Malayalam Director Ali Akbar Quits Islam: ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి సంచలన నిర్ణయం తీసుకున్న మళయాల దర్శకుడు అలీ అక్బర్, బిపిన్ రావత్ మృతిపై వెల్లువెత్తిన సోషల్ ట్రోలింగ్ కు నిరసనగా నిర్ణయం..
Image Credit : Indus Scrolls

కొచ్చిన్, డిసెంబర్ 11:  ప్రముఖ మలయాళ దర్శకుడు అలీ అక్బర్ CDS జనరల్ బిపిన్ రావత్ విషాద మరణాన్ని వేడుకగా జరుపుకున్న వారికి నిరసనగా ఇస్లాంను విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని అలీ అక్బర్ ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు, ఇకపై తనకు , తన కుటుంబానికి ఇకపై మతం లేదని పేర్కొన్నాడు. సిడిఎస్ బిపిన్ రావత్ మరణాన్ని అపహాస్యం చేసిన ఇస్లాంవాదులను విమర్శిస్తూ అలీ అక్బర్ గతంలో ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు. ప్లాట్‌ఫారమ్‌లో వీడియోకు ద్వేషపూరిత వ్యాఖ్యలు రావడంతో అక్బర్ ఖాతా ఒక నెల పాటు నిలిపివేయబడింది. దీంతో దర్శకుడు మరో ఖాతా తెరిచి తాను ఇస్లాంను విడిచిపెడుతున్నట్లు ప్రకటించాడు. అక్బర్ మాట్లాడుతూ, “ఎమోజీలు పెట్టిన వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ఐదు నిమిషాల్లో, ఖాతా బ్లాక్ చేయబడింది. నేను దానిని అంగీకరించలేను, నేను దానితో ఏకీభవించలేను, కాబట్టి నేను నా మతాన్ని వదిలివేస్తున్నాను. నాకు లేదా నా కుటుంబానికి ఇకపై మతం లేదు. అదే నిర్ణయం.”

ఇక నుంచి తనను రామసింహన్ అని పిలవాలని అలీ అక్బర్ తెలిపారు. ‘‘కేరళ సంస్కృతికి కట్టుబడి హత్యకు గురైన రామసింహన్ పేరును తాను పెట్టుకున్నట్లు తెలిపాడు. 1947లో ఇస్లాం నుండి హిందూ మతంలోకి మారినందుకు రామసింహన్ , అతని కుటుంబాన్ని ఇస్లాంవాదులు చంపేశారు. రామసింహన్, అతని సోదరుడు దయాసింహం, దయాసింహన్ భార్య కమల, వారి వంట మనిషి రాజు అయ్యర్ , ఇతర కుటుంబ సభ్యులను మలప్పురం జిల్లాలోని మలపరంబలో ఇస్లామిక్ జిహాదీలు దారుణంగా నరికి చంపారు. ఆగష్టు 1947, స్వాతంత్ర్యానికి కేవలం రెండు వారాల ముందు. అలీ అక్బర్ తన భార్యతో చర్చించిన తర్వాత ఇస్లాంను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఇదిలా ఉంటే సిడిఎస్ బిపిన్ రావత్ మరణాన్ని అపహాస్యం చేసిన వ్యక్తుల పేర్లతో కూడిన చిత్రాన్ని కూడా అక్బర్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అలీ అక్బర్ స్థానిక మళయాల టీవీతో మాట్లాడుతూ దేశ వ్యతిరేక అంశాలకు వ్యతిరేకంగా తన నిరసనను తెలిపేందుకు, ఇస్లాంను విడిచిపెట్టాలనే తన నిర్ణయాన్ని వివరించారు. ముఖ్యంగా, ఆన్‌లైన్‌లో ఇస్లామిస్టుల వేడుకలను చూసిన తర్వాత అలీ అక్బర్ ఫేస్‌బుక్ వీడియో ద్వారా తన అభ్యంతరాలను లేవనెత్తారు.