Mumbai Feb 06: లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కన్నుమూశారు(Lata Mangeshkar Died). 92 ఏళ్ల వయస్సున్న లతా మంగేష్కర్....గత 29 రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో(Breach Candy Hospital) చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆమె....నెగెటివ్ వచ్చినప్పటికీ, నిమోనియా కారణంగా ఆరోగ్యం క్షీణించింది. అయితే మధ్యలో ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైంది.  కానీ రెండు రోజుల క్రితం మళ్లీ ఐసీయూలో వెంటిలేటర్‌ పై చికిత్స చేయించారు. ఆమె మరణాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ధృవీకరించారు. లతా మంగేష్కర్ మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)