క్రికెట్

Jasprit Bumrah: వెన్ను నొప్పితో బుమ్రా.. భారత పేస్ దళపతి స్థానాన్ని భర్తీ చేయనున్న సిరాజ్

Jai K

సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు ప్రాక్టీస్‌ సందర్భంగా నడుం నొప్పి వచ్చిందని ఫిర్యాదు చేయడంతో బుమ్రాని మ్యాచ్‌ నుంచి తప్పించారు. తర్వాత సిరీస్ నుంచి కూడా తప్పించారు. బుమ్రా స్థానంలో సిరాజ్ ను ఎంపిక చేశారు.

Virat Kohli: అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. మధ్యలో ఫ్యాన్స్.. తర్వాత విరాటుడు ఏం చేశాడంటే?

Jai K

అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. ఇంతలో ఫ్యాన్స్ గోల.. ఆ ఫోన్ ను ఇటువైపు తిప్పి సందడి చేసిన కోహ్లీ..

Amit Mishra Pays Money to Fan: గర్ల్‌ ఫ్రెండ్‌తో డేట్ కోసం ఫ్యాన్‌కు డబ్బులు పంపిన క్రికెటర్, ట్విట్టర్‌లో డబ్బులు అడిగితే గూగుల్ పే చేసిన టీమిండియా లెగ్ స్పిన్నర్, రూ.300 అడిగతే రూ. 500 పంపి ఆల్‌ ది బెస్ట్ చెప్పిన మిశ్రా, అతను చేసిన పనికి నెటిజన్ల నుంచి వింత రియాక్షన్లు

Naresh. VNS

ఈ ట్వీట్‭తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్‭కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి (Google pay) 500 రూపాయలు పంపించాడు మిశ్రా. అనంతరం అది స్క్రీన్‭షాట్ తీసి ట్విట్టర్‭లో షేర్ చేశాడు. ‘‘అయిపోయింది, మీ డేట్‭కి ఆల్ ది బెస్ట్’’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli: రోజర్‌ ఫెదరర్‌‌పై ఉద్వేగపూరిత వీడియో, నీలాంటి గొప్ప అథ్లెట్‌ను నేనింతవరకు చూడలేదు అంటూ ఎమోషనల్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్

Hazarath Reddy

కోహ్లి.. ఫెదరర్‌ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ఏటీపీ టూర్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.ఇందులో.. ‘‘హల్లో రోజర్‌.. మాకు ఎన్నెన్నో మధురానుభూతులు, జ్ఞాపకాలు మిగిల్చిన నీకు ఇలా వీడియో ద్వారా విషెస్‌ చెప్పడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు తెలిసి ఒకే ఒక్కసారి నిన్ను నేను నేరుగా కలిశాను.

Advertisement

Suresh Raina Catch Video: సూపర్ వీడియో, ఆస్ట్రేలియా బ్యాటర్‌కి షాకిస్తూ దిమ్మదిరిగే క్యాచ్ పట్టిన సురేష్ రైనా, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా సంచలన క్యాచ్‌తో రైనా మరోసారి మెరిశాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ తరపున ఆడుతున్న రైనా సెమీఫైనల్‌-1లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

Virat Kohli: వైరల్ వీడియో, అనుష్కతో వీడియో కాల్‌లో ఉన్నా, నన్ను డిస్ట్రబ్ చేయకండి, అభిమానులకు వీడియో కాల్‌ చూపించిన కోహ్లీ, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

Hazarath Reddy

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌ విజయం అనంతరం రాత్రి తిరువనంతపురం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు టీమిండియా బృందం బస్సులో బయలుదేరింది. కోహ్లిని చూడగానే అభిమానుల్లో మరింత జోష్‌ వచ్చింది.

ICC T20 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్, టి20 ప్రపంచకప్‌ నుంచి స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అవుట్, మళ్లి తిరగబెట్టిన గాయం

Hazarath Reddy

టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్‌ తగిలింది. టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడని బీసీసీ వర్గాలు నుంచి వచ్చిన సమాచారం.

India vs South Africa 1st T20: తొలి టీ 20 మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా, 1-0 ఆధిక్యంతో సిరీస్ శుభారంభం..

kanha

టీమిండియా బౌలర్ల అద్భుతమైన బౌలింగ్ తర్వాత, KL రాహుల్ , సూర్యకుమార్ యాదవ్ , బ్రిలియంట్ ఇన్నింగ్స్ కారణంగా, భారత క్రికెట్ జట్టు మొదటి T20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (IND v SA)ని 8 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Advertisement

HCA: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై మరో కేసు, టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఫిర్యాదు చేసిన యువకుడు, కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదయింది. గత ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో టీ 20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఓ యువకుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Hyderabad Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ హైదరాబాద్ పోలీసులు ఏం చేశారో తెలుసా, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌ ఫోటోలనే వాడేశారు

Hazarath Reddy

హైదరాబాద్‌ పోలీసులు ట్విట్టర్లో ఫన్నీ ఇమేజెస్ ట్వారా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పిస్తున్న సంగతి విదితమే. పాపులర్‌ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు చెబుతూ వారిని చైతన్యవంతం చేస్తుంటారు.

