రాష్ట్రీయం

Vijayasai Reddy on Chandrababu: బాబు వస్తే కరువు వస్తుంది, చంద్రబాబు, కరువు కవల పిల్లలు, ఏపీ ఐదు జిల్లాల్లో 54 కరువు మండలాల జీవో ప్రకటనపై విజయసాయిరెడ్డి సెటైర్

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. ఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభు­త్వమే తేల్చింది.

Andhra Pradesh Shocker: ఆస్తి కోసం తల్లి తల నరికిన కొడుకు, ఏలూరు జిల్లాలో దారుణ సంఘటన, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో దారునం చోటు చేసుకుంది. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం లో భూతగాదాలు విషయంలో గోలి సరోజినీ (60) ని తల నరికాడు కొడుకు జగ్గవరపు వెంకటరెడ్డి (45). అడ్డుగా వచ్చిన తన కొడుకును సైతం చితకబాదాడు వెంకటరెడ్డి. స్థానికుల సాయంతో బాధితురాలని చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

YSRCP on Vijayamma Open Letter: విజయమ్మ బహిరంగ లేఖపై స్పందించిన వైఎస్సార్సీపీ, అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం ఏంటని సూటి ప్రశ్న

Hazarath Reddy

అన్నా చెల్లెలు మధ్య కుటుంబ ఆస్తుల విషయం నేపథ్యంలో దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాసిన సంగతి విదితమే. ఈ లేఖపై వైసీపీ స్పందించింది. వైఎస్‌ విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ ఈమేరకు వైఎస్సార్‌సీపీ ఆమెను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేసింది.

Telangana: దీపావళి పండగ వేళ విషాదం, అంబర్‌పేటలో దీపావళి లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్, కాలిపోయిన 14 ఏళ్ల బాలుడి శరీరం..వీడియో

Arun Charagonda

తెలంగాణలోని అంబర్‌పేటలో దీపావళి పండగ సందర్భంగా విషాదం నెలకొంది. ఇంటిపై హై టెన్షన్ వైర్ తగిలి బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీపావళి పండగ సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా, ఇంటి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ వైర్ తగిలి అభి(14) అనే బాలుడి శరీరం పూర్తిగా కాలిపోయింది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Andhra Pradesh: డోన్ పట్టణం శ్రీ సుధా కాలేజీ లెక్చరర్ దాష్టికం, విద్యార్థులను క్లాస్‌లోనే చితకబాదిన లెక్చరర్....వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని డోన్ పట్టణం శ్రీ సుధా కాలేజీలో దారుణం జరిగింది. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయలేకపోయారని విద్యార్థులను విచక్షణ రహితంగా చితకబాదాడు లెక్చరర్ దేవేంద్ర. విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Anna canteen: వైఎస్‌ఆర్ జిల్లా అన్నా క్యాంటీన్‌లో పేలుడు, వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం...వీడియో ఇదిగో

Arun Charagonda

కడపలో అన్నా క్యాంటీన్‌లో పేలుడు సంభవించింది. మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో పేలుడు థాటికి వంటశాల షెడ్ ధ్వంసమైంది. అయితే వంటలు వండకపోవడం.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Maoists Letter On BRS Leaders: బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల వార్నింగ్ లెటర్, దళిత బంధు పేరుతో మోసం చేశారు...డబ్బులు తిరిగి ఇవ్వకపోతే శిక్ష తప్పదని హెచ్చరిక

Arun Charagonda

దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలారా ఖబద్దార్ అంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపణలు చేశారు జగన్.

CPI Narayana: వైఎస్ ఫ్యామిలీ ఆస్తి వివాదం...రాజకీయం కాదు, బయట వాళ్ల జోక్యం అనవసరం...విజయమ్మ క్లారిటీ ఇచ్చాక కూడా రాద్దాంతం సరికాదన్న సీపీఐ నారాయణ

Arun Charagonda

వైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న ఆస్తి వివాదంపై స్పందించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కుటుంబ వ్యవహారంలో బయట వాళ్ళ జోక్యం ఎందుకు? అని ప్రశ్నించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు నారాయణ. ఆస్తి వివాదాలపై విజయమ్మ క్లారిటీ ఇచ్చేశారు...ఇది కుటుంబ వివాదం.. రాజకీయం కాదు అన్నారు. అందరూ నోరు మూసుకుంటే మంచిదని సూచించారు.

