రాష్ట్రీయం

Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, బీజేపీని తెలంగాణాలో ఒక్క సీటు కూడా గెలవనియ్యం, ఆ స్థానాల్లో బీజేపీని ఓడించే బలమైన పార్టీకి ఓటు వేస్తామని తెలిపిన తమ్మినేని వీరబద్రం

Hazarath Reddy

బీజేపీ గెలుపుకు అవకాశం ఉన్న ప్రతీ సీటును ఓడించడం మా లక్ష్యం. బీజేపీ ఓడిపోయే సీట్లలో ఎవరు ఓడించే వారైతే వాళ్లకు ఓటు వేస్తాం. అది కాంగ్రెస్ అయినా బీఆర్‌ఎస్‌ అయినా’ అని తమ్మినేని పేర్కొన్నారు. వీడియో ఇదిగో..

Sajjala Ramakrishna Reddy: వీడియో ఇదిగో, తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తామంటున్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బార్డర్‌లో ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రదేశ్‌లో కలుస్తామంటున్నారని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఎన్నికల సర్వేలో పోలవరం ముంపు మండలాలతో పాటుగా సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు మేము మళ్లీ ఏపీకి వస్తామని తెలిపినట్లు సజ్జల తెలిపారు.

Telangana Assembly Election 2023: ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే రుణ మాఫీ డబ్బులు ఇప్పుడే వేస్తాం, సీఎం కేసీఆర్ వ్యాఖ్యల వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఎన్నికల కోడ్ వల్ల రైతు రుణ మాఫీ ఆగింది.. కాంగ్రెస్ నాయకులు ఆపాలని ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే రుణ మాఫీ ఇప్పుడే వేస్తం. లేదంటే ఎన్నికలు అయిన తర్వాత మరునాడు నుండే రుణ మాఫీ డబ్బులు అకౌంట్లో వేస్తాం - సీఎం కేసీఆర్

Chandrababu Health Update: ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు, టీడీపీ అధినేతకు వైద్య పరీక్షలు పూర్తి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఆయన బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏఐజీ వైద్యుల బృందం చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది.

Advertisement

Sand Irregularities Scam: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు, చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ, మొత్తం నలుగురి టీడీపీ నేతలపై కేసు నమోదు

Hazarath Reddy

చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఏపీఎమ్‌డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు.

Telangana Assembly Election 2023: ఆందోల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బాబూ మోహన్ పోటీ, 35 మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ మూడో జాబితా ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 35 మంది అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేసింది. అంతకుముందు రెండు జాబితాల్లో 53 మందిని బీజేపీ ప్రకటించింది. ముగ్గురు ఎంపీలు కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

Telangana Shocker: భార్యతో వివాహేతర సంబంధం, సీఐ మర్మాంగాలు కోసేసిన కానిస్టేబుల్, మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్‌, సీఐపై దాడికి పాల్పడ్డాడు. అతని మర్మాంగాలు కోసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం.

Telangana Assembly Elections 2023: చంద్రబాబు ర్యాలీ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు షాక్, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కేసు నమోదు

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 531\2023 కేసు నమోదైంది.

Advertisement

25th ICID Congress Plenary: కరువును తరిమి కొట్టడానికి ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం, నీటి పారుదల రంగంపై సదస్సులో సీఎం జగన్, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

విశాఖలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్‌ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

IT Raids in Hyderabad: కాంగ్రెస్ నేతల ఇండ్లలో ఐటీ దాడులు, మహేశ్వరం టికెట్ కోసం కోట్లు ఇచ్చారన్న ఆరోపణలతో దాడులు ముమ్మరం, కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఇంట్లోనూ తనికీలు

VNS

కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డికి (Parijatha Nasimhareddy) చెందిన బాలాపూర్ లోని నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బడంగ్పేట్ మేయర్ గా ఉన్న పారిజాత కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం (Maheswaram) నియోజకవర్గం టికెట్ ఆశించారు. అదేవిధంగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ (KLR) నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Group 1 & 2 Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్-1లో 100 పోస్టులు, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీకి ఈ నెల చివరలో నోటిఫికేషన్‌

Hazarath Reddy

ఏపీలో ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్‌లు ఇస్తామని, గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Prabhakar Reddy Attack Case: కొత్త ప్రభాకర్‌రెడ్డి హత్యాయత్నం కేసు, నిందితుడికి 14 రోజులు రిమాండ్, మీడియాకు వివరాలను అందించిన సీపీ శ్వేత

Hazarath Reddy

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ( MP Prabhakar Reddy )పై ఈ నెల 30వ తేదీ రోజున సూరంపల్లిలో కత్తితో నిందితుడు రాజు దాడి చేసిన సంగతి విదితమే. ఈ కేసుపై సీపీ శ్వేత ( CP Swetha ) సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియాకు వివరాలను అందజేశారు

Advertisement

Telangana Assembly Elections 2023: సన్నాసి అంటూ డీకే శివకుమార్‌పై సీఎం కేసీఆర్ ఫైర్, ఇల్లందు బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోస‌మే పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కుల కోస‌మే పోరాడే పార్టీ అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

Telangana Assembly Elections 2023: దళిత బంధు తెచ్చిన మొగోడు ఎవరైనా ఉన్నారా? సత్తుపల్లి బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని ,ప్రతీసారీ దళితులు మోసానికి గురయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు

Telangana Elections 2023: వీడియో ఇదిగో, ఎర్ర‌వల్లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌‎లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో ఈ యాగానికి ఈ రోజు అంకురార్పణ జరిగింది

Telangana Elections 2023: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్ రోడ్లపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, డబల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సెటైర్

Hazarath Reddy

డబుల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రోడ్లపై సెటైర్ వేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకొని తెలంగాణ విడిపోతే కటిక చీకటి అవుద్ది అన్నాడు. ఇప్పుడు మన దగ్గర వెలుగు జిలుగులు ఉన్నాయి.. మనల్ని శపించినోళ్లు చీకట్లో ఉన్నారు అంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Telangana Elections 2023: వీడియో ఇదిగో, తెలంగాణ ప్రభుత్వంపై హీరో నాగార్జున ప్రశంసలు, హైదరాబాద్ నగరాన్ని కొనియాడిన హీరో..

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కేటిఆర్‌ను హీరో నాగార్జున మెచ్చుకున్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుగా హైదరాబాద్‌ నగరాన్నే ఎంచుకుంటున్నాయని దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వమే అని నాగార్జున కొనియాడారు.

YSR Awards 2023: విజయవాడలో ఘనంగా YSR అవార్డుల ప్రదానోత్సవం, 27 మందికి వైఎస్సార్ అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్’ అవార్డులు అందజేసింది. నేడు(నవంబర్‌1) ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌ చేతుల మీదుగా వివిధ రంగాలకు 27 మంది ఒక్కొక్కరిగా అవార్డులు స్వీకరించారు.

Janta Ka Mood Survey: 75 సీట్లతో మళ్లీ అధికారంలోకి కేసీఆర్‌, తెలంగాణ ఎన్నికలపై జనతా కా మూడ్ సర్వే విడుదల, ఎవరెవరికి ఎన్ని సీట్లంటే..

Hazarath Reddy

ప్రముఖ భారతీయ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ జనతా కా మూడ్ (జేకేఎం) తన 'తెలంగాణ 2023 ఎన్నికల సర్వే'ని బుధవారం ఢిల్లీలో విడుదల చేసింది. ఈ సర్వేలో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం అని తేల్చింది.

Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నెలా 200 యూనిట్లు ఉచిత విద్యుత్, కొల్లాపూర్ భేరీ సభలో రాహుల్ గాంధీ

Hazarath Reddy

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ కేవలం రూ.500 లకే అందిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం చేస్తామన్నారు. గృహ జ్యోతి స్కీమ్ కింద ప్రతి నెలా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.

Advertisement
Advertisement