రాష్ట్రీయం

Viral Video: శభాష్ జూపల్లి...రోడ్డు పక్కన పడి ఉన్న ఫిట్స్ వచ్చిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి..వీడియో వైరల్

sajaya

హైదరాబాద్ నుండి కొల్లాపూర్ వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం రాయికల్ టోల్ ప్లాజా దగ్గర ఫిట్స్ వచ్చి ఒక వ్యక్తి కింద పడిపోవడం గమనించిన మంత్రి జూపల్లి కారులో నుంచి దిగి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చి తన అనుచరులతో బాధితుడిని హాస్పిటల్‌కి తరలించారు.

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో వందేభారత్ రైలు.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో రైలు.. 12న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం

Rudra

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. ఏపీ, తెలంగాణ మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రెండో వందేభారత్ కు రైల్వే బోర్డు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Snake in Lord Shiva Temple: రాజరాజేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలోకి నాగేంద్రుడు.. శివలింగం చుట్టూ ప్రదక్షిణలు.. నిర్మల్ లో ఘటన

Rudra

నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలం గొడిసేర్యాల శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలో శుక్రవారం అర్ధరాత్రి నాగేంద్రుడు దర్శనమిచ్చాడు. గర్భగుడిలో పుట్ట ఉండగా.. ఏటా మూడు, నాలుగుసార్లు కనిపిస్తుంది.

KTR Letter To CM Revanth Reddy: ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమ‌లు చేయండి! లేక‌పోతే ప్ర‌జ‌లకు క్ష‌మాప‌ణ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

VNS

ఈ మేరకు ఆయన శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) కేటీఆర్‌ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రస్తుత మంత్రులు గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని.. లేదంటే గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

TDP-Jana Sena-BJP Alliance Official: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫార్మ్ చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్..

sajaya

వచ్చే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీల ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు.

Indira Kranthi Scheme: తెలంగాణ మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్, మ‌రో హామీ అమ‌లు కోసం ముహూర్తం ఖ‌రారు, ఈ నెల 12న ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

VNS

దీని ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం లభిస్తుందన్నారాయన. రాష్ట్రంలోని ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు.

TDP, BJP, Jana Sena Alliance: ఈ నెల 17న మూడు పార్టీల ఉమ్మడి సభకు ప్రధాని మోదీ రాక..5 సంవత్సరాల తర్వాత మరోసారి NDA కూటమిలోకి టీడీపీ

sajaya

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో అమిత్‌ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

TDP-Janasena-BJP Alliance: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుదిరిన పొత్తు..అమిత్‌ షాతో ముగిసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ.. ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన చేసిన ఎంపీ కనకమేడల..

sajaya

శనివారం కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు గంట పాటు జరిగింది. మూడు పార్టీల మధ్య లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం అందుతోంది.

Advertisement

Good News for TSRTC Employees: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటన.. 2017 పీఆర్సీని పూర్తిస్థాయిలో ఇవ్వాలని నిర్ణయం

sajaya

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Bank Employees: బ్యాంక్‌ ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు 17% పెంపు.. ఐదు రోజులే పని.. ఐబీఏ, యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం

Rudra

బ్యాంక్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17 శాతం పెంచే ప్రతిపాదనకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ), బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్లు తాజాగా ఒక అంగీకారానికి వచ్చాయి.

Times Now-ETG Research Survey: లోక్ సభ ఎన్నికల్లో జగన్ పార్టీ హవా.. ఏపీలో వైసీపీకి 21-22 సీట్లు... టీడీపీ, జనసేన కూటమికి 4 సీట్లు.. తెలంగాణలో కాంగ్రెస్ కు 8-10, బీజేపీకి 4- 6, బీఆర్ఎస్ కు 2-4 సీట్లు.. దేశవ్యాప్తంగా మొత్తంగా ఎన్డీయేకు 358-398 సీట్లు.. ఇండియా కూటమికి 110-130.. టీఎన్-ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడి

Rudra

మరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ సత్తా చాటుతుందని కాంగ్రెస్ సత్తా చాటనుందని టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది.

Andhra Pradesh Elections 2024: ఆ ఆరు ఎంపీ సీట్లు మాకిస్తే పొత్తుకు సై అంటున్న బీజేపీ పెద్దలు, 4 పార్లమెంట్ స్థానాలు ఇస్తామంటున్న టీడీపీ

Hazarath Reddy

తాజా సమాచారం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఆరు పార్లమెంట్ స్థానాలు రాజమండ్రి, నరసాపురం, వైజాగ్, విజయవాడ, హిందూపురం, అరకు స్థానాలను బీజేపీ కోరుతోంది. అయితే, టీడీపీ మాత్రం రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు ఇస్తామని బీజేపీకి ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Fishermen Protest in Kakinada: కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, అరబిందో పైప్‌ లైన్‌ తీయాలంటూ పెట్రోలు పోసుకొని మత్స్యకారుల ఆందోళన

Hazarath Reddy

ధర్నా చేపట్టి శుక్రవారంకి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు రాజకీయ నాయకుల్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ బోట్లుకి తామే నిప్పంటించుకొని మత్స్యకారులు తీవ్ర నిరసన తెలిపారు.

Mahashivratri Greetings: జగమంతా శివమయం. నేడే మహాశివరాత్రి. ఈ పర్వదినం నాడు మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా గ్రీటింగ్స్ తెలియజేయండి. మీ కోసం ఫోటోలు ఇవిగో!

Rudra

జగమంతా శివమయం. నేడే మహాశివరాత్రి. ఈ పర్వదినం నాడు మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా గ్రీటింగ్స్ తెలియజేయండి. మీ కోసం ఫోటోలు ఇవిగో!

Mahashivratri Celebrations 2024: అంతటా శివోహం.. శివన్నామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

Rudra

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Andhra Pradesh Elections 2024: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌, అధికారికంగా ప్రకటించిన సీఎం జగన్ టీం

Hazarath Reddy

మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ Simhadri Chandrasekhar పేరును తాజాగా వైసీపీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని గురువారం సాయంత్రం ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు.

Advertisement

TS SSC Exam Date 2024 Out: తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు పదో తరగతి పరీక్షలు, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయ్యింది. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

Car Caught Fire Video: కారులో చెలరేగిన మంటలు, 8 మంది ప్రయాణికులు డోర్ తీసి బయటకు దూకడంతో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జగిత్యాల - కథలాపూర్ మండలం పోసానిపేట దగ్గర కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నఎనిమిది మంది ప్రయాణికులు కారు డోర్ తీసి బయటకు వచ్చారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అర్మూర్ నుండి వేములవాడ దర్శనానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Arani Srinivasulu Joins Janasena: జనసేనలో చేరిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తనకు టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆవేదన

Hazarath Reddy

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నేడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆరణి శ్రీనివాసులుకు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు.

Inter Student Suicide: షాకింగ్ వీడియో ఇదిగో, పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్న ఇంటర్ విద్యార్థిని

Hazarath Reddy

బాచుపల్లిలో ఉంటున్న కృష్ణవేణి(19) అనే అమ్మాయి రెండేళ్ల క్రితం ఏపీలో ఇంటర్ చదివింది.. ఒక పరీక్షలో తప్పడంతో ఏప్రిల్‌లో సప్లిమెంటరీ రాయాల్సి ఉండగా ఈసారి కూడా ఫెయిల్ అవుతాననే భయంతో బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.

Advertisement
Advertisement