MP Raghu Ramakrishnam Raju: సీఎం జగన్ నుంచి నాకు ప్రాణ హాని, పార్లమెంటు సభ్యులకు లేఖ రాసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ, లేఖలో ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన తనకు పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ తన సహచర పార్లమెంటు సభ్యులకు లేఖ రాశారు. 4 పేజీల లేఖలో వైసీపీ నేతలపైనా, ప్రత్యేకించి సీఎం జగన్పై ఆయన ఆరోపణలు గుప్పించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన తనకు పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ తన సహచర పార్లమెంటు సభ్యులకు లేఖ రాశారు. 4 పేజీల లేఖలో వైసీపీ నేతలపైనా, ప్రత్యేకించి సీఎం జగన్పై ఆయన ఆరోపణలు గుప్పించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్పైనే నరసాపురం లోక్ సభ స్థానం నుంచి రఘురామరాజు ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.
జగన్ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను విమర్శించిన నేపథ్యంలో పార్టీతో ఆయనకు దూరం పెరిగింది. ఈ క్రమంలో ఓ దఫా ఏపీ సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేయగా...కస్టడీలోనే పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారంపైనా ఆయన సహచర ఎంపీలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే తాజాగా జగన్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ మరోమారు ఎంపీలకు రఘురామరాజు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Letter to all my Esteemed Parliamentary Colleagues about the life threat that I’m having from Andhra Pradesh CM Mr. YS Jagan Mohan Reddy. pic.twitter.com/jDlA0YpULJ
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 7, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 07, 2022 06:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