Advertisement

Bomb Threat To Shamshabad Airport:శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల్లో బాంబులు పెట్టామ‌ని ఫోన్లు, అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది

VNS

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది విమానాల్లో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో పలు విమానాల్లో బాంబు ఉన్నాయని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది

YS Vijayamma Letter on Property Dispute: వైఎస్సార్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ, మా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదంటూ ఆవేదన

Hazarath Reddy

వైసీపీ అధినేత జగన్‌, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో వారి తల్లి వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి

Hyderabad Shocker: భర్తను, బిడ్డను పోగొట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఈ తల్లిని చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే, ఆన్లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చలేక కొడుకు సూసైడ్

Hazarath Reddy

ఆన్లైన్ బెట్టింగ్ కు ఇంజనీరింగ్ విద్యార్థి బలయ్యాడు. వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్‌(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

YS Jagan Slams CM Chandrababu: రైతులను బాధపెట్టిన వారు బాగుపడినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు, సీఎం చంద్రబాబు ఉచిత పంటల బీమా పథకం రద్దు నిర్ణయంపై మండిపడిన జగన్

Hazarath Reddy

పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు అంటూ ఎక్స్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు.

Advertisement

Babu Mohan: కేఏ పాల్‌కి షాకిచ్చి టీడీపీలో చేరిన మాజీ మంత్రి బాబుమోహన్‌, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లుగా పోస్ట్ చేసిన నటుడు

Hazarath Reddy

మాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబుమోహన్‌ టీడీపీలో చేరారు. తాను ఆందోల్‌ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాబు మొహం కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి విదితమే

APSRTC Driver Dance Video: బస్సుముందు డ్యాన్స్ వేసిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ మళ్లీ విధుల్లోకి, ఆయన డ్యాన్స్‌ను మెచ్చుకున్న నారా లోకేష్, దిగి వచ్చిన అధికారులు

Hazarath Reddy

ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక బస్సును ఆపి.. ప్రయాణికులు విసుగు చెందకుండా ఉండేందుకు డ్యాన్స్ చేసి ఉన్నత అధికారుల ఆగ్రహానికి గురై విధుల నుంచి సస్పెండ్ చేయబడిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు మళ్లీ విధుల్లో చేరాడు.

Andhra Pradesh: పవన్ కళ్యాణ్ గెలిచాడని వీర అభిమాని సాహసం, విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు పాదయాత్ర, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విజయవాడ 60వడివిజన్ vambay కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీర అభిమాని.. ఇతను కూలి పని చేస్తూ జీవిస్తూ ఉంటాడు... పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిస్తే విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు.కాలి నలుగుతూ వస్తానని చెప్పి మొక్కుకున్నాడు

BTech Student Dies by Suicide: తల్లి ఇచ్చిన కాలేజీ ఫీజు డబ్బుతో ఆన్‌లైన్‌ బెట్టింగ్, పోవడంతో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి

Hazarath Reddy

వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్‌(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.గణేశ్‌ తండ్రి పదేళ్ల క్రితమే చనిపోగా, తల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ కుమారుడిని బీటెక్‌ చదివిస్తుంది..

Advertisement

Kapil Dev: సీఏం చంద్రబాబుతో భేటీ కోసం విజయవాడ చేరుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం

Hazarath Reddy

భారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ విజయవాడకు చేరుకున్నారు. కపిల్ దేవ్‌కి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ,ఎంపి కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.

B.Tech Student Caught While Drug Selling: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. వనస్థలిపురంలో సుష్మ థియేటర్ సమీపంలో డ్రగ్స్‌ అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్‌ విద్యార్థి (వీడియో)

Rudra

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్‌ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ జాన్ అనే బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు.

Hyderabad News: కంటి చూపు లేకపోవడంతో పక్కనే కొడుకు చ‌నిపోయినా గుర్తించలేని వృద్ధ తల్లిదండ్రులు.. మూడు రోజులు మృత‌దేహంతోనే సావాసం.. పస్తులతో నీరసించిన వృద్ధులకు పోలీసుల సాయం (వీడియో)

Rudra

బయటి ప్రపంచాన్ని చూడలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు వాళ్లు. వాళ్లకు కంటిచూపు లేదు. తమ కొడుకు వచ్చి భోజనం పెడతాడేమోనని ఆకలితో అలమటిస్తూ ఎదురు చూడసాగారు.

Firecracker Explodes In Hyderabad: హైదరాబాద్ లోని యాకుత్‌ పురాలో ఓ ఇంట్లో బాణ‌సంచా పేలుడు.. దంప‌తులు మృతి (వీడియో)

Rudra

హైద‌రాబాద్ లోని యాకుత్‌ పురాలో ఘోరం జరిగింది. ఇంట్లో బాణ‌సంచా పేలి ఇద్ద‌రు దంప‌తులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement
Advertisement