తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గడచిన 24 గంటల్లో 32,834 శాంపిల్స్ పరీక్షించగా, 705 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 355 కొత్త కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 48, కరీంనగర్ జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35 కేసులు గుర్తించారు. అదే సమయంలో 531 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ నమోదుకాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,19,846 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,10,192 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,543 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)