Pawan Kalyan Health Update: వైరల్ ఫీవర్ నుంచి కోలుకుంటున్న పవన్ కళ్యాణ్, ఈ నెల 31న జనవాణికి అంతా రెడీ, ఉభయ గోదావరి జిల్లా పర్యటనలో వైరల్ ఫీవర్ బారిన పడిన జనసేనాధినేత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడిన విషయం విదితమే. ఆయన జ్వరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవలే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పర్యటనలోనే పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడిన విషయం విదితమే. ఆయన జ్వరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవలే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పర్యటనలోనే పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. పవన్తో పాటు ఈ పర్యటనలో పాలుపంచుకున్న పలువురు పార్టీ నేతలు, పవన్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా వైరల్ ఫీవర్ సోకిందని ఆయన వెల్లడించారు.
పవన్కు వైరల్ ఫీవర్ సోకిన కారణంగా ఈ నెల 24న (ఆదివారం) నిర్వహించనున్న జనవాణిని రద్దు చేస్తున్నట్లు నాదెండ్ల ప్రకటించారు. తదుపరి జనవాణిని ఈ నెల 31న నిర్వహిస్తామని, ఏ ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జనం సమస్యలను సేకరించి ప్రభుత్వానికి పంపేందుకు జనవాణి పేరిట జనసేన ఇటీవలే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలో రెండు, భీమవరంలో ఓ జనవాణి కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ నెల 31న తదుపరి జనవాణి - JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/k9mWoMNt3Q
— JanaSena Party (@JanaSenaParty) July 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 20, 2022 09:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

