దేశంలో గత 24 గంటల్లో 4.64 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... వీరిలో 17,135 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందు రోజుతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య దాదాపు 4 వేలు ఎక్కువ. ఇదే సమయంలో 19,823 మంది కోలుకోగా... 47 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,37,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3.69 శాతంగా, క్రియాశీల రేటు 0.31 శాతంగా, రికవరీ రేటు 98.49 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,04,84,30,732 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. మొత్తం 9,47,49,391 మంది ప్రికాషనరీ డోసు వేయించుకున్నారు. నిన్న ఒక్క రోజే 23.49 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 93.36 కోట్ల మంది రెండో డోసు తీసుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)