తెలంగాణ
Cash For Vote Case: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, హైకోర్టులోనే దీన్ని పరిష్కరించుకోవాలంటూ కేసు క్లోజ్ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyఓటుకు కోట్లు కేసులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈరోజు(మంగళవారం) విచారణ చేపట్టింది.
Telangana Politics:: వీడియో ఇదిగో, నేను తెలంగాణ వస్తే కేసీఆర్ నన్ను కలిసేందుకు ధైర్యం చేయడం లేదు, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyకేసీఆర్ మీద ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ఎన్డీయేలో చేరుతానని కేసీఆర్ నా దగ్గరికి వచ్చాడు... కానీ నేను ఒప్పుకోలేదు.తెలంగాణ సీఎంగా తాను రాజీనామా చేసి.. కేటీఆర్‌ను సీఎం చేస్తానని చెప్పాడు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని నన్ను కోరాడు.
PM Modi Telangana Tour: వీడియో ఇదిగో, తెలంగాణను రక్షించాలంటే గుజరాతీల వల్లే అవుతుంది, అందుకే నేను వచ్చానని తెలిపిన ప్రధాని మోదీ
Hazarath Reddyతెలంగాణను రక్షించాలంటే గుజరాతీల వల్లే అవుతుంది. 1948లో నిజాం నుండి తెలంగాణను విడిపించడానికి ఒక గుజరాతీగా వల్లభాయ్ పటేల్ వచ్చాడు. ఇప్పుడు తెలంగాణను కాపాడడానికి మరో గుజరాతీ బిడ్డగా నేను వచ్చానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వీడియో ఇదిగో..
Telangana: ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్, ఐదు శాతం ఐఆర్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, పీఆర్‌సీ కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు తీపి వార్త చెప్పింది. వేతన సవరణ కమిటీ (పీఆర్‌సీ)ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్‌సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎన్‌.శివశంకర్‌ను, సభ్యుడిగా బి.రామయ్యను నియమించింది. ఆరు నెలల్లోగా వేతన సవరణపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి సూచించింది.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, నేటి నుంచి ఈసీ 3 రోజుల పర్యటన, గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలొ ఈసీ వేగం పెంచింది. ఇందులో భాగంగా నేటి(మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించనున్నారు.
Times Now-ETG Survey: టైమ్స్‌ నౌ తాజా సర్వే ఫలితాలు ఇవిగో, ఏపీలో మళ్లీ జగన్ సర్కారే, తెలంగాణలో కారు జోరు, కేంద్రంలో మళ్లీ ఎన్టీయే ప్రభంజనం అంటున్న సర్వే..
Hazarath Reddyదేశంలో 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికార ఎన్డీయే మరోసారి ఘన విజయం సాధిస్తుందని జాతీయ వార్తా సంస్థ Times Now-ETG Survey తాజా సర్వేలో వెల్లడయ్యింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 307 స్థానాలు గెలుచుకుంటుందని తెలియజేసింది
Siddipet Train: నేటి నుంచి సిద్దిపేట-కాచిగూడ మధ్య రైల్వేసేవలు.. ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
Rudraసిద్దిపేటలో రైలు కూత వినిపించనున్నది. మంగళవారం మధ్నాహ్నం 3 గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్‌ లో మంత్రి హరీశ్‌రావు రైలును ప్రారంభించనున్నారు.
Australia Parrot: రూ.1.30 లక్షల విలువైన ఆస్ట్రేలియా చిలుక కనిపించడం లేదని జూబ్లీహిల్స్ వ్యాపారి ఫిర్యాదు.. ఒక్క రోజులో వెతికితెచ్చిన పోలీసులు.. ఎలా కనిపెట్టారంటే??
Rudraఆస్ట్రేలియాకు చెందిన రాక్టో అనే 4 నెలల వయసున్న తన చిలుక ఎక్కడికో ఎగిరిపోయిందని, ఆ చిలుకను రూ.1.30 లక్షలు పెట్టి కొనుగోలు చేశానని ఫిర్యాదు చేసిన వ్యక్తికి అతడి చిలుకను ఒక్క రోజులో జూబ్లీహిల్స్ పోలీసులు పట్టితెచ్చి ఇచ్చారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 32 స్థానాలివిగో, దాదాపు 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని తెలిపిన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌ రెడ్డి
Hazarath Reddyత్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన(Janasena) సిద్ధమైంది. రాష్ట్రంలో 32 చోట్ల పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పోటీచేసే స్థానాల జాబితాను సోమవారం సాయంత్రం విడుదల చేసింది.
Telangana Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, సూపర్ మార్కెట్లో చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతే షాక్ కొట్టి చిన్నారి మృతి
Hazarath Reddyనిజామాబాద్ - నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి N సూపర్ మార్కెట్ వెళ్ళగా ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి రుషిత ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ డోర్ తీయగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
Telangana Shocker: తల్లిదండ్రులు పెయింటర్‌ను పెళ్లి చేసుకోమన్నారని ఎంబీఏ యువతి ఆత్మహత్య, జీడిమెట్లలో విషాదకర ఘటన
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. జీడిమెట్లలో ఈ ఘటన వెలుగు చూసింది.
NIA Rides in Telugu States: ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు.. పౌరహక్కుల నేతల ఇండ్లలో సోదాలు
Rudraఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌ తోపాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 28న శ్రీవారి ఆలయం మూసివేత.. నేడు ఎస్ఎస్‌డీ టోకెన్ల రద్దు.. కారణం ఇదే!
Rudraఈ నెలాఖరులో తిరుమల దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు అలర్ట్. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటలపాటు మూతపడనుంది.
TSRTC Special Buses: దసరాకు ఊరెళ్తున్నారా? ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్, ఏకంగా 5265 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన టీఎస్‌ఆర్టీసీ, స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ చార్జీలే!
VNSదసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు (Special Buses For Dasara) సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
Viral Video: బైక్ నడుపుతూ సీటు మీద నిల్చున్నాడు..ఇంతలో ఏం జరిగిందో ఈ వీడియోలో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గువరడం ఖాయం..
ahanaతాజాగా ఆయన పోస్ట్ చేస్తున్నటువంటి ఒక వీడియోలో బైక్ స్టంట్ చేసినటువంటి వ్యక్తి తీవ్రంగా యాక్సిడెంట్ పాలైనట్టు కనిపించింది.
PM Modi In Telangana: మహబూబ్‌నగర్‌ ప్రధాని మోడీ పర్యటనలో వరాల జల్లు, తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపై మోడీ కీలక ప్రకటన..
ahanaమహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రూ.13,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్. వరంగల్‌-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు.
Viral Video: ఖమ్మం జిల్లా తల్లంపాడు జాతీయ రహదారి పై జరిగిన కారు యాక్సిడెంట్ వీడియో చూస్తే గుండె గుభేల్ అనడం ఖాయం..
ahanaఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది. ఘటనలో వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొనడం కారణంగా కారు ముందు భాగం నుజ్జు. నుజ్జు అయ్యింది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
DJHS: తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్లస్థలాల కోసం డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ నిరంతరాయ కృషి.. సీఎస్ శాంతి కుమారితో డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధుల భేటీ.. ఇండ్లస్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి.. తనవంతు ప్రయత్నం చేస్తానని హామీనిచ్చిన సీఎస్
Rudraతెలంగాణ జర్నలిస్టులకు ఇండ్లస్థలాల కోసం డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ నిరంతరాయంగా కృషి చేస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధుల బృందం కలవడం జరిగింది.