రాష్ట్రీయం
BRS MLAs Arrest at Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్, పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య స్వల్వ తోపులాట
Hazarath Reddyహైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tirumala Maha Shanti Yagam: వీడియోలు ఇవిగో, తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం, ఒక్క రోజు మాత్రమే యాగం
Hazarath Reddyశ్రీవారి ఆలయంలో (Tirumala) మహా శాంతి యాగం (Maha Shanthi Yagam) ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం (Homam) నిర్వహిస్తున్నారు.
Telangana: షాకింగ్ వీడియో ఇదిగో, బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మానేరు డ్యాం లో దూకిన మహిళ, అప్రమత్తమై లైఫ్ జాకెట్ విసిరిన బోట్ డ్రైవర్
Hazarath Reddyనడుస్తున్న బోట్ లో నుంచి డ్యాం లోకి దూకింది వివాహిత. కరీంనగర్ మానేరు డ్యాం లో నడుస్తున్న బోట్ లో నుంచి ఓ వివాహిత డ్యాం మధ్యలోకి దూకింది. గత కొన్ని రోజులుగా డ్యాం లో నడుస్తున్నాయి టూరిస్ట్ బోట్లు. బోట్ స్పీడ్ పెంచగానే బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మహిళ నీటిలో దూకింది
Telangana: డబ్బులు చెల్లించలేదని గాయానికి కట్టిన కుట్లు విప్పదీసిన ఆస్పత్రి సిబ్బంది, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పినా వినకుండా దాడి
Hazarath Reddyకామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రిలో గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.300 చెల్లించాడు.
Weather Forecast: రెండు తెలుగు రాష్ట్రాలకు అలర్ట్, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
Hazarath Reddyపశ్చిమ, మధ్య బంగాళాఖాతం, మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Tirupati Laddu Controversy: సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వివాదం పంచాయితీ, సీబీఐతో విచారణ జరిపించాలంటూ పిటిషన్, హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్న వైసీపీ
Hazarath Reddyఏపీతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో లడ్డూ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని కోరారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, మార్కాపురంలో మహిళలపై కత్తులతో టీడీపీ కార్యకర్తలు దాడి, వీడియోని షేర్ చేస్తూ ఘాటు విమర్శలు చేసిన వైసీపీ
Hazarath Reddyఏపీలో టీడీపీ కార్యకర్తలు మరోసారి వైసీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ తన ఎక్స్ ఖాతాలో వీడియోని పోస్ట్ చేసింది. టీడీపీ కార్యకర్తలు మహిళలపై దాడి చేసిన వీడియోను షేర్ చేస్తూ.. రాష్ట్రంలో టీడీపీ గూండాలు బరితెగించారు.
Hydra Demolitions at Madhapur: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అమీన్ పూర్ కూల్చివేతల్లో హైడ్రా బిగ్ రికార్డ్.. నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు (వీడియోలతో)
Rudraహైదరాబాద్ పరిసరాలలో అక్రమ కట్టడాలను కూలుస్తూ ఆక్రమణదారుల గుండెలలో దడ పుట్టిస్తోన్న హైడ్రా మరింత దూకుడు పెంచింది.
Tobacco Packet in Tirumala Laddu Prasadam: వెంకటేశా.. క్షమించు..! తిరుమలలో మరో అపచారం.. శ్రీవారి లడ్డూ మహాప్రసాదంలో పొగాకు పొట్లం.. వీడియో వైరల్
Rudraవరుస వివాదాలతో ప్రపంచ ప్రసిద్ధ తిరుమల ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. పశువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడారన్న వివాదం ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమల విషయంలో మరో అపచారం జరిగింది.
Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు కావడంతో ఫర్నీచర్ ధ్వంసం చేసిన అభిమానులు (వీడియో)
Rudraజూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనున్నది. తొలిపార్ట్ ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
Tirumala Shanti Homam : తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, తిరుమల దేవస్థానంలో శాంతిహోమం,
VNSతిరుమలలో సోమవారం శాంతి హోమం నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతిహోమం, పంచగవ్యప్రోక్షణ చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. తిరుమలలో (Tirumala) ఆగస్టు 15న జరిగిన తప్పునకు యాగం చేశారన్నారు.
