Mahesh Lost Three Family Members: ఏడాదిలో ముగ్గురిని కోల్పోయిన మహేశ్ బాబు.. ఈ ఏడాది జనవరి 8న సోదరుడు రమేశ్‌బాబు..  సెప్టెంబరు 28న తల్లి ఇందిరాదేవి.. ఆ విషాదం నుంచి తేరుకోకముందే నేడు తండ్రి కృష్ణ మృతి
File (Credits: Sitara)

Hyderabad, Nov 15: టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు (Mahesh Babu) జీవితంలో ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏడాదిలో ఆయన ఏకంగా ముగ్గురు కుటుంబ సభ్యులను (Three Family Members) కోల్పోవడం అందరితో కన్నీళ్లు తెప్పిస్తోంది. జనవరి 8న మహేశ్ బాబు సోదరుడు, నటుడు, నిర్మాత రమేశ్‌బాబు (Ramesh Babu) కాలేయ సంబంధ వ్యాధితో మరణించారు. ఈ బాధ నుంచి ఆయన కోలుకోక ముందే ఆయన తల్లి ఇందిరాదేవి (Indiradevi) సెప్టెంబరు 28న అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.

ఇండియన్ జేమ్స్ బాండ్ ఇకలేరు.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం.. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. విషాదంలో అభిమానులు

ఆ విషాదం నుంచి మహేశ్ కోలుకోకముందే ఇప్పుడు ఆయన తండ్రి కృష్ణ (Krishna) కన్నుమూశారు. మహేశ్ జీవితంలో వరుసగా ఎదురవుతున్న ఈ విషాద ఘటనలు పలువురితో కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ కష్టకాలం నుంచి ఆయన త్వరగా బయటపడే మనో ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.