తెలంగాణ

Telangana Assembly Session: ప్రజలు అన్నీ చూస్తున్నారు, మూడు గంటల కరెంట్ ఎవరు ఇస్తామన్నారో.. 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తున్నారో వారికి తెలుసన్న మంత్రి కేటీఆర్

Hazarath Reddy

3 గంటల కరెంట్ ఎవరు ఇస్తామన్నారో.. 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తున్నారో రైతులు అన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమెరికా పోగానే 3 గంటల కరెంట్ చాలు అంటూ మనసులో బైట పెట్టిండు. రెండు సార్లు రుణ మాఫీ చేసి, 73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్. 5 లక్షలు రైతు భీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు తెలంగాణలో - మంత్రి కేటీఆర్

Telangana Assembly Session: 24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేస్తారు, వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు

Hazarath Reddy

24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేస్తారు.. 24 గంటల కరెంట్ వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు 24 గంటల కరెంట్ వద్దు అంటున్నాడు, కాంగ్రెస్ ఉప నాయకుడేమో చెక్ డ్యాంలు వద్దు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అంటున్నాడు, ధరణి రద్దు చేయాలని ఇంకో కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు - మంత్రి హరీష్ రావు

Hyderabad Shocker: గే యాప్ ద్వారా ఛాటింగ్, సెక్స్ కోసం రూంకి పిలిచి నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన రౌడీ షీటర్, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

దోపిడీకి పాల్పడి గతంలో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద జైలుకెళ్లిన హిస్టరీ షీటర్ కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

Accident Video: అర్థరాత్రి బంజారాహిల్స్‌లో కారు బీభత్సం, ఆడి కారుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలును ఢీకొట్టిన కారు

Hazarath Reddy

అర్థరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్డు నంబర్ 12 సమీపంలో రోడ్డు ప్రమాదం.అతి వేగంగావస్తున్న ఓ కారు.. రెండు ద్విచక్ర వాహనాలు, ఆడి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై స్థానికులు దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు తరిమికొట్టారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Budvel Land Sale Notification Out: కోకాపేట రికార్డు బుద్వేల్ బద్దలు కొడుతుందా, ఎకరా కనీస ధర రూ. 20 కోట్లుగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, బుద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ జారీ

Hazarath Reddy

హైదరాబాద్ - కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు వచ్చిన తరుణంలో అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని ద్వారా విక్రయించనున్నారు.

Kokapet Real Estate: తెలుగు రాష్ట్రాల చరిత్రలో రికార్డ్... కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు.. ఈ-వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.2500 కోట్లకు పైగా ఆదాయం?!

Rudra

తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇదో రికార్డ్ గా చెప్పొచ్చు. హైదరాబాద్ లోని కోకాపేటలో ఎకరా భూమి రూ.100 కోట్లకు పైగా పలికింది.

Hyderabad Shocker: ఒత్తైన జుట్టుతో భర్తకు అందంగా కనపడాలనుకున్న భార్య.. బ్యూటీ పార్లర్ కు పయనం.. చివరకు బట్టతలగా దర్శనం.. కాపురానికే ఎసరు.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటన.. అసలేం జరిగింది??

Rudra

కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన.. ఒత్తైన జుట్టు కోసం ఆశపడిన ఓ వివాహితకు చేదు అనుభవం మిగిలింది. బ్యూటీ పార్లర్‌ నిర్వాహకులు మిడిమిడి జ్ఞానంతో చేసిన పనికి అప్పటిదాకా ఉన్న జుట్టు కూడా రాలిపోయి బట్టతల మిగిలింది.

Telangana Assembly Session 2023: మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం, తొలి రోజు మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతమైన ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశాలు మొదలు కాగా.. ముందుగా కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటించారు.

Advertisement

Telangana Crop Loan: తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభం, నేడు రూ.41 వేల లోపు రైతు రుణాలు మాఫీ, తొలిరోజు 44,870 మంది రైతుల‌కు ల‌బ్ధి

kanha

తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. రుణ‌మాపీ చెల్లింపుల‌కు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుద‌ల‌య్యాయి. గురువారం రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మ‌ధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి.

