌జ్జీవ ఖైదు విధించిన ఇంగ్లండ్ ప్రిస్ట‌న్ క్రౌన్ కోర్టు
Hazarath Reddyఇంగ్లండ్ లోని Blackpoolలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ‌య‌సుతో పాటు వావివ‌ర‌స‌ల‌ను మ‌రిచిన ఓ కామాంధుడు ఏకంగా 99 ఏళ్ళ బామ్మపై అత్యాచారానికి తెగబడ్డాడు. బ్లాక్‌పూల్ లాంకాషైర్‌లో బామ్మ బాగోగులు చూసేందుకు ప‌నిలో కుదిరిన కేర్‌గివ‌ర్ (Care worker) వృద్ధురాలిపై ఈ లైంగిక దాడికి (Rape on 99 years old lady by care taker) పాల్ప‌డ‌టం షాక్ కు గురి చేసింది.
Karnataka Hijab Row: హిజ‌బ్ వివాదంపై స్పందించిన పాకిస్తాన్, ముస్లిం పిల్ల‌ల‌ను చ‌దువు సంధ్య‌ల నుంచి దూరం చేయాలని భార‌త ప్ర‌భుత్వం చూస్తోందంటూ పాక్ విదేశాంగ మంత్రి మ‌హ్మ‌ద్ ఖురేషీ ట్వీట్
Hazarath Reddyక‌ర్నాట‌క‌లోని హిజ‌బ్ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ఈ వివాదంపై ఇప్పుడు పాకిస్తాన్ కూడా స్పందించింది. పాక్ విదేశాంగ మంత్రి మ‌హ్మ‌ద్ ఖురేషీ ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. హిజాబ్ ధ‌రించిన కార‌ణంగా మ‌హిళ‌ల‌ను విద్య నుంచి దూరం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, ఇది మాన‌వ‌హ‌క్కుల‌ను హ‌రించ‌డ‌మే అవుతుంద‌ని పాక్ విదేశాంగ మంత్రి ట్వీట్ చేశారు.
Karnataka Hijab Row: కర్ణాటక హిజాబ్ వ్యవహారంపై మలాలా ట్వీట్, ఆడపిల్లలను హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం, మహిళలను చిన్నచూపును ఆపాలంటూ ఆవేదన
Hazarath Reddyకర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం రోజు రోజుకు రాజకీయ రంగును పులుముకుంటోంది. తాజాగా ఈ అంశంపై ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత మలాలా స్పందించారు. బాలికలను హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లనివ్వాలని మలాలా భారతీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తోంది.
Gold Cube on New York Road: 186 కిలలో బంగారు ముద్దను న్యూయార్క్ నగర వీధుల్లో పడేశారు, ఎందుకు పడేశారో తెలిస్తే..షాకవుతారు!
Naresh. VNSన్యూయార్క్(New York) నగర నడి వీధుల్లో పెద్ద బంగారు ముద్ద పడి(Gold Cube) ఉంది. దాని బరువు దాదాపు 186 కిలోలు ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ఎవరూ తీసుకెళ్లలేదు. 88 కోట్ల రూపాయల విలువైన ఈ బంగారు క్యూబ్‌ (Gold Cube)ను ఎందుకు తయారు చేశారో తెలుసా?
Balochistan: ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిన పాకిస్తాన్, 100 మందికి పైగా పాక్‌ సైనికులు మృతి, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చైనా పర్యటన వేళ రక్తసిక్తమైన బలూచిస్తాన్‌
Hazarath Reddyపాకిస్తాన్ ప్రావిన్స్‌లోని బలూచిస్తాన్‌ (Balochistan )రక్తసిక్తమైంది. రెండు మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని బలూచిస్తాన్‌లోని వేర్పాటువాద తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఈ ఆత్మాహుతి దాడులకు (2 Pak Military Bases Attacked) తెగబడ్డారు.