Indian Cricketers Josh: భారత క్రికెటర్లకు రామ్ చరణ్ విందు పార్టీ.. ఇంట్లో సందడే సందడి..

Jai K

రామ్ చరణ్ ఇంట భారత క్రికెటర్లు దర్శనమిస్తే..? సరిగ్గా ఇదే జరిగింది. ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ విజయం తర్వాత.. మన క్రికెటర్లు రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు.. అవును..

IND vs AUS 3rd T20I : ఆసిస్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ, రఫ్పాడించిన సూర్యకుమార్ యాదవ్- విరాట్ కోహ్లీ, బౌండరీతో విన్నింగ్ షాట్ కొట్టి పాండ్యా, 2-1తో సిరీస్ భారత్ కైవసం

Naresh. VNS

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో (IND vs AUS 3rd T20I ) ఆస్ట్రేలియాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ (INDIA WIN) కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సిరీస్ ను (Series Win) కూడా కైవసం చేసుకుంది.

Advertisement

చారిత్రక విజయంతో జులన్‌కు వీడ్కోలు.. ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్.. కెరియర్‌లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి

Jai K

చారిత్రక విజయంతో జులన్‌కు వీడ్కోలు.. ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్.. కెరియర్‌లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి.. 169 పరుగుల స్వల్ప స్కోరును అద్భుతంగా కాపాడుకున్న భారత్.. బంతులతో నిప్పులు చెరిగిన భారత బౌలర్లు

India vs Australia, 2nd T20I: రెండో టీ-20లో దుమ్మురేపిన టీమిండియా, రోహిత్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌ తో భారత్‌కు విక్టరీ, నాలుగు బాల్స్ ఉండగానే ఇండియా గెలుపు, ఆసిస్‌తో సిరీస్‌ సమం

Naresh. VNS

లక్ష్యఛేదనను టీమిండియా దాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే 20 పరుగులు సాధించి తన ఉద్దేశాన్ని చాటింది. కేఎల్ రాహుల్ 10, కోహ్లీ 11, పాండ్యా 9 పరుగులు చేశారు. ఆఖర్లో భారత్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా, తొలి బంతిని సిక్స్, రెండో బంతిని ఫోర్ కొట్టిన దినేశ్ కార్తీక్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే భారత్ ను విజయతీరాలకు చేర్చాడు.

T20 Tickets: హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ అలర్ట్.. ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలి.. హెచ్ సీఏ కీలక ప్రకటన

Jai K

ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదివరకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని తెలిపింది.

IPL: 2023లో ఇంటా-బయట మ్యాచ్ లు.. ఐపీఎల్ పై కీలక ప్రకటన చేసిన గంగూలీ.. మహిళల ఐపీఎల్ తొలి సీజన్ వచ్చే ఆరంభంలోనే ఉంటుందని వెల్లడి

Rudra

ఐపీఎల్ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరిమిత మైదానాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ ను తిరిగి మునుపటి ఫార్మాట్ లో నిర్వహిస్తామని ప్రకటించారు. 2023 సీజన్ ఐపీఎల్ లో ఇదివరకటిలా ఇంటా, బయట మ్యాచ్ లు జరుగుతాయని చెప్పారు.

Advertisement

Babar New Record: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్.. టీ20ల్లో వేగంగా 8 వేల మార్కు దాటిన రెండో ఆటగాడి రికార్డు.. విరాట్ ను మూడో స్థానానికి నెట్టిన పాకిస్థాన్ కెప్టెన్.. ఇంగ్లండ్ తో రెండో టీ20లో పాక్ ఘన విజయం

Jai K

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20ల్లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఫార్మాట్ లో వేగంగా 8000 పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లీ అధిగమించి రెండో స్థానానికి దూసుకెళ్లాడు.

Hyderabad: ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి పేటిఎం ఇన్ సైడర్లో టికెట్ల విక్రయాలు, మంత్రి మందలింపుతో దిగొచ్చిన హెచ్‌సీఏ

Hazarath Reddy

సరైన ప్రణాళిక లేకుండానే భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాన్ని చేపట్టిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మందలింపుతో ఎట్టకేలకు దిగివచ్చింది

IND Vs AUS Tickets Stampede:హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదు, 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి, జింఖానా తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

Hazarath Reddy

జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ (HCA) పూర్తిగా విఫలమైందని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (minister srinivas goud) మండిపడ్డారు.హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

IND vs AUS 3rd T20: జింఖానా ఘటనలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ వైఫల్యంపై పోలీసులు సీరియస్, హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశం

Hazarath Reddy

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌(HCA) ఘోర వైఫల్యంపై పోలీసులు సీరియస్‌గా అయ్యారు. ఆసీస్‌-భారత్‌ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్‌ కోసం సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద హెచ్‌సీఏ (Hyderabad Cricket Association (HCA)ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది

Advertisement
Advertisement