Mumbai, NOV 20: బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) తాతయ్య అయ్యారు. ఆయన గారాల పట్టి ఇషా అంబానీ (Isha Ambani) కవలలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చింది ఇషా అంబానీ. వారి పేర్లను కూడా ప్రకటించింది అంబానీ ఫ్యామిలీ. అబ్బాయికి కృష్ణ (Krishna) అని, అమ్మాయికి ఆదియా (Aadiya) అంటూ పేరు పెట్టారు. ఈ మేరకు అంబానీ ఫ్యామిలీ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. ఇషా అంబానీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు. ఆమెకు పిరమిల్ గ్రూప్ అధినేత విజయ్ తనయుడు ఆనంద్ పిరమల్ తో డిసెంబర్ 12, 2018న ఘనంగా వివాహం జరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)