Chikoti Praveen: ఢిల్లీలో బిజెపి నేతలతో భేటీ అయిన గ్యాంబ్లింగ్, క్యాసినో వ్యాపారి చికోటి ప్రవీణ్..ఈడీ కేసుల నేపథ్యంలో

kanha

క్యాసినో వ్యాపారి చీకోటి ప్రవీణ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ఆయన బీజేపీ అగ్రనేతలను వరుసగా కలుస్తున్నారు. పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ నేత ఎంపీ బండిసంజయ్ ను కలిశారు. అలాగే బీజేపీ నేత డీకే అరుణతో సైతం చీకోటి ప్రవీణ్ భేటీ అయ్యారు.

Telangana Assembly: అసెంబ్లీలో ఈటలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మంత్రి కేటీఆర్

kanha

ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు దగ్గరికి వెళ్లి మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించి, ఆలింగనం చేసుకున్న తరువాత వీరిద్దరూ పలు అంశాలపై 10 నిమిషాలు మాట్లాడుకున్నారు.

BTech Student Commits Suicide: బీటెక్ చదివినా ఉద్యోగం రాలేదని బావిలో దూకి విద్యార్థి ఆత్మహత్య, సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి మండల పరిధిలోని విఠలాపూర్‌లో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం దొరకడం లేదని బిటెక్ చదివిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు

Advertisement

Jupally Krishna Rao Joins Congress: కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు,మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి తదితరులు

Hazarath Reddy

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎంపీపి మేఘా రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. చేరికల కార్యక్రమానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే హాజరయ్యారు.

Telangana Assembly Sessions: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం, ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం తెలుపనున్న శాసనసభ, సమావేశాలు నిర్వహిస్తారనే అంశంపై ఇవాళ రానున్న క్లారిటీ

VNS

అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ఇవాల్టి నుంచి మొదలుకానున్నాయి. సమావేశాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభ నిర్వహణపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ఉభయసభలు (Assembly Session) మొదలవుతాయి.

Conjunctivitis Symptoms: కరోనా తర్వాత కండ్లకలక లక్షణాలు ఇవిగో, ఈ సింప్టమ్స్ కనిపించాయంటే వైరస్ వచ్చినట్లే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోండి

Hazarath Reddy

భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్లు ఎర్రబడి నీరు కారడం, కళ్లు మండటం, కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వానలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

CM KCR Crop Loan Waiver: రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, రేపటి నుంచి వ్యవసాయ రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..

kanha

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

Hero Naresh: కోర్టులో నటుడు నరేష్‌కి ఊరట, రెండో భార్య రమ్యరఘుపతి తన ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ కోర్టు ఆదేశం.

kanha

సినీ నటుడు నరేష్ తన రెండో భార్య రమ్య రఘుపతిని నరేష్ నివసించే నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది

Telangana: ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ ఫ్రూట్ మార్కెట్, 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తాం, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన

kanha

ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్. 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తాం. 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం. 16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం. 11.76 ఎకరాలలో పండ్ల ఎగుమతులకై ఎక్స్ పోర్టు జోన్. 56.54 ఎకరాల్లో రహదారులు. 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు - వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Jayasudha Joins BJP: బీజేపీలో చేరిన ప్రముఖ నటి జయసుధ, పేదలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతోనే బీజేపీని ఎంచుకున్నట్లు వెల్లడి, వీడియో ఇదిగో

Hazarath Reddy

ప్రముఖ తెలుగు నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరుల సమక్షంలో ఢిల్లీలో ఆమె కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. తరుణ్ చుగ్ కండువాను కప్పి పార్టీలోకి స్వాగతించారు.

Kid Dies in Accident: తీవ్ర విషాదం, తండ్రి కళ్ల ముందే కూతురు మీద నుంచి వెళ్లిన స్కూలు బస్సు, బాచుపల్లి రెడ్డీస్ ల్యాబ్‌ వద్ద ఘటన

Hazarath Reddy

నగరంలోని బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గుంతకు చిన్నారి బలైంది. గుంతలో బండి పడటంతో చిన్నారి ఎగిరి రోడ్డుపై పడింది. చిన్నారిపై నుంచి స్కూల్‌ బస్సు వెళ్లడంతో పాప అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారిని తన తండ్రి బండి మీద తీసుకెళ్తుండగా బాచుపల్లి పరిధిలో రెడ్డీస్ ల్యాబ్‌ వద్ద ఈ ఘటన జరిగింది.

Advertisement
Advertisement