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేంకటేశ్వర ఆలయానికి పోరాటాసి మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. పోరాటాసి మాసంలో వేంకటేశ్వరుడు భూమిపై వెలిశాడని ప్రతీతి.
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్, ఇందుకు కారణమైన వారు నెత్తురు కక్కుకొని చావాలని మొక్కుకున్న అని వెల్లడి
Arun Charagondaతిరుమల లడ్డు కల్తీపై చంద్రబాబు ఆరోపణలను ఛాలెంజ్ చేస్తున్నాం అన్నారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి. ఈ విషయంలో ప్రధాని మోదీ కలుగజేసుకోవాలని, ఆరోపణలు నిజమైతే అందుకు కారణమైన వారు నెత్తురు కక్కుకుని చావాలని వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నాను అన్నారు. ఆరోపణలు అబద్ధం అయితే ఆ వెంకటేశ్వరస్వామే చంద్రబాబును శిక్షిస్తాడు అన్నారు.
Stray Dogs Attack: కరీంనగర్లో వీధి కుక్కల స్వైర విహారం, మహిళా కాలేజీ సమీపంలో ఓ మహిళపై దాడి చేసిన వీధి కుక్కలు..వైరల్ వీడియో
Arun Charagondaకరీంనగర్లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. మహిళా కళాశాల సమీపంలో ఓ మహిళపై దాడి చేశాయి వీధి కుక్కలు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. సీసీ టీవీ వీడియో వైరల్గా మారింది.
Theft In Saibaba Temple: అనకాపల్లి సాయిబాబా గుడిలో చోరి, వెండి కిరీటాన్ని దొంగలించిన దొంగ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు..వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా చోడవరంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. వెండి కిరీటం, ఓ వెండి విగ్రహం, సుమారు 100 తులాల ఆభరణాలను దొంగ ఎత్తుకెళ్లాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Tirupati Laddu Controversy : ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ, ఇదంతా చంద్రబాబు కుట్రేనని వెల్లడి, వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధానిని కోరిన జగన్
Arun Charagondaతిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఏపీ మాజీ సీఎం జగన్. తిరుపతిలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం అంతా చంద్రబాబు కుట్రలో భాగమని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోడిని కోరారు జగన్.
Nagarjuna Sagar Canal: సాగర్ కాల్వకు మరోసారి గండి, నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు..వీడియో ఇదిగో
Arun Charagondaఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు పడిన గండికి ఇటీవలె మరమ్మతులు చేశారు అధికారులు. నీటిని విడుదల చేయగా తిరిగి అదే చోట గండి పడింది. దీంతో నీటి సరఫరాను నిలిపివేశారు అధికారులు.
Pawan Kalyan On Tirupati Laddu: చర్చి, మసీదు మీద ఇలానే జరిగితే ఉరుకుంటారా?,హిందువుల ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరూ మాట్లాడకూడదా, పవన్ ఫైర్
Arun Charagondaతిరుపతి లడ్డూ వ్యవహరంపై తనదైన శైలీలో స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మసీదు మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేస్తారు, గ్లోబల్ న్యూస్ అయిపొద్ది, కానీ హిందువుల ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరూ మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు.
MP Konda Vishweshwar Reddy: నేవీ రాడార్ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు సోయిలేదు, దీనివల్ల ఎవరికీ నష్టం లేదు, అడ్డుకోవద్దన్న చేవెళ్ల ఎంపీ
Arun Charagondaవికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు సోయే లేదు అన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. దామగుండం చెట్లను నరికితే ముసి నదికి ముప్పంటుండ్రు.. దామగుండం లో పడే నీరు చుక్కకూడా ముసి లోకి పోదు.. కాగ్నా లోకి వెళ్తుందన్నారు. నేవీ రాడార్ దేశ భద్రతకు సంబంధించిన విషయం ఎవరు అడ్డుకొవద్దు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.