U.S. Raid in Syria: ఐఎస్ఐస్ అగ్ర‌నేత ఖురేషీని హతం చేసిన అమెరికా దళాలు, నార్త్ వెస్ట్ సిరియాలో అల్ ఖురేషీని మ‌ట్టుబెట్టామని తెలిపిన జోబైడెన్
Hazarath Reddyఐఎస్ఐస్ అగ్ర‌నేత అబు ఇబ్ర‌హీమ్ అల్ ఖురేషీని అమెరికా ద‌ళాలు మ‌ట్టుబెట్టామని అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఐఎస్ఐఎస్‌ అగ్ర‌నేత అల్ ఖురేషీ ల‌క్ష్యంగా కౌంట‌ర్ టెర్ర‌రిజ‌మ్ ద‌ళాలు నార్త్ వెస్ట్ సిరియాలో దాడులు నిర్వ‌హించాయ‌ని, ఈ దాడుల్లోఅల్ ఖురేషీని మ‌ట్టుబెట్టాయ‌ని జోబైడెన్ ప్ర‌క‌టించారు.
Beijing Winter Olympics 2022: చైనాకు అసలు సిగ్గనేది ఉందా, మండిపడిన అమెరికా, వింటర్ ఒలింపిక్ టార్చ్‌బేరర్‌గా క్వీ ఫబోవోని ఎన్నుకున్న చైనా, తీవ్రంగా ఖండించిన అగ్రరాజ్యం
Hazarath Reddyచైనా మరోసారి తన నీచ బుద్ధిని చాటుకుంది. వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను‌ నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్‌బేరర్‌గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. ఇతను గల్వాన్‌ లోయ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన సీపీఏల్ఏ కమాండర్‌. ఈ విషయాన్ని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
Galwan Valley Clash: దొంగ నాటకమాడిన చైనా, గాల్వాన్ లోయ దాడిలో 38 మంది చైనా సైనికులు మృతి, సంచలన విషయాలను వెల్లడించిన ఆస్ట్రేలియా పరిశోధనాత్మక వార్తా పత్రిక
Hazarath Reddyచీకట్లో వేగంగా ప్రవహిస్తున్న నదిని దాటే క్రమంలో కనీసం 38 మంది చైనా సైనికులు (38 Chinese soldiers drowned) మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. చైనా బ్లాగర్ల మధ్య జరిగిన చర్చలు, చైనా పౌరుల నుంచి సమీకరించిన సమాచారం, చైనా పత్రికలు ప్రచురించిన వార్తలు ఆధారంగా ఆస్ట్రేలియన్ పత్రిక ఈ కథనాన్ని రూపొందించింది
Neeraj Chopra: మరో అరుదైన ఘనత సాధించిన నీరజ్ చోప్రా, ప్రపంచ అత్యుత్తమ స్పోర్ట్స్ అవార్డు నామినేట్, ఇప్పటి వరకు భారత్‌ నుంచి నామినేట్ అయ్యింది ముగ్గురే
Naresh. VNSటోక్యో ఒలింపిక్స్‌ లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని తీసుకువచ్చిన అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రతిష్ఠాత్మకమైన లారస్‌ ‘వరల్డ్‌ బ్రేక్‌ త్రూ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు (Laureus World Breakthrough of the Year award) నామినేట్‌ అయ్యారు. నీరజ్ చోప్రా (Neeraj Chopra) నామినేషన్ కు సంబంధించిన వార్తను లారస్‌(Laureus) అకాడమీ వెల్లడించింది
Militia Attack on Displaced Persons Camp: కాంగోలో రెచ్చిపోయిన సాయుధులు, నిరాశ్రయులున్న శిబిరంపై దాడి, 60 మంది వరకు మృతి
Hazarath Reddyడెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో సాయుధులు రెచ్చిపోయారు. నిరాశ్రయులున్న శిబిరంపై దాడి చేశారు. ఈ ఘటనలో 60 మంది వరకు మరణించి ఉంటారని అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది.