తెలంగాణ
PM Modi in Ujjain Mahankali Temple: సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు (వీడియో)
Rudraతెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
Director Krish: ముందస్తు బెయిలు పిటిషన్‌ ను ఉపసంహరించుకున్న దర్శకుడు క్రిష్‌
Rudraరాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్ కేసులో నిందితుడైన సినీ దర్శకుడు క్రిష్‌ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ ను సోమవారం ఉపసంహరించుకున్నారు.
Insects in Food: పిల్లలు తినే భోజనంలో పురుగులు.. హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత (వీడియో వైరల్)
Rudraహైదరాబాద్ శివారులోని గండి మైసమ్మలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మార్ఈసీ క్యాంపస్‌ లోని క్యాంటీన్ లో విద్యార్థులకు వడ్డించిన అన్నం, స్వీట్‌ లో పురుగులు కనిపించాయి.
Beer Health Benefits: లైట్ బీరు తాగితే.. గుండె జబ్బులు గాయాబ్.. కిడ్నీలో రాళ్లు కూడా ఉండవట.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraమితంగా బీర్ తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందట. బీర్ ను అతిగా వాడకుండా.. ఒక గ్లాసు బీర్ తో జీవితాన్ని సులభంగా, ఆనందంగా గడపడానికి సాయపడుతుందట.
Kazipet Fire Accident: కాజీపేట రైల్వే స్టేషన్‌ లో అగ్నిప్రమాదం... ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు
Rudraఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్‌ లో ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Hyderabad Horror: మానవత్వమా? నువ్వెక్కడ? దేశాన్ని కాపాడే జవాన్ రోడ్డుపై తీవ్రగాయాలతో పడిఉన్నా పట్టించుకోని ప్రజలు.. హైదరాబాద్ నార్సింగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై హిట్‌ అండ్‌ రన్‌.. ప్రాణాలు వదిలిన జవాన్ కులాన్‌ (వీడియో)
Rudraహైదరాబాద్ నార్సింగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోరం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. ఓ ఆర్మీ జవాన్‌ ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన జవాన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.
Andhra Pradesh Elections 2024: తాజా సర్వే.. ఏపీలో మళ్ళీ వైసీపీదే అధికారం, అయితే ఎంపీ సీట్లు తగ్గే అవకాశముందని తెలిపిన ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే
Hazarath Reddyరానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. జగన్ పార్టీ- చంద్రబాబు పార్టీ మధ్య పోటీ ఉండవచ్చని అంచనా వేసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు, తెలుగుదేశం పార్టీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది.
CM Revanth Reddy on English: గుంటూరు, గుడివాడ వెళ్లి కార్పోరేట్ స్కూళ్లలో చదవలేదు, తనకు ఇంగ్లీష్ రాదనే వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
Hazarath Reddyతనకు ఇంగ్లిష్ రాదని కొంతమంది ఎగతాళి చేస్తున్నారని... కానీ తాను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి... ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Kesineni Nani on Prashant Kishore: చెప్పినవన్నీ జరగడానికి ప్రశాంత్ కిశోర్ ఏమీ దేవుడు కాదు, కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..
Hazarath Reddyవిజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశాంత్ కిశోర్ అంచనాలపై స్పందించారు. ప్రశాంత్ కిశోర్ చెప్పినవి పట్టించుకోవాల్సి అవసరం లేదని అన్నారు. ఇటీవల ఆయన చెప్పినవి ఏవీ నిజం కాలేదని అన్నారు.తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు... కానీ ఓడిపోయింది.
Telangana Elections 2024: ఖమ్మం లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత, ఖమ్మం, మహబూబాబాద్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ
Hazarath Reddyఖమ్మం లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, అలాగే మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవితే మరోసారి పోటీ చేస్తారని తెలుస్తోంది. సోమవారం ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ముఖ్యనేతల భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది.
Babu Mohan Joins Praja Shanti Party: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్ట అధ్యక్షుడు కేఏ పాల్
Hazarath Reddyసినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు.కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . ఇటీవలే బాబూ మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది.
Techie Dies of Heart Attack: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో టీసీఎస్ సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, హైదరాబాద్‌లో విషాదకర ఘటన
Hazarath Reddyహైదరాబాద్ - టీసీఎస్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే సంజయ్ భార్గవ్(25).. ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. ఫిట్స్ కూడా రావడంతో ఫ్రెండ్స్ అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
PM Modi on Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందని తెలిపిన ప్రధాని
Hazarath Reddyకాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతుంది. గతంలో మీరు తిన్నారు. ఇప్పుడు మేము తింటాం అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదని మండిపడ్డారు.
PM Modi Telangana Visit: దేశంలో 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమే, ప్రతిపక్షాల వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ప్రధాని మోదీ, నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని వెల్లడి
Hazarath Reddyఇప్పుడు 2024 ఎన్నికలకు తమ అసలు మ్యానిఫెస్టోను బయటపెట్టారని.. వారి వంశ రాజకీయాలను ప్రశ్నిస్తే.. మోడీకి కుటుంబం లేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది.. దేశ ప్రజలకు నేను బాగా తెలుసు..అర్థం చేసుకుంటారని తెలిపారు. దేశ ప్రజల కోసం బతుకుతానని, నా జీవితంలో ప్రతి క్షణం నీ కోసమే,
PM Modi Telangana Visit: వికాస్ ఉత్సవ్ జరుపుకోవడానికే తెలంగాణకు వచ్చాను, ఆదిలాబాద్‌ బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగం
Hazarath Reddyప్రధాని మోదీ తన ప్రసంగంలో, “వారు (ప్రతిపక్షాలు) ఎన్నికల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నిన్న మొత్తం రోజంతా నేను భారత ప్రభుత్వ మంత్రులు, సీనియర్ సెక్రటరీలు, దాదాపు 125 మందితో కూడిన టాప్ టీమ్, అధికారులందరితో కూర్చున్నాను
PM Modi Telangana Visit: ఆదిలాబాద్‌లో రూ.56 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంఖుస్థాపన, రాష్ట్ర అభివృద్ధికి పెద్దన్నలా సహకరించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyప్రధాని మోదీ తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆదిలాబాద్‌లో రూ. 56,000 కోట్లకు పైగా బహుళ అభివృద్ధి కార్యక్రమాలను (Multiple Development Projects) ప్రారంభించి, శంకుస్థాపన చేశారు
Telangana Shocker: హైదరాబాద్‌లో పాప మిస్సింగ్, జహీరాబాద్ బస్టాండ్‌లో కిడ్నాప్ చేసిన మహిళను పట్టుకుని చిన్నారిని కాపాడిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేటలో కిడ్నాప్‌నకు గురైన తొమ్మిది నెలల పాపను జహీరాబాద్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. పాతబస్తీలోని మాదన్నపేటలో పాపను కిడ్నాప్‌ చేశారు. ఓ మహిళ పాపను కిడ్నాప్‌ చేసి చంచల్ గూడ నుండి ఎంజీబీఎస్‌వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
Telangana: చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారంటూ హిజ్రాలను చితకబాదిన కాలనీవాసులు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyవికారాబాద్ జిల్లా తాండూరులో శివాజీ చౌక్ ప్రాంతంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే ఆరోపణలతో హిజ్రాలను వాల్మీకి కాలనీవాసులు చితకబాదారు. ఈ ఘటన అనంతరం కాలనీవాసులు, హిజ్రాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Telangana Road Accident: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు చిన్నారులతో సహా 5 మంది అక్కడికక్కడే మృతి, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున కొత్తకోట పరిధి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
Actress Soumya Shetty Arrest: రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో బంగారం, నగదు చోరీ చేసిన సినీ నటి సౌమ్య శెట్టి.. అనంతరం గోవాలో జల్సాలు.. ఎట్టకేలకు పోలీసుల అరెస్టు
Rudraబంగారం, నగదు చోరీ కేసులో టాలీవుడ్ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు.