New Delhi November 19:  భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుతున్నట్లే కనిపించినప్పటికీ, మరోసారి కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 11,106 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 459 మంది మృతిచెందారు. రెండు రోజుల క్రితం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఇవాళ మరోసారి పెరిగాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, మరణాలు 4,65,082కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,26,620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఊరట కలిగిస్తోంది.

కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళలో నిన్న 6,111 మంది కరోనా బారినపడ్డారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)